Case against Pawan Kalyan : జగసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై కేసు నమోదైంది. ర్యాష్ డ్రైవింగ్ తో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఫిర్యాదు రావడంతో ఆయనపై తాడేపల్లి పోలీసులు కేస్ బుక్ చేశారు.
Uttar Pradesh: కిడ్నీలో ప్రాబ్లం ఉందని ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. అక్కడి వైద్యులు చేసిన తనకు చేసిన ఘనకార్యం తెలిసి షాకయ్యాడు. కిడ్నీ లో రాళ్లు ఉన్నాయని హాస్పిటల్ కి వెళ్తే .. ఏకంగా కిడ్నీనే కొట్టేశారు అక్కడి ఘనులు.
ఈ నెల 11, 12 తేదీల్లో ఆయన పర్యటన కొనసాగనుంది.. నిరసనలకు అవకాశం ఉన్న నేపథ్యంలో.. పటిష్ట చర్యలు చేపడుతున్నారు పోలీసులు.. సాగర నగరం ఇప్పటికే పోలీస్ వలయంలా మారింది.
Police Attacked Women: ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. మహిళలని చూడకుండా పోలీసులు వారిపై కర్రలు, లాఠీలతో దాడిచేశారు. ఇప్పుడు ఇదే విషయం విమర్శలకు దారితీస్తోంది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠరేపుతున్న మునుగోడు ఉపఎన్నికకు పోలీసులు పటిష్ఠ భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా కేంద్ర, రాష్ట్ర బలగాలు పహారా కాస్తున్నాయి.
తిరుపతిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు.. దంపతుల కళ్లలో కారం కొట్టి.. ఆ పై కత్తితో దాడికి దిగారు.. పుంగనూరు మండల పరిధిలో చోటుచేసుకుంది ఈ ఘటన… మృతుని భార్య అనురాధ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని నెక్కుంది గ్రామానికి చెందిన రెడ్డప్ప కుమారుడు దాము 25 తన భార్య 23 అనురాధతో కలిసి అత్తగారింటికి వెళ్లి తిరిగి ప్రయాణం అయ్యారు.. సాయంత్రం ఏడు గంటల సమయంలో తుర్లపల్లి గ్రామ సమీపాన ఉన్న దొనబండ ప్రాంతానికి…
విజయవాడలో ఏడాది క్రితం జరిగిన బిల్డర్ హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది... విజయవాడ శివార్లలోని 61వ డివిజన్ పాయకాపురం దేవినేని గాంధీపురంలో హత్యకు గురైన బిల్డర్ పీతల అప్పలరాజు హత్య మిస్టరీని పోలీసులు చేధించారు.
టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న నిరాహార దీక్షను భగ్నం చేశారు పోలీసులు.. ఉత్తరాంధ్ర ప్రజా సమస్యలపై పోరాటం కోసమంటూ బుద్దా వెంకన్న బయలుదేరగా.. పోలీసులను ఆయన్ని అడ్డుకున్న విషయం తెలిసిందే.. దానికి నిరసనగా నిరాహార దీక్ష చేపట్టారు వెంకన్న.. ఉత్తరాంధ్రలో టీడీపీ నాయకులు పోరాడితే వైసీపీ నేతల దోపిడి బయటపడుతుంది అనే భయంతో.. ఇలా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.. అయితే, తన నివాసంలోనే నిరాహార దీక్షకు దిగిన బుద్దా వెంకన్నను అర్ధరాత్రి ఆస్పత్రికి తరలించారు పోలీసులు..…