పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు బస్సు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ ప్రమాదంలో చనిపోయిన బస్ డ్రైవర్ షరీఫ్ అని పోలీసులు తెలియజేస్తున్నారు. దీంతో షరీఫ్ అనే పేరుతోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డ్రైవర్ రాకపోవడంతో తానే డ్రైవింగ్ కు వచ్చానని అంజి చెప్పినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.
పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేట సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.
పల్నాడు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట – పర్చూరి జాతీయ రహదారిపై పసుమర్తి వద్ద ఎదురుగా వస్తున్న డంప్ లారీ ఓ బస్సును ఢీకొట్టింది. అతి తక్కువ సమయంలో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిలకలూరిపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో…