పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్టేషన్లో మాట్లాడుతున్నారని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చిత్తూరు నుంచి చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ ముఖ్యమంత్రులు అయ్యారు. పెద్దిరెడ్డి కూడా సీఎం కావాలని కోరుకున్నాడని కిషోర్కుమార్ రెడ్డి అన్నారు. అందుకే కాంగ్రెస్లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సహా అందరూ సీఎంలతో గొడవలు, అసమ్మతి ఆయనకు మాములేనంటూ…
తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం కోసం చంద్రబాబు తహతహ లాడుతున్నారు… కానీ ఆయన భాష చూస్తే జాలేస్తుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అధికారం ఎందుకు కోల్పోయామన్న ఆలోచన చంద్రబాబుకు లేదు… సొంత నియోజకవర్గంలో ఓటమిపై సమీక్ష జరపకుండా అనవసర వ్యాఖ్యలు చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అని చంద్రబాబు ఇంటింటికి వెళ్లి అడిగి ఉండాల్సింది. రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో చంద్రబాబు పేరు పోయింది. ఆయనకు జవసత్వాలు లేవు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు ఇక జిమ్మిక్కులు ఆపాలి……
పెన్షన్ల కోసం రాష్ర్ట ప్రభుత్వం ఏడాదికి రూ.18,000వేల కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యాలు చేశారు. టీడీపీపై విమర్శలు చేశారు. టీడీపీ హయాంలో కేవలం 31లక్షల మందికి మాత్రమే పెన్షన్లు అందేవని, కేవలం జన్మభూమి కమిటీలు సూచించిన వారికి మాత్రమే ఇచ్చేవారని మంత్రి విమర్శించారు. Read Also: నీరా ఆరోగ్య ప్రదాయిని: మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ నెల నుంచి…
చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు అవసరమైన రెండు బస్సు సర్వీసులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రారంభించిన బస్సు సర్వీసులో టికెట్ కొనుగోలు చేసి మంత్రి మంత్రి పెద్దిరెడ్డి బస్సులో ప్రయాణించారు. పుంగనూరు పరిధిలోని ఎస్.అగ్రహారం, ఏ.కొత్తకోట మధ్య విద్యార్థులకు అనువైన సమయంలో బడిబస్సు ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా ప్రజల అవసరాల మేరకు పుంగనూరు నుండి మండల కేంద్రాల మీదుగా చిత్తూర్, అక్కడి నుండి చెన్నై కు…
చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో మూడో రోజు కొనసాగుతున్న పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పల్లెబాట కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ కార్యక్రమాలు ఇంటింటికి చేరుతున్నాయన్నారు. అందుకే ఎక్కడికి వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారని ఆయన అన్నారు. గతంతో పోలిస్తే సమస్యలపై వచ్చే దరఖాస్తులు 90శాతం మేర తగ్గాయని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా వెనుకడు వేయలేదని మంత్రి తెలిపారు. నీళ్లు,…
వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీసీ పార్టీ భారీ విజయం సాధించడం ఖాయమని.. మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ…. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. అక్కడక్కడే పరిష్కరించే సమస్యలు కొన్ని మాత్రమే ఉన్నాయని.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో మంచి స్పందన…
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగుతోంది.. మెజార్టీ మున్సిపాలిటీలు కైవసం చేసుకుంది అధికార పార్టీ.. దీంతో పార్టీ శ్రేణుల్లో జోష్ మరింత పెరిగింది.. సంబరాల్లో మునిగిపోయాయి వైసీపీ శ్రేణులు.. అయితే, ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. ఇక, కుప్పంలో కూడా వైసీపీ తిరుగులేని విజయాన్ని అందుకుంది.. ఈ ఎన్నికలపై ఫలితాలపై మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి.. రాష్ట్రంలో…
కోల్మైనింగ్లో ఎపిఎండిసి- ఆంధ్ర ప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ మరో కీలక మందడుగు వేసింది అని భూగర్భ, ఖనిజ వనరుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మధ్యప్రదేశ్ సింగ్రౌలి జిల్లాలోని సుల్యారీ బొగ్గుగనిలో మైనింగ్ భూమిపూజ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ… ఈ వారం నుంచే తవ్వకాలు ప్రారంభం అవుతాయి. నెల రోజుల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. 1298 హెక్టార్ల భూమిలో, 2000 కోట్ల రూపాయల పెట్టుబడితో మైనింగ్ చేపడుతున్న ఏపీఎండీసీ… ఏటా 5 మిలియన్ టన్నుల…
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదంలో ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతలు హాట్ కామెంట్లు చేసుకుంటున్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్ మొదట్లో ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారు.. రాయలసీమ రైతులకు నీళ్ల కోసం సహకరిస్తా అని తెలిపారు.. కానీ, ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం నాకు నచ్చలేదు అన్నారు.. అయితే, దాని గురించి మాట్లాడటం నాకు ఇష్టంలేదన్నారు పెద్దిరెడ్డి.. కానీ, మాకు ఎంత నీరు కావాలో అంతే తీసుకుంటామని స్పష్టం…
ఓవైపు సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. మరోవైపు ప్రజలకు మౌలికసదుపాయాల కల్పనపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందులో భాగంగా.. 2024 నాటికి రాష్ట్రంలోని ప్రతీ ఇంటికీ మంచినీటి కుళాయి ఏర్పాటుచేస్తామని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇవాళ ఆర్డబ్ల్యూఎస్ టెక్నికల్ హ్యాండ్బుక్ను ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులకు ఆర్డబ్ల్యుఎస్ ద్వారా నీటి వసతి కల్పిస్తామన్నారు.. 2024 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటి…