ఏపీ సీఎం జగన్ శుక్రవారం నాడు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. రేపు రాత్రికి ఢిల్లీలోనే జగన్ ఉండనున్నారు. ఈనెల 30న శనివారం జరగనున్న జ్యుడిషీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ సదస్సుకు ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీ రమణతో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. దేశంలో న్యాయ, మౌలిక సదుపాయాల కల్పన, కేసుల సత్వర పరిష్కారంపై ఈ సదస్సులో…
టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా జాతీయ రాజకీయాలపై కీలక ప్రకటన చేశారు అధినేత కేసీఆర్. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ అజెండా కావాలని ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాలని ప్లీనరీ తీర్మానం చేసింది. ప్రత్యమ్నాయ ప్రజల అజెండాతో అమెరికా తరహా అభివృద్ధి సాధ్యమన్నారాయన. రాబోయే ఎన్నికల్లో తొంభై శాతం సీట్లు తామే గెలుస్తామని కుండబద్దలు కొట్టారు కేసీఆర్. ఈ ప్లీనరీలో మొత్తంగా 13 తీర్మానాలు ప్రవేశపెట్టారు. అలాగే కేంద్రంపై ఓ రేంజ్లో ఫైరయ్యారు కేసీఆర్. రాష్ట్రం…
దేశవ్యాప్తంగా పెట్రో ధరలపై చర్చ సాగుతూనే ఉంది.. బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు.. బీజేపీయేతర పాలనలో ఉన్న రాష్ట్రాల్లో పెట్రో ధరలు ఎలా ఉన్నాయో తెలుపుతూ.. పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.. ఇక, తెలంగాణలో పెట్రో ధరలకు కారణం ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీయేనని బీజేపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలంగాణ పేరు ప్రస్తావించడంలో మంత్రి కేటీఆర్కు చిర్రెత్తుకొచ్చినట్టుంది.. దీంతో.. ప్రధాని మోడీకి సోషల్ మీడియా…
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల వేగం పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. 2జీ సర్వీసులను 4జీకి మార్చేందుకు రూ. 2,426.39 కోట్ల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 2,343 బీఎస్ఎన్ఎల్ టవర్లను 4జీకి అప్గ్రేడ్ చేయనుంది సర్కార్.. దీంతో, మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టడం కూడా సులభం అవుతుందని…
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు మాదాపూర్లోని హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్నాయి. టీఆర్ఎస్ 21వ ఆవిర్భవ వేడుకల్లో భాగంగా పలు కీలక తీర్మాణాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సమావేశాల్లో మాట్లాడుతూ.. ఈ రోజు దేశంలో జరుగుతున్నటువంటి మత విద్వేషాలు మంచిదా అని ఆయన ప్రశ్నించారు. కుటిల రాజకీయం, పచ్చి రాజకీయ లబ్దితోని, పది మంది పదవుల కోసం విధ్వంసం చేయడం తేలికనే.. కానీ.. నిర్మాణం చేయాలంటే చాలా సమయం పడుతుందన్నారు. ఎవరు అవునన్నా.. కాదన్నా.. కర్ణాటక రాష్ట్రంలో…
కరోనా ప్రారంభమైన తర్వాత ఈ మధ్యే ఏపీలో జీరోకు పడిపోయాయి కోవిడ్ కేసులు.. అయితే, దేశవ్యాప్తంగా మళ్లీ రోజువారి కేసులు పెరగడం మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది.. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.. మరోవైపు, కోవిడ్ పరిస్థితులపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ సమావేశం నిర్వహించారు.. క్యాంప్ కార్యాలయం నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. తాజాగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెరుగుతున్న…
బుర్ర ఉండా.. లేకనా.. తెలివి ఉందా.. లేకనా.. శక్తి సామర్థ్యత ఉండా.. లేక అసమర్థతోనా.. వివేకం ఉందా.. లేక అవివేకమా.. అంటూ టీఆర్ఎస్ 21వ ప్లీనరీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కేంద్రంపై ధ్వజమెత్తారు. ఈ దేశంలో సజీవంగా ప్రవహించే నదులలో ఉన్నటువంటి నీటి లభ్యత 65 వేల టీఎంసీలు అని, ఇంకా 4-5 వేల టీఎంసీలు నీళ్లు టిబెట్ నుంచి రావాల్సి ఉందని, దానిపై ఇంకా లెక్కలు తేలలేదన్నారు. ఇప్పటికే లెక్కించబడి ఉన్న 65 వేల టీఎంసీల…
తెలంగాణ రాష్ట్ర సమితి 21వ అవిర్భవ వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ రోజు దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి సామర్థ్యం 4,01,035 మెగావాట్ల విద్యుత్ శక్తి అందుబాటులో ఉందన్నారు. ఆధునిక సమాజం మొత్తం అభివృద్ధికి సంకేతాలుగా, ప్రగతికి నిదర్శనాలుగా భావించే కొలమానం విద్యుత్ అని, అటువంటి విద్యుత్ శక్తి దేశంలో అందుబాటులో ఉన్నా.. దాన్ని వినియోగించలేని ఆశక్త స్థితిలో భారతదేశం ఉందన్నారు. 4…
టీఆర్ఎస్ ఆవిర్భవ వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని మాదాపూర్లో గల హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరీ వేడుకలకు ఏర్పాటు చేశారు. అయితే ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం ప్రజలకు ఒక్క పనైనా చేసిందా అని ప్రశ్నించారు. బండి సంజయ్ దేనికోసం పాదయాత్ర చేస్తున్నాడో చెప్పాలన్నారు. నల్లధనం తీసుకువస్తామన్నారు, ఉద్యోగాలు ఉస్తామన్నారు, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు, ఇలా వీటిలో ఒక్కటైనా ఇచ్చిన హామీని నేరవేర్చారా అని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో…
మళ్లీ కరోనా టెన్షన్ పెడుతోంది.. థర్డ్ వేవ్ తర్వాత వందల్లోకి పడిపోయిన రోజువారి పాజిటివ్ కేసులు.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి.. వెయ్యిని దాటేసి.. రెండు వేలను కూడా క్రాస్ చేసి.. మూడు వేల వైపు పరుగులు పెడుతున్నాయి.. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ తీవ్రత ఆందోళనకు గురిచేస్తుంది. ఇవాళ 1,204 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరు మృతిచెందారు.. ఇక, దేశవ్యాప్తంగా సోమవారం 2,541 మందికి పాజిటివ్గా తేలింది.. 30 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.…