PM Modi: నేటినుంచి 8 రోజులు 5 దేశాల్లో మోడీ పర్యటన
- నేటినుంచి 8 రోజులు 5 దేశాల్లో మోడీ పర్యటన
- ఘనా, ట్రినిడాడ్ మరియు టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలో టూర్
- ద్వైపాక్షిక సంబంధాలపై దేశాలతో మోడీ చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ ఒకేసారి ఐదు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. మంగళవారం నుంచి 8 రోజుల పాటు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. ఘనా, ట్రినిడాడ్ మరియు టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో ప్రధాని పర్యటించనున్నారు. జూలై 2-9 తేదీల్లో ఈ పర్యటన కొనసాగనుంది. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే రక్షణ, అరుదైన భూమి ఖనిజాలు, ఉగ్రవాద నిరోధక సహకారంపై చర్చలు ఉండనున్నాయి. ఇక బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో మోడీ పాల్గొననున్నారు.
ఇది కూడా చదవండి: Kareena : పాతికేళ్ల సినీ ప్రయాణం.. అవమానాల నుండి అగ్రస్థానం వరకు
Also Read
తొలుత జూలై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటించనున్నారు. ఘనా అధ్యక్షుడితో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అలాగే ఆర్థిక, ఇంధన, రక్షణ సహకారంపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. జులై 9 వరకు కొనసాగే పర్యటనలో రెండు ఖండాల్లో టూర్ సాగనుంది. ఒకేసారి మోడీ ఇన్ని దేశాల్లో పర్యటించడం ఇది మూడోసారి. 2016లో అమెరికా, మెక్సికో, స్విట్జర్లాండ్, ఆఫ్గానిస్థాన్, ఖతార్లో పర్యటించారు. అలాగే 2015 జులైలో ఎనిమిది రోజుల పాటు ఆరు దేశాల్లో పర్యటించారు. రష్యాతో పాటు మధ్య ఆసియా దేశాల్లో టూర్ కొనసాగింది.
ఇది కూడా చదవండి: Jagapathi Babu : బుల్లితెరపై కొత్త అవతారంలో జగ్గూభాయ్..
జూలై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటించనున్నారు. 3 దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఘనాలో పర్యటించడం ఇదే తొలిసారి. అనంతరం జులై 3, 4 తేదీల్లో ట్రినిడాడ్ మరియు టొబాగోలో పర్యటించనున్నారు. ఇక జులై 4న అర్జెంటీనాకు వెళ్లనున్నారు. 5వ తేదీ వరకు అక్కడే ఉండనున్నారు. జూలై 5-8 వరకు బ్రెజిల్లో పర్యటిస్తారు. బ్రెజిల్లోని రియో వేదికగా జరగనున్న 17వ బ్రిక్స్ సదస్సులో పాల్గొని అభిప్రాయాలను పంచుకోనున్నారు. చివరిగా 9న నమీబియాకు వెళ్లి.. ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. నమీబియా పార్లమెంటులోనూ ప్రసంగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!