LPG Crisis: రోజుకు 2 సార్లు భోజనం.. పూరీ, దోస బంద్.. హస్టల్స్కు ‘‘గ్యాస్ మంటలు’’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Crisis: ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఇంధర సంక్షోభాన్ని సృష్టిస్తోంది. ముఖ్యంగా భారత్లో LPG కొరత ఏర్పడుతోంది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టల్స్లు మూసేయాల్సి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎల్పీజీ సంక్షోభం తలెత్తకుండా కేంద్రం గృహవినియోగదారులకే ప్రాధాన్యత ఇస్తుండటంతో పెయింగ్ గెస్ట్ (PG) హాస్టల్స్ తీవ్రంగా ప్రభావం అవుతున్నాయి.
ఈ మేరకు బెంగళూర్ పీజీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. హాస్టల్స్లో వంట గ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాయి. దీని వల్ల హాస్టల్స్లో ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. వీక్ డేస్లో రోజుకు 2 సార్లు మాత్రమే భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మధ్యాహ్నం లంచ్ మీరే చూసుకోవాలని హాస్టల్స్ ఉంటున్న వారికి తెలిపారు. ఇక పూరీ, దోసె, చపాతీ వంటి బ్రేక్ ఫాస్ట్లు చేయమని వెల్లడించారు. శని, ఆదివారాల్లో మాత్రమే మూడు పూటల భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Also Read
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- CJP: ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి ఫాలోవర్లు పెరగడానికి కారణం ఇదేనా.. పలు అనుమానాలు..
- PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
బ్రేక్ఫాస్ట్లో బిసిబిలే బాత్, చిత్రన్నం, పులిహోర వంటి బియ్యం ఆధారిత వంటకాలు, సలాడ్ల వంటివి మాత్రమే చేస్తామని పీజీ అసోసియేషన్ చెప్పింది. గ్యాస్ తక్కువగా లేదా గ్యాస్ లేకుండా చేసే వంటకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు ఎల్పీజీపై ఆదారపడటం తగ్గించడానికి ఇండక్షన్ స్టౌలు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు వాడాలని పీజీ యజమానులకు అసోసియేషన్ సూచించింది. పీజీల్లో నివసించే వారు వ్యక్తిగత గ్యాస్ సిలిండర్లలో వంట చేసుకోవడాన్ని నిషేధించారు. అవసరమైతే ఇండక్షన్ స్టౌలు వాడుకోవచ్చని సూచించారు.
గ్యాస్ ఆదా చేయడానికి పొరుగున ఉండే పీజీలతో ఒకే వంటగది ఏర్పాటు చేసుకోవాలని అసోసియేషన్ సూచించింది. ఈ పరిస్థితి మరో 10-15 రోజులు కొనసాగితే నిర్వహణే కష్టం అవుతుందని చెప్పింది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరింది. మరోవైపు, బెంగళూర్ పీఓ ఓనర్ ఈ సమాచారాన్ని వాట్సాప్ స్టేటస్ల ద్వారా తెలియజేయడం వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
-
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
-
China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
-
Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
-
Pakistan Restores Historic Hindu Names : పాకిస్తాన్ ‘హిందూ’ జపం.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!