దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి దూసుకెళ్తున్నాయి. రికార్డుస్థాయిలో ధరలు పెరుగుతుండటంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని ప్రభావం కేంద్రంపైనా పడుతోంది. 2020-21లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 85 డాలర్లకు చేరడంతో … దేశం క్రూడాయిల్ దిగుమతి బిల్ ఏకంగా మూడు రెట్ల పెరిగింది. ఈ పరిస్థితుల్లో దేశీయంగా ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి పెంచడంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ రంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రయత్నిస్తోంది. ప్రధాని మోడీ .. 30 ప్రపంచ ఆయిల్ దిగ్గజ…
కరోనా ఎంట్రీతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న సంగతి అందరికీ తెల్సిందే. గత రెండుళ్లుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది. కరోనా దాటికి లక్షలాది మంది మృత్యువాతపడగా, కోట్లాది మంది ఉద్యోగాల్లేక వీధిన పడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు వారిపై మరింత పన్నుల భారం మోపుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డిజీల్, వంట గ్యాస్ ధరలు సామాన్యుడి జీవితాన్ని ప్రశ్నార్ధకంగా మారుస్తున్నాయి. చమురు కంపెనీలు…
ప్రధాని నరేంద్ర మోడీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. బీసీ జన గణన చేపట్టాలని ప్రధానిని లేఖలో కోరారు చంద్రబాబు. బీసీలకు సంబంధించిన సరైన డేటా లేకపోవడంతో ఆ వర్గాలకు అన్యాయం జరుగుతోందని… ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా బీసీలు అన్ని రకాలుగా వెనకబడే ఉంటున్నారని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. బీసీ జన గణన పక్కాగా జరిగితేనే బీసీలకు సంక్షేమ ఫలాలు అందుతాయని.. బీసీ జన గణన చేపట్టాలని గత ప్రభుత్వ హయాంలోనే అసెంబ్లీలో…
ప్రధాని నరేంద్ర మోడీపై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మోడీ చేతకానిపాలనతో దేశం మొత్తం అతలాకుతలమైందని ఆరోపించారు.. కేంద్రమంత్రి కొడుకు ఆశిష్ మిశ్ర రైతులపై కారు ఎక్కించి చంపేశారు… సీసీ కెమెరాల్లో కేంద్రమంత్రి కొడుకు అడ్డంగా దొరికితే ప్రధాని వెంటనే ఎందుకు స్పందించలేదని నిలదీశారు.. సుప్రీంకోర్టు స్పందిస్తే కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా..? జైలులో కేంద్రమంత్రి కొడుక్కి రాజభోగాలా..? అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. దీంతో.. వ్యాక్సినేషన్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తోంది.. ఇక, ప్రైవేట్లోనూ వ్యాక్సిన్కు అనుమతి ఇచ్చారు.. అయితే, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అరుదైన ఘనత సాధించేందుకు సిద్ధమైంది భారత్.. వచ్చే వారం వంద కోట్ల డోసుల మార్క్ను అందుకోనుంది… రానున్న సోమవారం లేదా మంగళవారం నాటికి ఈ కీలక మైలురాయిని భారత్ చేరుకుటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.. ఇక,…
పాలమూరు సభలో రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు నుంచి 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించి… ఈ రాష్ట్రం తలరాత మార్చే అవకాశం తనకు ఇవ్వాలని కోరారు. లక్షా 93 వేల ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఇవ్వాలని.. 4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇచ్చే అవకాశం ఇవ్వాలని అన్నారు. అలాగే, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసే అవకాశం ఇవ్వాలని కోరారు రేవంత్ రెడ్డి. మరోవైపు, పరాయి రాష్ట్రం ప్రాజెక్టులపై దృష్టిపెడితే.. ఇక్కడే ఏడేళ్లుగా…
దేశంలో నెలకొన్న బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిన్నటి రోజున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బొగ్గు, విద్యుత్ శాఖ మంత్రులతో సమావేశం నిర్వహించారు. దేశంలో బొగ్గు సంక్షోభం లేదని, తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని ప్రకటించారు. కాగా, ఈరోజు ప్రధాని మోడి అధ్యక్షతన మరోసారి సమీక్ష నిర్వహించబోతున్నారు. విద్యుత్, బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శులతో ప్రధాని సమీక్షను నిర్వహిస్తున్నారు. దేశంలోని థర్మల్…
ప్రధాని నరేంద్ర మోడీ-కేంద్ర హోంశాఖ అమిత్షా ద్వయానికి గుజరాత్ రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వంలోనూ ప్రత్యేక స్థానం ఉంది.. ఆ ఇద్దరు కలిసి ఎన్నో విజయాలను అందుకున్నారు.. మోడీ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా కలిపి 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఓ టీవీ చానెల్తో ప్రత్యేంగా మాట్లాడిన అమిత్ షా.. ప్రధాని మోడీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను బటయపెట్టారు.. మోడీ నియంత కాదని, తనకు తెలిసిన అత్యంత ప్రజాస్వామిక నేతల్లో ఒకరని పేర్కొన్న ఆయన.. మోడీ…
వీణవంక మండలం గన్ముకల గ్రామంలో టీఆర్ఎస్ నేత పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ… ఉద్యమ కారుడైన గెల్లు.శీను తో 2004 నుండి నాకు పరిచయం ఉంది. గెల్లు శీను ను భారీ మెజారిటీతో గెలిపించాలి అన్నారు. విదేశాల నుంచి నల్లధనం తీసుకు వస్తానని మాట తప్పారు నరేంద్రమోడీ అని అన్నారు. డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానిది. కాంగ్రెస్ బీజేపీలు అధికారం ఉన్న రాష్ట్రాలలో 24 గంటల కరెంటు ఎందుకు లేదో చెప్పాలి. రెండు…
నోటు అనగానే మరకు దానిపై మహాత్మగాంధీ బొమ్మ గుర్తుకు వస్తుంది. గాంధీ బొమ్మ లేకుంటే ఆ నోటు చెల్లుబాటు కాదు. అయితే, ఇప్పుడు ఆ గాంధీ బొమ్మను తొలగించాలని రాజస్థాన్కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్పూర్ డిమాండ్ చేస్తున్నాడు. ఈ విషయంపై ప్రధానికి లేఖ కూడా రాశారు. రూ.2000, రూ.500 నోట్లను అవినీతితో పాటుగా బార్లలోనూ వినియోగిస్తున్నారని, అలా ఉపయోగించే వాటిపై గాంధీ మహాత్ముడి బొమ్మ ఉండడం మంచిది కాదని లేఖలో పేర్కొన్నారు.…