PM Modi: ఆపరేషన్ సిందూర్ ప్రతాపాన్ని జైషే కూడా అంగీకరించింది
- ఆపరేషన్ సిందూర్ ప్రతాపాన్ని జైషే కూడా అంగీకరించింది
- అణు బెదిరింపులకు భయపడేదేలేదన్న మోడీ
ఆపరేషన్ సిందూర్ దెబ్బేంటో పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు రుచి చూశాయని.. ఈ మేరకు జైషే ఉగ్ర సంస్థ అంగీకరించిందని ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని మోడీ బుధవారం 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇక మధ్యప్రదేశ్లోని ధార్లో జరిగిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు.
ఇది కూడా చదవండి: Charlie Kirk: చార్లీ కిర్క్ హత్యపై అపహాస్యం.. టెక్సాస్ వర్సిటీ నుంచి విద్యార్థి బహిష్కరణ
Also Read
- West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
- The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
ఆపరేషన్ సిందూర్ కారణంగా దెబ్బ తిన్నట్లుగా నిన్ననే ఒక పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ వెల్లడించిందని తెలిపారు. భారతమాత భద్రతకు దేశం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. పాకిస్థాన్ ఉగ్రవాదులు మన సోదరీమణుల సిందూర్ను తొలగించారని.. దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసినట్లు చెప్పుకొచ్చారు. మన దళాలు.. పాకిస్థాన్ నడ్డి విరిచాయన్నారు. ఇది కొత్త భారతదేశం అని గుర్తించుకోవాలని హితవు పలికారు. ఎవరి అణు బెదిరింపులకు భయపడేది లేదని మోడీ వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Modi-Congress: కాంగ్రెస్కు హైకోర్టు షాక్.. మోడీ, ఆయన తల్లి వీడియో డిలీట్ చేయాలని ఆదేశం
ఆపరేషన్ సిందూర్తో ప్రధాన కార్యాలయం ధ్వంసమైనట్లుగా జైష్ ఉగ్ర సంస్థ సోమవారం అంగీకరించింది. అంతేకాకుండా జైషే చీఫ్ మౌలానా మసూద్ అజార్ కుటుంబం కూడా హతమైనట్లు వెల్లడించింది. మే 7న భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే పాకిస్థాన్ వైమానిక స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయి.
చారిత్రాత్మక దినం..
ఇక ఈరోజు సెప్టెంబర్ 17 మరో చారిత్రాత్మక దినంగా మోడీ తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కులాంటి దృఢ సంకల్పాన్ని చూపించారన్నారు. భారత సైన్యం హైదరాబాద్ను విముక్తి చేసి దాని హక్కులను కాపాడిందని గుర్తుచేశారు. దశాబ్దాలు గడిచినా ఎవరూ ఈ విజయాన్ని జరుపుకోలేదన్నారు. మన ప్రభుత్వం మాత్రం ఈ కార్యక్రమాన్ని అమరత్వంగా మార్చిందని తెలిపారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు పేర్కొన్నారు.
#WATCH | Dhar, Madhya Pradesh | Addressing a public rally, PM Modi says, "… From September 22, the first day of Navratri, new GST reforms will be implemented. We have to take advantage of them by buying Indian products… Every shop should have a board that says, 'Garv se Kaho,… pic.twitter.com/IcS5vOXii5
— ANI (@ANI) September 17, 2025
తాజావార్తలు
-
West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో