ఇవాళ్టి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి ఆగస్టు 13 వరకు ఈ సమావేశాలు జరగబోతున్నాయి. మొత్తం 20 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల సభ్యులు పార్లమెంటు ఉభయసభలలో చాలా కఠినమైన, పదునైన ప్రశ్నలను అడగాలని కోరుకుంటున్నానని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుందని చెప్పిన మోడీ… ప్రజల నమ్మకాన్ని బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే…
సీనియర్ పొలిటిషన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు.. సుమారు 50 నిమిషాల పాటు ఇద్దరి మధ్య చర్చలు జరగడంతో.. ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.. సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాల కాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. సమావేశాలు సజావుగా సాగడానికి అధికారపక్షం ప్రతిపక్ష నేతలతో సంప్రదింపులు జరుపుతూ వస్తోంది.. దానిలో భాగంగానే మోడీ-పవార్ భేటీ జరిగినట్టు చెబుతున్నారు.. ఇక, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్ కూడా…
కేంద్ర కేబినెట్లో భారీ ప్రక్షాళన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. కొత్తగా 43 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయగా.. 15 మంది కేబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక, తాజాగా మంత్రులకు శాఖలు కేటాయించారు.. నరేంద్ర మోడీ – ప్రధానమంత్రి, శాస్త్ర సాంకేతిక శాఖను పర్యవేక్షించనున్నారు. రాజ్నాథ్ సింగ్ – రక్షణ శాఖ అమిత్షా – హోంశాఖ, సహకారశాఖ నితిన్ గడ్కరీ – కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ…
ఇప్పటి వరకు సహాయ మంత్రిగా పనిచేసిన కేంద్రమంత్రి కిషన్రెడ్డికి ప్రమోషన్ వచ్చింది.. ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్లో చోటు దక్కింది.. ఇవాళ రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు కిషన్రెడ్డి.. కాగా, సికింద్రాబాద్ నుంచి తొలిసారి లోక్సభకు ఎన్నికైన కిషన్ రెడ్డిని.. కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు సహాయకుడిగా సహాయ మంత్రిత్వశాఖను కిషన్ రెడ్డికి అప్పగించారు. విధి నిర్వహణలో కీలకంగా వ్యవహరించి ఇద్దరి…
తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం రోజురోజుకీ మరింత ముదురుతూనే ఉంది… ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, కేఆర్ఎంబీకి లేఖలు రాసిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు.. పదేపదే కేంద్ర జలశక్తి శాఖకు, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసినా.. వివాదాలు పరిష్కారం కావటం లేదని లేఖ ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణ అక్రమంగా వాడేస్తోందని దీనిని తక్షణం ఆపేలా చర్యలు చేపట్టాలని కోరారు.. ఉమ్మడి…
పశ్చిమ బెంగాల్లో భారీ వర్షం కురిసింది.. ఉరుములు, మెరుపులతో పిడుగులే కురుస్తున్నాయా? అనే తరహాలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాయి.. అంతే కాదు.. ఈ పిడుగు పాటుకు ఒకే రోజు ఏకంగా 20 మంది మృతిచెందగా.. మరికొంతమంది గాయాలపాలయ్యారు.. దక్షిణ బెంగాల్లోని కోల్కతాతో పాటు పలు జిల్లాల్లో భారీ ఉరుములు, మెరుపులతో ఇవాళ సాయంత్రం వర్షం కురిసింది.. పిడుగుపాటుకు ముర్షిదాబాద్లో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. హుగ్లీలో మరో 9 మంది మృతిచెందారు.. ఇక, మిడ్నాపూర్ జిల్లాలో మరో…
డీఏపీ ధరలు పెరుగుతూ రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.. అయితే, కేంద్రం ప్రభుత్వం ఇవాళ రైతులకు అనుకూలంగా చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది.. డీఏపీ ఎరువు ధరలను భారీగా పెంచేందుకు నిర్ణయించిన మోడీ సర్కార్.. అదే సమయంలో.. పెరిగిన భారాన్ని రైతులపై మోపకుండా సబ్సిడీ రూపంలో తామే భరిస్తామని పేర్కొంది. డీఏపీపై ప్రభుత్వ సబ్సిడీని కేంద్ర సర్కార్ 140 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. అంటే.. ఇప్పటి వరకు డీఏపీ బ్యాగ్ ధర రూ. 1,700 ఉండగా.. రూ.…
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సిఎం కెసిఆర్ కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా రాష్ట్రంలో ఆక్సీజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, బెడ్లు, ఇతర కరోనా సౌకర్యాల పరిస్థితి గురించి అధికారులను సీఎం కెసిఆర్ అడిగి తెలుసుకున్నారు. అయితే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్తో సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణకు పలు సూచనలు చేశారు. సీఎం కేసిఆర్తో ఫోన్లో మాట్లాడిన హర్షవర్థన్ ప్రధానితో చర్చిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే సమీక్షా సమావేశానంతరం…
ఏపీ సీఎం జగన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, నియంత్రణ పై సీఎం జగన్ తో చర్చించారు ప్రధాని. ఏపీతో పాటు తెలంగాణ, ఒరిస్సా, ఝార్ఖండ్ ముఖ్యమంత్రులు, పుదుచ్చేరి, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ లతోనూ మాట్లాడాడు మోదీ. అయితే కోవిడ్ వైరస్ విస్తరణ, నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై చర్చించిన సీఎం, పీఎమ్.. కోవిడ్ వైరస్ నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, వైరస్ సోకిన వారికి అందిస్తున్న వైద్య సదుపాయాలను ప్రధానికి…