PM Modi: ఆపరేషన్ సిందూర్ ప్రతాపాన్ని జైషే కూడా అంగీకరించింది
- ఆపరేషన్ సిందూర్ ప్రతాపాన్ని జైషే కూడా అంగీకరించింది
- అణు బెదిరింపులకు భయపడేదేలేదన్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సిందూర్ దెబ్బేంటో పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు రుచి చూశాయని.. ఈ మేరకు జైషే ఉగ్ర సంస్థ అంగీకరించిందని ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని మోడీ బుధవారం 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇక మధ్యప్రదేశ్లోని ధార్లో జరిగిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు.
ఇది కూడా చదవండి: Charlie Kirk: చార్లీ కిర్క్ హత్యపై అపహాస్యం.. టెక్సాస్ వర్సిటీ నుంచి విద్యార్థి బహిష్కరణ
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ఆపరేషన్ సిందూర్ కారణంగా దెబ్బ తిన్నట్లుగా నిన్ననే ఒక పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ వెల్లడించిందని తెలిపారు. భారతమాత భద్రతకు దేశం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. పాకిస్థాన్ ఉగ్రవాదులు మన సోదరీమణుల సిందూర్ను తొలగించారని.. దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసినట్లు చెప్పుకొచ్చారు. మన దళాలు.. పాకిస్థాన్ నడ్డి విరిచాయన్నారు. ఇది కొత్త భారతదేశం అని గుర్తించుకోవాలని హితవు పలికారు. ఎవరి అణు బెదిరింపులకు భయపడేది లేదని మోడీ వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Modi-Congress: కాంగ్రెస్కు హైకోర్టు షాక్.. మోడీ, ఆయన తల్లి వీడియో డిలీట్ చేయాలని ఆదేశం
ఆపరేషన్ సిందూర్తో ప్రధాన కార్యాలయం ధ్వంసమైనట్లుగా జైష్ ఉగ్ర సంస్థ సోమవారం అంగీకరించింది. అంతేకాకుండా జైషే చీఫ్ మౌలానా మసూద్ అజార్ కుటుంబం కూడా హతమైనట్లు వెల్లడించింది. మే 7న భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే పాకిస్థాన్ వైమానిక స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయి.
చారిత్రాత్మక దినం..
ఇక ఈరోజు సెప్టెంబర్ 17 మరో చారిత్రాత్మక దినంగా మోడీ తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కులాంటి దృఢ సంకల్పాన్ని చూపించారన్నారు. భారత సైన్యం హైదరాబాద్ను విముక్తి చేసి దాని హక్కులను కాపాడిందని గుర్తుచేశారు. దశాబ్దాలు గడిచినా ఎవరూ ఈ విజయాన్ని జరుపుకోలేదన్నారు. మన ప్రభుత్వం మాత్రం ఈ కార్యక్రమాన్ని అమరత్వంగా మార్చిందని తెలిపారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు పేర్కొన్నారు.
#WATCH | Dhar, Madhya Pradesh | Addressing a public rally, PM Modi says, "… From September 22, the first day of Navratri, new GST reforms will be implemented. We have to take advantage of them by buying Indian products… Every shop should have a board that says, 'Garv se Kaho,… pic.twitter.com/IcS5vOXii5
— ANI (@ANI) September 17, 2025
తాజావార్తలు
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
-
Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
-
Archana: బిగిల్ నిర్మాతకు సీఎం విజయ్ కీలక పదవి
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!