TRS Party: తెలంగాణలో ఇప్పటికే వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల కోసం ఆ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. తెలంగాణలో మొత్తం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలలో 31 రిజర్వుడ్ సీట్లు ఉన్నాయి. ఇందులో 19 సీట్లు ఎస్సీలకు, 12 సీట్లు ఎస్టీలకు రిజర్వ్ చేశారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ పార్టీ 16 ఎస్సీ…
CM KCR: మొన్న బీహార్ వెళ్లొచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ రానున్న రోజుల్లో మరిన్ని రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా పశ్చిమ బెంగాల్ వెళ్లనున్నారని సమాచారం. అనంతరం.. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలను సందర్శిస్తారని వార్తలొస్తున్నాయి. 'బీజేపీ ముక్త్ భారత్' నినాదంతో విపక్షాలను ఏకం చేసేందుకు, 2024 జనరల్ ఎలక్షన్లో అధికార పార్టీ కమలానికి చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.