ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతులను కేంద్ర సర్కార్ మరోసారి చర్చలకు పిలిచింది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని రైతు సంఘాలకు సూచన చేసింది.
పేపర్ లీకుల నిరోధక బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. పేపర్ లీక్ కేసుల విచారణను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారులు నిర్వహించాల్సి ఉంటుంది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్పై ప్రశంసలు కురిపించారు. నా ‘సోదరుడు’ అంటూ సంబోధించారు. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడాలని ఆకాంక్షించారు. యూఏఈ ప్రెసిడెంట్తో చర్చల తర్వాత అబుదాబిలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ‘ అల్హన్ మోడీ’ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. తాను తొలిసారి ప్రధాని అయిన తర్వాత 2015లో యూఏఈ పర్యటనను ప్రధాని గుర్తు…
యూఏఈలోని (UAE) అబుదాబిలో (Abu Dhabi) మంగళవారం జరిగిన ‘అహ్లాన్ మోడీ’ (Ahlan Modi) కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ స్టేడియంలోకి మోడీ ఓపెన్ టాప్ వాహనంలో ప్రవేశించి అందరికీ అభివాదం చేశారు.
PM Surya Ghar Yojana: ‘‘ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ’’పేరుతో ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ప్రకటించారు. కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం కోసం రూఫ్టాఫ్ సోలార్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. రూ. 75,000 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. సబ్సీడీలు, భారీ రాయితీలను నేరుగా ప్రజల ఖాతాలకు చేరేలా కేంద్రం భరోసా ఇస్తోంది.
ప్రధాని మోడీ (PM Modi) రెండ్రోజుల పర్యటన నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి వెళ్లారు. ప్రస్తుతం ఆయన అబుదాబిలో (Abu Dhabi) పర్యటిస్తున్నారు. కానీ అక్కడ పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Mithun Chakraborty: ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ నాయకుడు మిథున్ చక్రవర్తి అస్వస్థతకు గురైన విషయం తెల్సిందే. శనివారం ఉదయం ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయనను కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 13 నుంచి 14 వరకు యూఏఈలో అధికారిక పర్యటనలో ఉన్నారు. దుబాయ్తో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన ఇక్కడ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. దీంతో పాటు అబుదాబిలో జరిగే కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రధాని మోడీ భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.