రక్షాబంధన్ రోజుల అన్నయ్యలకు అక్కచెల్లెళ్లు రాఖీలు కడతారు. అన్ని విధాలుగా అన్న తోడుగా ఉంటాడు అని చెప్పడానికి గుర్తుగా రాఖీని కడతారు. అయితే, బీహార్ అక్కడి ప్రభుత్వం గత కొన్ని సంవత్సారాలుగా రాఖీ పండుగ రోజున సీఎంతో సహా అనేకమంది మంత్రులు అధికారులు చెట్లకు రాఖీలు కడుతున్నారు. రక్షాబంధన్ రోజును వృక్షరక్షాబంధన్ దివస్ పేరుతో చెట్లను రక్షించి పర్యావరణాన్ని కాపాడేందుకు అక్కడి నితీష్ కుమార్ ప్రభుత్వం 2012 నుంచి ఈ కార్యాక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా…
నైరుతీ రుతుపవనాల కారణంగా దేశంలో ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కరోనా విజృంభణతో అనేక ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేయడంతో ఎక్కడికక్కడ రాకపోకలు చాలా కాలంపాటు బంద్ అయ్యాయి. దీంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో వర్షాలు కురుస్తున్నాయి. బీహార్ రాజధాని పాట్నాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. Read: ‘భయానక భవనం’ నిర్మిస్తానంటోన్న ‘బ్లాక్ విడో’! గంటల వ్యవధిలోనే 145 మీమీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అంతేకాదు, బీహార్…
కరోనా సమయంలో బీహార్ లో మరణాల లెక్కలు భయపెడతున్నాయి. ఇటీవల పాట్నా హైకోర్టు ప్రభుత్వం పై సీరియస్ కావడంతో మరణాల లెక్కలను సవరించింది. దీంతో ఆ రాష్ట్రంలో మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. అయితే, ఇప్పటికీ లెక్కలోకి రాని మరణాల సంఖ్య అత్యధికంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. లెక్కలోకి రాని మరణాలపై మరోసారి పాట్నా హైకోర్టు సీరియస్ అయింది. ఈ ఏడాది జనవరి నుంచి మే నెల వరకు దాదాపుదల 2.2లక్షల మంది మరణించారు. ఇందులో 75…
కరోనా ఫస్ట్ వేవ్ తగ్గిందని.. అంతా రిలాక్స్ అవుతోన్న సమయంలో.. సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది.. మధ్యలో.. బ్లాక్ ఫంగస్ వచ్చి చేరింది.. దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ విజృంభణ కొనసాగుతుండగా.. తాజాగా, బ్లాక్ ఫంగస్ను అంటువ్యాధిగా పరిగణించాలంటూ తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది.. కేసులు వెలుగు చూడగానే తమకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. అయితే, ఇప్పుడు వైట్ ఫంగస్ (కాన్డిడోసిస్) బయట పడడం కలకలం రేపుతోంది.. పాట్నాలో నాలుగు వైట్ ఫంగస్ కేసులు…
ఇండియాలో కరోనా విలయం కొనసాగుతోంది. దేశంలో ప్రతి రోజు 3 లక్షల కేసులు నమోదవు తున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 2,57,72,400 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే దేశంలో కరోనా తీవ్రత తగ్గకముందే.. బ్లాక్ ఫంగస్ ప్రజలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మరో వ్యాధి ఇండియాను టెన్షన్ పెడుతోంది. తాజాగా పాట్నాలో వైట్ ఫంగస్ రోగులను వైద్యులు గుర్తించారు. ఇది బ్లాక్ ఫంగస్ కంటే ప్రాణాంతకమని నిపుణులు భావిస్తున్నారు. పాట్నాకు చెందిన నలుగురు వ్యక్తులు…
కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా కల్లోలమే సృష్టిస్తోంది.. అన్ని రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి.. ఇక, కోవిడ్తో ముందుండి పోరాటం చేసే వైద్యులు, వైద్య సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో మహమ్మారి బారినపడుతూనే ఉన్నారు.. తాజాగా.. బీహార్లోని పాట్నా ఎయిమ్స్ లో ఏకంగా 384 మంది వైద్య సిబ్బందికి కోవిడ్ పాజిటివ్గా తేలింది.. బాధితుల్లో వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. గతంలో పాజిటివ్ కేసులు నమోదు అయినా.. ఒకే సారి ఇంత పెద్ద…