ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీ నేత, మాజీ గవర్నర్ ద్రౌపతి ముర్మును ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. గురువారం వరసగా ప్రధానితో సహా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడితో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు ద్రౌపతి ముర్ముకు ఘనంగా స్వాగతం పలికారు. ఇదిలా ఉంటే రేపు (జూన్ 24)న…
ఇవాళ ప్రపంచ యోగా దినోత్సవం. ప్రతీ ఏటా జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. యోగా.. ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప కానుక. మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదపడుతుంది. అందుకే ప్రతీ ఏటా జూన్ 21న యోగా ప్రాధాన్యతను తెలియజెప్పేలా కేంద్ర ప్రభుత్వం విశేష కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ యోగా కార్యక్రమాల్లో పాల్గొని.. ప్రజల్లో దాని పట్ల అవగాహన పెంచుతున్నారు. ఈసారి మోదీ కర్ణాటకలోని…
రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై ఎన్డీఏ ముమ్మర కసరత్తు చేస్తోంది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు అధికార, ప్రతిపక్ష కూటముల నుంచి రాష్ట్రపతి అభ్యర్థి పేరు ఖరారు కాలేదు. విపక్షాలు ఇంకా తమ అభ్యర్థిని ఎన్నుకోనప్పటికీ మంగళవారం ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి పేరును మంగళవారం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అధికార పక్షం తర్వాతే విపక్షాలు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. భాజపా…
అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్ సహా ప్రపంచ దేశాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలోని మైసూర్ నుంచి యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో వేకువజామునుంచే ప్రముఖులు సహా సామాన్య ప్రజలు యోగాసనాలు వేస్తున్నారు. మానవత్వం కోసం యోగా(Yoga for humanity) అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కర్ణాటకలో ప్రధాని మోదీ ఈవెంట్లో సుమారు 15 వేల మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రధానితో పాటు కేంద్ర మంత్రి సర్భానంద…
* ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. *అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కర్ణాటకలోని మైసూరులో యోగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ * విజయవాడలో ఆయుష్ విభాగము ఆధ్వర్యంలో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. కార్యక్రమంలో పాల్గొననున్న ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ. *అంతర్జాతీయ యోగాదినోత్సవ సందర్బంగా తిరుపతి ప్రకాశం పార్కులో స్దానికులతో కలిసి యోగా చేయనున్న జిల్లా కలెక్టర్ వెంకటరమణ రెడ్డి *నేటి నుంచి తిరుపతిలో మూడు…
ప్రధాని మోడీ జులై 3వ తేదీన హైదరాబాద్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అయితే మోడీకి తెలంగాణ బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అయితే ఇప్పుడు రికార్డు స్థాయిలో జనసమీకరణ చేసి ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు తెలంగాణ బీజేపీ శ్రేణులు. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లాలో బీజేపీ జాతీయ ఉపధ్యాక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ……
ఈ నెల 21న (రేపు) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ తన సందేశం ఇచ్చారు. ఆరోగ్యం.. శ్రేయస్సు కోసం ప్రజలు యోగాను తప్పకుండా ఆచరించాలని ప్రధాని మోడీ పిలుపు ఇచ్చారు. గుండెపోటు, స్ట్రోక్, థైరాయిడ్, మధుమేహం తదితర జీవన శైలి వ్యాధులు నేటి తరంలో పెరిగిపోతున్నందున యోగాకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని, తమ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కోరారు. యోగాకు సంబంధించి వీడియోను షేర్…
ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ శతవసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మోదీ తన బ్లాగ్లో కొన్ని విషయాలు రాసుకొచ్చారు. తనకు చిన్నతనంలో అబ్బాస్ అనే ఫ్రెండ్ ఉండేవాడని చెప్పుకొచ్చారు. తన తండ్రికు పక్క ఊర్లో ఓ ఫ్రెండ్ ఉండేవాడని, అయితే అతని మరణంతో ఆ ఫ్రెండ్ కుమారుడు అబ్బాస్ను తమ ఇంటికి తీసుకువచ్చాడని, తనతో పాటే ఉంటూ ఆ పిల్లవాడు చదువును పూర్తి చేశాడని, ఈద్ పండగ వేళ తన తల్లి ఆ అబ్బాయికి ప్రేమతో వంటలు చేసేదని…
సైనికుల నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా యువత విధ్వంస చర్యలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో అగ్నిపథ్పై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ స్పందించారు. రైతుల సుదీర్ఘ నిరసనల అనంతరం సాగు చట్టాలను ఉపసంహరించుకున్న కేంద్ర ప్రభుత్వం.. అదే తరహాలో అగ్నిపథ్ స్కీమ్ను వెనక్కి తీసుకోక తప్పదని ఆయన అన్నారు. ప్రధాని మోదీ దేశ యువతకు క్షమాపణ…