LPG Crisis: రోజుకు 2 సార్లు భోజనం.. పూరీ, దోస బంద్.. హస్టల్స్కు ‘‘గ్యాస్ మంటలు’’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Crisis: ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఇంధర సంక్షోభాన్ని సృష్టిస్తోంది. ముఖ్యంగా భారత్లో LPG కొరత ఏర్పడుతోంది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టల్స్లు మూసేయాల్సి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎల్పీజీ సంక్షోభం తలెత్తకుండా కేంద్రం గృహవినియోగదారులకే ప్రాధాన్యత ఇస్తుండటంతో పెయింగ్ గెస్ట్ (PG) హాస్టల్స్ తీవ్రంగా ప్రభావం అవుతున్నాయి.
ఈ మేరకు బెంగళూర్ పీజీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. హాస్టల్స్లో వంట గ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాయి. దీని వల్ల హాస్టల్స్లో ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. వీక్ డేస్లో రోజుకు 2 సార్లు మాత్రమే భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మధ్యాహ్నం లంచ్ మీరే చూసుకోవాలని హాస్టల్స్ ఉంటున్న వారికి తెలిపారు. ఇక పూరీ, దోసె, చపాతీ వంటి బ్రేక్ ఫాస్ట్లు చేయమని వెల్లడించారు. శని, ఆదివారాల్లో మాత్రమే మూడు పూటల భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
బ్రేక్ఫాస్ట్లో బిసిబిలే బాత్, చిత్రన్నం, పులిహోర వంటి బియ్యం ఆధారిత వంటకాలు, సలాడ్ల వంటివి మాత్రమే చేస్తామని పీజీ అసోసియేషన్ చెప్పింది. గ్యాస్ తక్కువగా లేదా గ్యాస్ లేకుండా చేసే వంటకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు ఎల్పీజీపై ఆదారపడటం తగ్గించడానికి ఇండక్షన్ స్టౌలు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు వాడాలని పీజీ యజమానులకు అసోసియేషన్ సూచించింది. పీజీల్లో నివసించే వారు వ్యక్తిగత గ్యాస్ సిలిండర్లలో వంట చేసుకోవడాన్ని నిషేధించారు. అవసరమైతే ఇండక్షన్ స్టౌలు వాడుకోవచ్చని సూచించారు.
గ్యాస్ ఆదా చేయడానికి పొరుగున ఉండే పీజీలతో ఒకే వంటగది ఏర్పాటు చేసుకోవాలని అసోసియేషన్ సూచించింది. ఈ పరిస్థితి మరో 10-15 రోజులు కొనసాగితే నిర్వహణే కష్టం అవుతుందని చెప్పింది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరింది. మరోవైపు, బెంగళూర్ పీఓ ఓనర్ ఈ సమాచారాన్ని వాట్సాప్ స్టేటస్ల ద్వారా తెలియజేయడం వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?