LPG Crisis: రోజుకు 2 సార్లు భోజనం.. పూరీ, దోస బంద్.. హస్టల్స్కు ‘‘గ్యాస్ మంటలు’’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Crisis: ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఇంధర సంక్షోభాన్ని సృష్టిస్తోంది. ముఖ్యంగా భారత్లో LPG కొరత ఏర్పడుతోంది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టల్స్లు మూసేయాల్సి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎల్పీజీ సంక్షోభం తలెత్తకుండా కేంద్రం గృహవినియోగదారులకే ప్రాధాన్యత ఇస్తుండటంతో పెయింగ్ గెస్ట్ (PG) హాస్టల్స్ తీవ్రంగా ప్రభావం అవుతున్నాయి.
ఈ మేరకు బెంగళూర్ పీజీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. హాస్టల్స్లో వంట గ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాయి. దీని వల్ల హాస్టల్స్లో ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. వీక్ డేస్లో రోజుకు 2 సార్లు మాత్రమే భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మధ్యాహ్నం లంచ్ మీరే చూసుకోవాలని హాస్టల్స్ ఉంటున్న వారికి తెలిపారు. ఇక పూరీ, దోసె, చపాతీ వంటి బ్రేక్ ఫాస్ట్లు చేయమని వెల్లడించారు. శని, ఆదివారాల్లో మాత్రమే మూడు పూటల భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
బ్రేక్ఫాస్ట్లో బిసిబిలే బాత్, చిత్రన్నం, పులిహోర వంటి బియ్యం ఆధారిత వంటకాలు, సలాడ్ల వంటివి మాత్రమే చేస్తామని పీజీ అసోసియేషన్ చెప్పింది. గ్యాస్ తక్కువగా లేదా గ్యాస్ లేకుండా చేసే వంటకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు ఎల్పీజీపై ఆదారపడటం తగ్గించడానికి ఇండక్షన్ స్టౌలు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు వాడాలని పీజీ యజమానులకు అసోసియేషన్ సూచించింది. పీజీల్లో నివసించే వారు వ్యక్తిగత గ్యాస్ సిలిండర్లలో వంట చేసుకోవడాన్ని నిషేధించారు. అవసరమైతే ఇండక్షన్ స్టౌలు వాడుకోవచ్చని సూచించారు.
గ్యాస్ ఆదా చేయడానికి పొరుగున ఉండే పీజీలతో ఒకే వంటగది ఏర్పాటు చేసుకోవాలని అసోసియేషన్ సూచించింది. ఈ పరిస్థితి మరో 10-15 రోజులు కొనసాగితే నిర్వహణే కష్టం అవుతుందని చెప్పింది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరింది. మరోవైపు, బెంగళూర్ పీఓ ఓనర్ ఈ సమాచారాన్ని వాట్సాప్ స్టేటస్ల ద్వారా తెలియజేయడం వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!