Harassment: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్లో దారుణం చోటు చేసుకుంది. మేనల్లుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసేందుకు అతని ఇంటికి వెళ్లగా, ఆమె భర్త మరియు అతని కుటుంబ సభ్యులు సదరు వివాహితపై దాడి చేసి తల గుండు గీయించారు.
ఫిర్యాదు చేసేందుకు వస్తే.. పోలీసులు నిరాకరించారని ఓ వ్యక్తి కోపంతో రగిలిపోయి తహశీల్దార్ వాహనానికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రాగా.. ఆమె ఫిర్యాదును స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారు. ఈ క్రమంలో.. మనస్తాపం చెందిన ఆ మహిళ కొడుకు ప్రభుత్వ వాహనానికి నిప్పుపెట్టాడు. నిందితుడు పృథ్వీరాజ్ గా గుర్తించారు.
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో మహిళ అనుమానాస్పద మృతి కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు గుంటూరు పోలీసులు.. అయితే, విచారణలో షాకింగ్ విషాలు వెలుగు చూశాయి.. డబ్బులు అప్పు తీసుకుని, అడిగితే ఆ మహిళల ముఠా హత్యలు చేస్తున్నట్టు గుర్తించారు..
TDP Office Attack Case: గుంటూరు జిల్లాలోని తెలుగు దేశం కేంద్ర కార్యాలయం పై దాడి ఘటనలో కీలక నేతల అరెస్టుపై ఉత్కంఠ కొనసాగుతుంది. కొంత మంది కీలక నేతలను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అసత్య ప్రచారాలను పోలీసు అధికారులు కొట్టి పారేస్తున్నారు.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజిపుర్లో దారుణం చోటు చేసుకొంది. ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవరే పేషెంట్ భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించి.. ఆమె భర్తకు పెట్టిన ఆక్సిజన్ను తొలగించడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
యుపిలోని మదర్సాలకు ఉగ్రవాద సంబంధాలపై తరచూ ఆరోపణలు వస్తుంటాయి. అయితే తాజాగా ప్రయాగ్రాజ్లోని ఒక మదర్సా నుంచి ఓ సంచలనాత్మక వార్త వెలుగులోకి వచ్చింది. ఈ మదర్సా నకిలీ నోట్లను ముద్రించే ఫ్యాక్టరీగా మారింది.
Botsa Satyanarayana: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్కు అండగా న్యాయ సహాయం కోసం గుడివాడ మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ వెళ్లారు. అయితే, అక్కడ వారిపై కార్లపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి చేయడం దారుణమని ఎమ్మెల్సీ బొత్స నారాయణ అన్నారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. మున్నేరు వరద ఉదృతితో నేషనల్ హైవే పై వరద నీరు చేరింది. దీంతో నందిగామ మండలం ఐతవరం గ్రామం దగ్గర 65వ జాతీయ రహదారి పైకి వరద ప్రవాహం కొనసాగుతుంది. నేషనల్ హైవేపై వరద నీరు చేరటంతో నందిగామ పోలీసులు రాకపోకలను పూర్తిగా నిలిపి వేశారు.
Car Wash: మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ పోలీసు తన కారును కడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు ప్రశ్నలు సంధించారు. విశేషమేమిటంటే.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ సప్కల్ కూడా వీడియోను షేర్ చేశారు. పోలీసు దుర్వినియోగానికి…
ముంబై నటి కాదంబరి జత్వానీ ఇవాళ విజయవాడకు వచ్చే ఛాన్స్ ఉంది. ఐపీఎస్ అధికారులు తనను తన ఫ్యామిలీని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపణలు చేస్తోంది జత్వానీ. ప్రభుత్వం విచారణకు ఆదేశించటంతో ఈరోజు విజయవాడ సీపీ రాజశేఖర్బాబును జత్వానీ కలుస్తుందని సమాచారం.