Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో వరుస విచారణలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది వరుసగా బిఆర్ఎస్ కీలక నేతలను విచారిస్తున్న సిట్ ఏకంగా గులాబీ బాస్ కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది. నందినగర్ నివాసంలో నోటీసులు అందించి.. ఇవాళ విచారణకు హాజరు కావాలని సిఆర్పిసి 160 కింద ఇచ్చిన నోటీసులో సిట్ కోరింది. అయితే, ఈ సిట్ నోటీసులపై కేసిఆర్ స్పందించారు. ఈరోజు సిట్ విచారణకు హాజరు కాలేనని తేదీని వాయిదా వేయాలని కోరారు.…
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ను విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రంగం సిద్ధం చేసింది. గురువారం నాడు నందినగర్లోని ఆయన నివాసంలో సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. దీనిపై కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తూనే, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కోరుతూ ప్రత్యుత్తరం ఇచ్చారు. Mood of the Nation survey 2026: ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే…
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులపై కేసీఆర్ స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున, పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నానని, అందుకే రేపటి విచారణకు హాజరుకాలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విచారణను వాయిదా వేయాలని, తనకు మరింత సమయం కావాలని ఆయన సిట్ అధికారులను కోరారు. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని కేసీఆర్ తన సమాధానంలో పేర్కొన్నారు. అయితే విచారణను తన నివాసమైన ఎర్రవల్లి ఫామ్హౌస్లోనే…
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను వేగవంతం చేసిన సిట్ అధికారులు, మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు అందజేశారు. రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, కేసీఆర్ వయస్సు, ఆరోగ్య రీత్యా ఆయనకు పోలీస్ స్టేషన్కు రావాలనే నిబంధన నుంచి మినహాయింపునిచ్చారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు రావచ్చు లేదా హైదరాబాద్ పరిధిలో తనకు అనుకూలమైన మరో ప్రదేశాన్ని సూచించవచ్చని అధికారులు వెసులుబాటు కల్పించారు. కేసీఆర్ సూచించిన ప్రదేశానికే అధికారులు…
Phone Tapping Case: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన ప్రత్యేక విచారణ బృందం (SIT), ఇప్పుడు నేరుగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR)ను విచారించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. Nani : నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు కానుకగా ‘ది పారడైస్’ బిగ్ సర్ప్రైజ్ అందిన సమాచారం ప్రకారం.. కేసీఆర్కు నోటీసులు అందజేసేందుకు సిట్ అధికారులు…
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావును సిట్ (SIT) అధికారులు సుదీర్ఘంగా విచారించారు. సుమారు ఐదు గంటల పాటు సాగిన ఈ విచారణలో అధికారులు పలు కీలక అంశాలపై సంతోష్ రావును ప్రశ్నించినట్లు సమాచారం. విచారణలో భాగంగా సిట్ అధికారులు ప్రధానంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నియామకం చుట్టూ ప్రశ్నలను సంధించారు. ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ విభాగం…
Phone Tapping Case : హైదరాబాద్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ (SIT) అధికారులు తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు నోటీసులు జారీ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నంబర్ 243/2024 కేసు దర్యాప్తులో భాగంగా, ఈ వ్యవహారానికి సంబంధించిన కొన్ని కీలక వాస్తవాలు సంతోష్ రావుకు తెలిసి ఉండవచ్చని భావిస్తున్నట్లు పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, విచారణ నిమిత్తం జనవరి 27వ…
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విచారణపై సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) స్పందించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని కేటీఆర్కు చెప్పామని, అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పామని సిట్ అధికారి అధికారులు చెప్పారు. కేటీఆర్ను ఒంటరిగానే ప్రశ్నించాం అని.. ఆధారాలు, రికార్డులు ముందుంచి ప్రశ్నలు అడిగామన్నారు. నేటి విచారణ కేవలం క్రైమ్ నం.243/2024కే పరిమితం అని.. ఇది వేలాది మందిపై జరిగినట్టు ఆరోపణలున్న అక్రమ ఫోన్ నిఘా కేసు అని…
సిట్ విచారణకు తాను పూర్తిగా సహకరించాను అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈరోజు తనను ఎవరితోనూ కలిపి విచారించలేదని స్పష్టం చేశారు. నేటి విచారణలో తాను తప్ప ఏ ‘రావూ’ లేడని విమర్శించారు. మరోసారి విచారణకు పిలుస్తామంటే తప్పకుండా తాను వస్తానని సిట్ అధికారులకు చెప్పానని కేటీఆర్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు.. కేటీఆర్ వాంగ్మూలం రికార్డు…
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) విచారణ ముగిసింది. సిట్ అధికారులు కేటీఆర్ను దాదాపుగా 7 గంటలకు పైగా ప్రశ్నించారు. గంట పాటు రాధాకిషన్ రావుతో కలిపి కేటీఆర్ను సిట్ అధికారులు విచారించారు. రాధాకిషన్ రావుకు కేటీఆర్ షేర్ చేసిన నంబర్లపై ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. గతంలో ఉప ఎన్నికల సమయంలో ఫోన్స్ ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. కొంతమంది వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్పై…