భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలను తానే పరిష్కరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వ్యాఖ్యానించారు. వైట్హౌస్లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు.
Amrit Railway Stations: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 22 (గురువారం) నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 103 పునర్వికసిత రైల్వే స్టేషన్లను ప్రారంభించారు. రూ.1,100 కోట్ల వ్యయంతో పునర్నిర్మాణమైన ఈ రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ABSS) లో భాగంగా అభివృద్ధి చెంది ప్రయాణికులకు ఆధునిక వసతులతో కూడిన హబ్లుగా మారనున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 86 జిల్లాల్లో ఉన్న ప్రధానమైన, చిన్న రైల్వే స్టేషన్లు…
యోగాలో ఏపీ ట్రెండ్ సెటర్గా ఉండాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. స్కూళ్లు తెరిచిన వెంటనే యోగా ప్రారంభం అవ్వాలన్నారు.. ఒక సిలబస్ గా యోగ ఉండాలన్నారు.. గ్రామ స్థాయిలో కూడా కమిటీలు వేసి యోగాపై ప్రచారం నిర్వహిస్తామన్నారు.. ఒత్తిడి తగ్గించడానికి యోగా ఒక్కటే మార్గం అన్నారు సీఎం చంద్రబాబు.. అంతర్జాతీయ యోగా డేలో 2 కోట్ల మంది భాగస్వామ్యం కావాలన్నారు.. ప్రధాని మోడీ యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని ప్రశంసలు కురిపించారు..
Jairam Ramesh: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి, ప్రజలను మభ్య పెట్టేందుకే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఎంపీలను విదేశాలకు పంపిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపణలు చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సోషల్ మీడియాలో యుద్ధం కొనసాగుతుంది. ఇక, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ముఖాన్ని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తో జత చేసి 'వన్ అజెండా' అని రాసిన పోస్టర్ను కమలం పార్టీ సమాచార్ శాఖ చీఫ్ అమిత్ మాల్వియా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Mallikarjun Kharge: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకుల ప్రాణాలు రక్షించడంతో కేంద్రం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ ‘‘చిన్న యుద్ధం’’ అని అభివర్ణించారు.
హస్తం పార్టీకి శశిథరూర్ తలనొప్పిగా మారారు. కాంగ్రెస్లో ఉంటూ ప్రత్యర్థి పార్టీ బీజేపీని ప్రశంసిస్తున్నారు. ఇక పాకిస్థాన్ వైఖరిని అంతర్జాతీయ వేదికపై వినిపించేందుకు ఏర్పాటు చేసిన ఏడు బృందాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్కు బాధ్యతలు అప్పగించారు.
Congress vs BJP: ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. తాజాగా రైల్వే ఈ- టికెట్లపై ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన ప్రకటనలు రావడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది.
Narendra Modi : హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని మీర్ చౌక్లో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్కరికి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రధాన్ మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకోగా, మంటల ప్రభావంతో మూడుగురు ఘటనాస్థలిలోనే మృతి…
నరేంద్ర మోడీ పాలనలో భారత జాతి ప్రపంచంలో తలెత్తుకొని తిరుగుతుంది అని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం అభివృద్ధి చెందుతోంది.. ఉగ్ర కుట్రలకు ప్రతిఫలం ఏంటో పాకిస్తాన్ చూసింది.. మా దేశ సమగ్రతను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తే ఎవ్వరిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని సంకేతాలు పాకిస్తాన్ కు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.