PM Modi: నేటినుంచి 8 రోజులు 5 దేశాల్లో మోడీ పర్యటన
- నేటినుంచి 8 రోజులు 5 దేశాల్లో మోడీ పర్యటన
- ఘనా, ట్రినిడాడ్ మరియు టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలో టూర్
- ద్వైపాక్షిక సంబంధాలపై దేశాలతో మోడీ చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ ఒకేసారి ఐదు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. మంగళవారం నుంచి 8 రోజుల పాటు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. ఘనా, ట్రినిడాడ్ మరియు టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో ప్రధాని పర్యటించనున్నారు. జూలై 2-9 తేదీల్లో ఈ పర్యటన కొనసాగనుంది. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే రక్షణ, అరుదైన భూమి ఖనిజాలు, ఉగ్రవాద నిరోధక సహకారంపై చర్చలు ఉండనున్నాయి. ఇక బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో మోడీ పాల్గొననున్నారు.
ఇది కూడా చదవండి: Kareena : పాతికేళ్ల సినీ ప్రయాణం.. అవమానాల నుండి అగ్రస్థానం వరకు
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
తొలుత జూలై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటించనున్నారు. ఘనా అధ్యక్షుడితో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అలాగే ఆర్థిక, ఇంధన, రక్షణ సహకారంపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. జులై 9 వరకు కొనసాగే పర్యటనలో రెండు ఖండాల్లో టూర్ సాగనుంది. ఒకేసారి మోడీ ఇన్ని దేశాల్లో పర్యటించడం ఇది మూడోసారి. 2016లో అమెరికా, మెక్సికో, స్విట్జర్లాండ్, ఆఫ్గానిస్థాన్, ఖతార్లో పర్యటించారు. అలాగే 2015 జులైలో ఎనిమిది రోజుల పాటు ఆరు దేశాల్లో పర్యటించారు. రష్యాతో పాటు మధ్య ఆసియా దేశాల్లో టూర్ కొనసాగింది.
ఇది కూడా చదవండి: Jagapathi Babu : బుల్లితెరపై కొత్త అవతారంలో జగ్గూభాయ్..
జూలై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటించనున్నారు. 3 దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఘనాలో పర్యటించడం ఇదే తొలిసారి. అనంతరం జులై 3, 4 తేదీల్లో ట్రినిడాడ్ మరియు టొబాగోలో పర్యటించనున్నారు. ఇక జులై 4న అర్జెంటీనాకు వెళ్లనున్నారు. 5వ తేదీ వరకు అక్కడే ఉండనున్నారు. జూలై 5-8 వరకు బ్రెజిల్లో పర్యటిస్తారు. బ్రెజిల్లోని రియో వేదికగా జరగనున్న 17వ బ్రిక్స్ సదస్సులో పాల్గొని అభిప్రాయాలను పంచుకోనున్నారు. చివరిగా 9న నమీబియాకు వెళ్లి.. ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. నమీబియా పార్లమెంటులోనూ ప్రసంగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!