PM Modi: 2023లో మణిపూర్లో కుకీలు, మైయితీలకు మధ్య జాతి ఘర్షణలు ప్రారంభయ్యాయి. అప్పటి నుంచి ఆ రాష్ట్రం రావణకాష్టంలా రగులుతూనే ఉంది. ఇప్పుడిప్పుడే శాంతి నెలకొంటోంది. ఘర్షణలు ప్రారంభమైన రెండేళ్ల తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్రమోడీ మణిపూర్ పర్యటనకు వెళ్లుతున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న జమ్మూకాశ్మీర్లోని బారాముల్లా ఎంపీ, ఇంజనీర్ రహీద్పై దాడి జరిగింది. రషీద్పై ట్రాన్స్జెండర్ ఖైదీలు దాడి చేసినట్లుగా జైలు వర్గాలు తెలిపాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్ గురించి గానీ.. మోడీ గురించి గానీ గంటకో మాట మాట్లాడుతున్నారు. అప్పటికప్పుడే విమర్శిస్తుంటారు.. అంతలోనే మాట మారుస్తూ ఉంటారు. భారత్.. అమెరికాకు దూరం అయిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతలోనే మీడియా సమావేశంలో అదేమీ లేదు.. మోడీతో ఎప్పుడూ మంచి స్నేహంగా ఉంటానని చెప్పుకొచ్చారు.
Nag Ashwin : కేంద్ర ప్రభుత్వం సింగిల్ స్క్రీన్లలో రూ.100 వరకు ఉన్న సినిమా టికెట్ల ధరలపై జీఎస్టీని తగ్గించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 12 శాతం ఉన్న జీఎస్టీని 5శాతం వరకు తగ్గించారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రధానమంత్రి మోడీకి కీలక సూచనలు చేశాడు. రూ.100లోపు ఉన్న టికెట్లపై జీఎస్టీని తగ్గించడం చాలా మంచి విషయం అని.. కాకపోతే రూ.250 వరకు ఉన్న టికెట్ ధరలపై జీఎస్టీని తగ్గిస్తే బాగుండేదని అన్నాడు.…
భారత్పై ట్రంప్ కక్ష కట్టినట్లుగా మరోసారి రుజువైంది. ఇప్పటికే సుంకాల పేరుతో భారీ బాదుడు బాదుతున్నారు. తాజాగా వైట్హౌస్ వేదికగా టెక్ సీఈవోలకు ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ విందు సందర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.
PM Modi: భారత్-యూరోపియన్ యూనియన్(ఈయూ) నేతలతో ప్రధాని నరేంద్రమోడీ గురువారం మాట్లాడారు. భారత్-ఈయూ సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్తో సంయుక్త టెలిఫోన్ కాల్ నిర్వహించారు.
US Media: ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోడీ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఏడేళ్ల తర్వాత ప్రధాని మోడీ చైనాలో పర్యటించారు. దీంతో, చైనా కూడా మోడీ రాకకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్తో మోడీ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ ముగ్గురు ప్రపంచ నేతల కలయిక ‘‘సరికొత్త ప్రపంచ క్రమాన్ని’’ ఏర్పాటు చేస్తుందని అంతర్జాతీయంగా…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి హస్తినబాట పట్టనున్నారు.. ఇవాళ రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న ఆయన.. రాత్రి అక్కడే బస చేస్తారు.. ఇక, రేపు అనగా శుక్రవారం రోజు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు మంత్రి లోకేష్.. యోగాంధ్ర నిర్వహణపై ప్రధానికి వివరించనున్నారు.. యోగాంధ్ర పై తయారు చేసిన బుక్ను ఈ సందర్భంగా ప్రధాని మోడీకి అందజేయనున్నారు మంత్రి నారా లోకేష్.
గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్-GSTలో కీలక సంస్కరణలు చోటుచేసుకున్నాయి. సామాన్యుడికి ఊరట కలిగించే పన్ను విధానంలో పునర్వ్యవస్థీకరణకు GST కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. GSTలో ఇప్పటి వరకూ కనిష్ఠంగా 5 శాతం పన్ను, గరిష్ఠంగా 28శాతం పన్నుతో 4 స్లాబులు ఉండేవి. అయితే, 12, 28 శాతం స్లాబుల్ని తొలగించాలని GST కౌన్సిల్ నిర్ణయించింది.