Botsa Satyanarayana: రాష్ట్రంలో ఆటవిక పాలన.. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది..!
- రాష్ట్రంలో శాంతి భద్రతలు సన్నగిల్లుతున్నాయి..
- పార్టీ నాయకులకు ఏమైనా జరిగితే దానికి పోలీసులు బాధ్యత వహించాలి..
- రాష్ట్రంలో ఆటవిక పాలనకు ఇలాంటి ఈ ఘటనలు నిదర్శనం: బొత్స సత్యనారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్కు అండగా న్యాయ సహాయం కోసం గుడివాడ మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ వెళ్లారు. అయితే, అక్కడ వారిపై కార్లపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి చేయడం దారుణమని ఎమ్మెల్సీ బొత్స నారాయణ అన్నారు. గుడివాడలో మాజీ మంత్రి పేర్నినాని వాహనాలపై దాడులు, దౌర్జన్యాలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు. ఈ ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీకి మాజీమంత్రి ఫోన్ చేశారు. పోలీసుల తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆటవిక పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతుంది.. గుడివాడలో మాజీ మంత్రి పేర్నినాని లక్ష్యంగా రెండు సార్లు దాడులు చేశారు. కార్లపై దాడి చేసి అద్దాలు పగలగొట్టిన టీడీపీ, జనసేన నేతలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసుల సమక్షంలోనే దౌర్జన్యం, దాడులు జరిగాయని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
Read Also: Paris Paralympics: భారత పారాలింపిక్ పతక విజేతలతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని..
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
ఇక, ఈ దాడుల విషయం తెలుసుకుని టిడ్కో గృహాల దగ్గర మరో కారును ఉంచిన మాజీమంత్రి పేర్నినాని డ్రైవర్.. ఆ విషయం తెలుసుకుని.. అక్కడకు వెళ్లి మరీ కారుపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి చేశారని బొత్స నారాయణ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సన్నగిల్లుతున్నాయి.. వైసీపీ పార్టీ నాయకులకు ఏమైనా జరిగితే దానికి పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుంది అని ఆయన అన్నారు. పోలీసులు తమ కర్త్యవాన్ని నిర్వహించి వారికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆటవిక పాలనకు ఇలాంటి ఈ ఘటనలు నిదర్శనం అని బొత్స సత్యనారాయణ అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!