పార్టీ ఏమైపోయినా ఫర్లేదు మనకు పదవులు వస్తే చాలని ఆ మాజీ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారా? గొడవలు పెట్టయినా… గ్రూపులు కట్టయినా సరే… మన పంతం నెగ్గించుకోవాలన్నది వాళ్ల టార్గెట్టా? విషయం తెలిసి నియోజకవర్గాల్లో అవాక్కవుతున్నారా? ఇంతకీ ఎవరా మాజీ శాసనసభ్యులు? ఏ పదవుల కోసం అలాంటి రాజకీయం? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సరికొత్త రాజకీయాన్ని నడిపిస్తున్నారట ఆ రెండు నియోజకవర్గాల్లోని మాజీ ఎమ్మెల్యేలు. 2024 ఎన్నికల్లో చివరిదాకా ప్రయత్నించి టికెట్ రాకపోవడంతో భంగపడ్డ ఆ లీడర్స్ వ్యవహారశైలి…
ఆ టీడీపీ ఎమ్మెల్యే పాలిట కార్యకర్తలే కత్తుల్లా మారిపోయారా? ఆయనకు వ్యతిరేకంగా చర్యలు మీరు తీసుకుంటారా? లేక మేం చేయాల్సింది చేస్తామని ఏకంగా పార్టీ పెద్దలకే వార్నింగ్ ఇస్తున్నారా? వైసీపీకి సహకరిస్తూ… తమను వేధిస్తున్నారన్న ఆరోపణల్లో నిజమెంత? కేడర్లో బస్తీ మే సవాల్ అనిపించుకుంటున్న ఆ లీడర్ ఎవరు? పరిస్థితి ఎందుకు అలా మారిపోయింది? కొలికపూడి శ్రీనివాస్…ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే. స్థానికుడు కాకున్నా…ఫస్ట్ అటెంప్ట్లోనే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ మెట్లు ఎక్కారాయన. వరుసగా మూడు విడతల…
నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేస్తా? ఆ తర్వాత మీ ఇష్టం. కాంగ్రెస్ హైకమాండ్కు పార్టీకే చెందిన ఓ శాసనసభ్యుడు ఇచ్చిన వార్నింగ్ ఇది. కావాలంటే నా ప్లేస్లో వేరే కులం నేతని నిలబెట్టి గెలిపిస్తా ఆయనకైనా కేబినెట్ బెర్త్ ఇవ్వమని వేడుకోలు. ఇంతకీ ఆయన పార్టీ పెద్దలకు వార్నింగ్ ఇస్తున్నారా? వేడుకుంటున్నారా? అసలు తనకు ఇవ్వాల్సిందేనని ఏ కేలిక్యులేషన్ ప్రకారం అంత గట్టిగా అడుగుతున్నారు? ఎవరా ఎమ్మెల్యే? ఏమా కథ? తెలంగాణ…
కేసులు, నోటీసుల పరంపరలో ఇప్పుడు ఆ మాజీ ఎమ్మెల్యే వంతు వచ్చిందా? ఆయన ఏకంగా 20 ఎకరాల చెరువు స్థలాన్ని ఆక్రమించేశారన్నది నిజమేనా? ప్రస్తుతం నోటీసులతో మొదలైన ప్రక్రియ ఎంతదాకా వెళ్ళే అవకాశం ఉంది? అందుకు ఆయనేమంటున్నారు? ఆ కొత్త నోటీసుల కథేంది? ఏపీ కేసుల పరంపరలో ఇప్పుడు మరో మాజీ ఎమ్మెల్యే వంతు వచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు. పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు పోలీస్ నోటీసులు, కోర్టుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు, అరెస్ట్ల వ్యవహారం ఎప్పటికప్పుడు…
మా త్యాగాలకు మీరిచ్చే విలువ ఇదేనా? సర్దుబాటు పేరుతో మేం ఎప్పటికీ త్యాగరాజులుగానే మిగిలిపోవాల్నా? నిన్నగాక మొన్న వచ్చినవాళ్ళు పెత్తనాలు చేస్తుంటే…. ఐదేళ్ళు నానా తంటాలు పడి కేడర్ని నిలుపుకున్న మేం మాత్రం సినిమా చూసినట్టు చూస్తూ… చప్పట్లు కొట్టాల్నా? ఏంటీ మాకీ ఖర్మ అంటున్నారట కీలకమైన ఆ జిల్లాలోని టీడీపీ లీడర్స్. ఎక్కడుందా పరిస్థితి? ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది? 2024 అసెంబ్లీ ఎన్నికల పొత్తులో భాగంగా… ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు అసెంబ్లీ…
అదిగో పులి అంటే..... ఇదిగో తోక అన్నట్టు తయారైంది తెలంగాణ కేబినెట్ విస్తరణ వ్యవహారం. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తం కుమార్రెడ్డి అలా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కగానే... ఇలా కేబినెట్ విస్తరణ చర్చలు మొదలవుతాయి రాష్ట్రంలో. వాళ్ళు తిరిగి వచ్చేదాకా ఇంటా బయటా అవే మాటలు.
వైసీపీలో అధికారికంగా ఎలాంటి నంబర్స్ లేకున్నా... నంబర్ టూ అని చెప్పుకునే విజయసాయి రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నానని, తాను మాత్రం ఇక వ్యవసాయం చేసుకుంటానంటూ కొత్త పలుకులు పలికారు. ఓహో... అలాగా.... అని అంతా అనుకుంటున్న టైంలోనే... కాకినాడ పోర్ట్ కేసు విచారణకు అటెండ్ అయిన సాయిరెడ్డి...
అనకాపల్లి జిల్లా... యలమంచిలి సెగ్మెంట్లో కూటమి పాలిటిక్స్ హాట్ మెటల్లా సలసలమంటున్నాయి. టీడీపీ, జనసేన మధ్య అంతర్గత రచ్చ బజారుకెక్కింది. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దూకుడుని తట్టుకోవడం టీడీపీ నేతలకు మహా కష్టంగా మారిందట. ఇది కొత్తగా వచ్చిన ఇబ్బంది కాదని.. పొత్తులు పుట్టినప్పుడే ఇలాంటి బుల్డోజ్ రాజకీయాల్ని ఊహించామంటూ ఘొల్లుమంటున్నాయి టీడీపీ శ్రేణులు. కూటమి ధర్మానికి కట్టుబడి శాసనసభ్యుడు వ్యవహరిస్తారని ఆశించినప్పటికీ పరిస్ధితుల్లో మార్పు రాలేదని బహిరంగానే అంటున్నారట.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గుమ్మనూరు జయరాం. వైసీపీ హయాంలో ఐదేళ్లు మంత్రిగా వున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కకపోవడంతో టీడీపీ కండువా కప్పుకుని గుంతకల్ నుంచి పోటీ చేసి విజయం సాధించారాయన. దాంతో ఇప్పుడు ఆలూరు మీద పట్టు తగ్గుతోందని అంటున్నారు. జయరాం మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇద్దరు సోదరులతోపాటు కజిన్ గుమ్మనూరు నారాయణ స్థానికంగా వ్యవహారాలు నడిపించేవారు. ఇంకా చెప్పాలంటే...అందరికంటే ఎక్కువగా నారాయణే కథ…