ప్రధాని మోడీ మంగళవారం త్రివిధ దళాలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా ఏం చేయాలన్నదానిపై మేథోమథనం చేశారు. ఈ సందర్భంగా త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తూ భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని ప్రధాని మోడీ మార్గదర్శకం చేశారు.
ఆర్థిక పేదరికంతో సతమతమవుతున్న పాకిస్థాన్లో శాంతిభద్రతలు కూడా దెబ్బతిన్నాయి. ప్రతిరోజూ, పాకిస్తాన్లో దొంగలు బహిరంగంగా తుపాకీతో ప్రజలను దోచుకుంటున్నారు. దేశంలో క్రైమ్ రేట్పై ఆందోళన వ్యక్తం చేస్తూ పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్ కేర్టేకర్ మంత్రి, బ్రిగేడియర్ (రిటైర్డ్) హరీస్ నవాజ్ ప్రజలకు ఆసక్తికర అభ్యర్థన చేశారు.
భవిష్యత్తులో ఇంధనాన్ని అధిక ధరలకు విక్రయించాలనే లక్ష్యంతో కొందరు ఫిల్లింగ్ స్టేషన్ల యజమానులు హోర్డింగ్కు పాల్పడుతున్నారని, కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని పాకిస్తాన్ పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ముసాదిక్ మాలిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుజరాత్ కసాయి ప్రధాని మోదీ అంటూ పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఉగ్రవాదానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్లో పాక్ పరువును భారత్ తీయడంతో ఆయన తట్టుకోలేక ఈ వ్యాఖ్యలు చేశారు.