Home
Pinnelli Ramakrishna Reddy
Pinnelli Ramakrishna Reddy News
-
Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట.. బెయిల్ మంజూరు
Pinnelli Ramakrishna Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయ్యింది.. గురజాల కోర్టు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. తెలుగుదేశం పార్టీ నాయకుల జంట హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈ క్రిమినల్ కేసు నమోదు చేయబడింది. దీంతో, 98 రోజుల నుంచి నెల్లూరు జైలులో ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. అయితే, ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు… -
Pinnelli Brothers: జంట హత్యల కేసు.. మరోసారి విచారణకు పిన్నెల్లి సోదరులు!
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో మరోసారి విచారణకు హాజరుకావాలంటూ పిన్నెల్లి సోదరులకు మాచర్ల రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు రావాలని నోటీసులలో పేర్కొన్నారు. మూడు నెలల క్రితం గుండ్లపాడులో టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్య కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిలపై వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. Also Read: 2027 World Cup: రోహిత్, కోహ్లీలు… -
Off The Record: వైసీపీలో పినెల్లిని తప్పించడానికి అధిష్టానం చూస్తుందా..?
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. పల్నాడు జిల్లా మాచర్ల నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మొదట కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయినా... వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ చెంత చేరారాయన. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి మాటకు తిరుగులేదన్నట్టుగా ఉండేది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి చేతిలో ఓడిపోయారు పిన్నెల్లి. -
Double Murder Case: అజ్ఞాతంలోకి పిన్నెల్లి బ్రదర్స్..? డబుల్ మర్డర్ కేసులో పోలీసుల గాలింపు..
పల్నాడు జిల్లాలో వెల్దుర్తి మండలం గుండ్లపాడులో TDP నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు సోదరులు దారుణ హత్యకు గురయ్యారు. 15 రోజుల క్రితం వీళ్లను కారుతో గుద్ది చంపారు ప్రత్యర్థులు. ఈ కేసులో గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి శ్రీను, తోట వెంకట్రామయ్య, గురవయ్య, దొంగరి నాగరాజు, తోట వెంకటేశ్వర్లు, గెల్లిపోగు విక్రమ్ లను అరెస్ట్ చేశారు పోలీసులు. -
Ambati Rambabu: టీడీపీ నాయకుల హత్యలకు పిన్నెల్లికి ఏంటి సంబంధం?
తెలుగుదేశం నాయకుల హత్యలకు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఏంటి సంబంధం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రహనించారు. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన స్కార్పియోపై జేబీఆర్ అని ఉందని.. జేబీఆర్ అంటే జూలకంటి బ్రహ్మారెడ్డి కానీ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కాదన్నారు. హత్యకు గురైన వారి బంధువులు కూడా తెలుగుదేశం నాయకులే చంపారని చెప్పారని.. కానీ ఈ హత్యలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామి రెడ్డిని ఇరికించడం దారుణమన్నారు. జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రోద్బలంతోనే… -
Off The Record: ఆ వైసీపీ నేత అజ్ఞాతం నుంచి బయటికొచ్చారా.. జగన్ బూస్ట్ ఇచ్చారా..?
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి కోలుకుంటూ...పార్టీని రీ సెట్ చేసే పనిలో సీరియస్గా ఉన్నారట వైసీపీ అధ్యక్షుడు జగన్. ఆ క్రమంలోనే సీనియర్ నాయకులు ఒక్కొక్కరిని పిలిపించుకుని మాట్లాడుతూ... భరోసా ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ పరంగా చేయాల్సిన అన్ని పనులు గట్టిగానే చేద్దామని ధైర్యం చెబుతుండటంతో... మెల్లిగా ఒక్కొక్కరు అజ్ఞాతం వీడుతున్నారట. -
Pinnelli Ramakrishna Reddy: జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి.. స్వాగతం పలికిన వైసీపీ నేతలు..
నెల్లూరులోని కేంద్ర కారాగారం నుంచి పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలయ్యారు. వివిధ కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.. ఈ ఉత్తర్వుల కాపీని ఈరోజు ఉదయం ఆయన న్యాయవాదులు కేంద్ర కారాగారంలో అందజేశారు. దీంతో అధికారులు ఆయనను విడుదల చేశారు. -
Off The Record : పిన్నెల్లి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిలొచ్చినంత మాత్రాన ఆల్ హ్యాపీస్ కాదా? ఇన్ఫ్రంట్ దేరీజ్ క్రోకడైల్ ఫెస్టివల్ అంటున్నారా? వరుసబెట్టి వస్తున్న ఫిర్యాదులు ముందు ముందు మంట పుట్టించబోతున్నాయా? పిన్నెల్లి చుట్టూ పొలిటికల్ ఉచ్చు గట్టిగానే బిగుస్తోందా? అసలు మాచర్లలో ఏం జరుగుతోంది? మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితులమంటూ ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. భూ కబ్జాలు, బెదిరింపులపై ఫిర్యాదుల పరంపర పెరుగుతోంది. తమను బెదిరించి పిన్నెల్లి, ఆయన అనుచరగణం ఆస్తులు లాక్కున్నారని, వాళ్ళ… -
Nellore: నెల్లూరులోని కేంద్ర కారాగారం వద్ద భద్రతను పెంచిన పోలీసులు
నెల్లూరులోని కేంద్ర కారాగారం వద్ద భద్రతను పోలీసులు పెంచారు. రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెల్లూరు కారాగారం వద్దకు పిన్నెల్లి అనుచరులు తరలివచ్చారు. విడుదలకు సంబందించిన సమయం ముగియడంతో పోలీసులు, పిన్నెల్లి అనుచరులు వెనుదిరిగారు. -
Pinnelli Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం సహా రెండు కేసుల్లో పిన్నెల్లికి ఏపీ ఉన్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
తాజావార్తలు
-
Trisha – Vijay : త్రిష వల్లే విజయ్’కు ఇన్ని ఇబ్బందులా?
-
Vladimir Putin: పుతిన్కు ప్రాణగండం? రష్యాలో సైనిక తిరుగుబాటుకు స్కెచ్!
-
Kakarla Krishna : టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నిర్మాత కన్నుమూత!
-
RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్
-
Rohit Sharma Lady Fan: అభిమాని కోసం వెయిట్ చేసిన రోహిత్ శర్మ.. తబ్బిబైపోయిన యువతి, వీడియో వైరల్!!