అధికారంలో ఉన్నంతకాలం తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాన్ని వైసీపీ అడ్డాగా మారుస్తానన్నారు. ఎమ్మెల్యేగా పనిచేసినంత కాలం నేను-నా బలగం అంటూ మరొకరికి అవకాశం లేకుండా చేశారు. ఇప్పుడు అదే నాయకుడు కనీసం నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకోవటం లేదు. ఇంతకీ…ఎవరా నాయకుడు?ఏంటా నియోజకవర్గం? పొలిటికల్ హైడ్రామాకు కేరాఫ్ అడ్రస్గా ఉండే దెందులూరు నియోజకవర్గానికి 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు కొఠారు అబ్బయ్య చౌదరి. ఓటమి తర్వాత నియోజకవర్గాన్ని…
ఆ నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయం హీటెక్కింది. ఇప్పుడే ఎన్నికలు జరుగుతున్నాయనేంత రేంజ్లో నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అధికార-విపక్ష నేతల మధ్య సవాళ్లు-ప్రతిసవాళ్లు నడుస్తున్నాయ్. చిన్న వివాదమే రెండు పార్టీల మధ్య చిచ్చు రేపింది. ఇంతకీ…ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ఖమ్మం జిల్లా పాలేరులో ప్రస్తుతం రాజకీయం వేడెక్కుతోంది. అధికార పార్టీకి దీటుగా ప్రతిపక్ష పార్టీ నేతల పర్యటనలు సాగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ నియోజకవర్గంలోనూ ఇంతలా రాజకీయాలు సాగడం లేదట. ప్రతిపక్ష నేతల…
ఉమ్మడి విశాఖ జిల్లా కూటమి పార్టీల మధ్య కుంపట్లు గట్టిగానే రాజుకుంటున్నాయట. మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే పెందుర్తిలో పరిణామాలు సెగలు పొగలు కక్కేస్తున్నట్టు చెబుతున్నారు. జనసేన గెలిచిన ఈ స్ధానంలో... సిట్టింగ్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోందట. ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తల్లో... పోలీసు, ఇతర కీలక శాఖల పోస్టింగుల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలు పెద్ద అగాధమే సృష్టించినట్టు చెప్పుకుంటున్నారు.
జోగి రమేష్... మాజీ మంత్రి. వైసీపీ హయాంలో కేబినెట్ మినిస్టర్గా ఉండి కూడా... కనీస హుందాతనం లేకుండా తమ నాయకుల మీద విచ్చలవిడిగా నోరు పారేసుకున్నారని, ఆయన చేతలు కూడా అలాగే ఉండేవన్నది టీడీపీ, జనసేన అభియోగం. చంద్రబాబు, లోకేష్, పవన్ మీద హద్దులు దాటి మాట్లాడటమేగాక... బాబు ఇంటి మీద దాడికి ప్రయత్నించిన ఘటనతో పార్టీ హిట్ లిస్ట్లో చేరారాయన.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వెన్నుపోటు పొలిటికల్ సీజన్ జోరుగా నడుస్తోంది. ఎవరు ఎవరిని పొడిచారు, అసలు పొడిచారా? లేదా అన్న వాదనల్ని కాసేపు పక్కనపెడితే... అందరి నోట అదే మాట మాత్రం వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా వైసీపీ వెన్నుపోటు దినం ప్రోగ్రామ్ నిర్వహిస్తే... అంతకంటే ముందే... ఆ పార్టీ నాయకుడు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వెన్నుపోటు కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. వైసీపీలోనే వెన్నుపోటుదారులు ఉన్నారని ప్రకటించి సంచలనానికి తెరలేపారాయన.
నాన్న దేవుడు... ఆయన చుట్టూనే దయ్యాలు చేరాయి. తెలంగాణ జాతిపిత కేసీఆర్..... అలాంటి మహా మనిషికి కాళేశ్వరం కమిషన్ నోటీస్లు ఇస్తుందా? హవ్వ... ఎంత ధైర్యం? మా నాయకుడికి నోటీస్లు ఇస్తే... పార్టీ ఎందుకు మౌనంగా ఉంది? నిరసన తెలపకపోవడానికి రీజనేంటి? బీఆర్ఎమ్మెల్సీ కవిత లేటెస్ట్ మాటలివి. ఎంత గవర్నమెంట్ అయితే మాత్రం.... కేసీఆర్కు నోటీస్లు ఇస్తారా అంటూ... ఫైర్ ఫైర్స్ ద ఫైర్ అన్న కవిత... అందుకు నిరసనగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసేశారు.
తెలంగాణలో కమలం పార్టీకి మంచి వాతావరణం ఉందని చెప్పుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా... అధికారం మాదేనంటూ ఢంకా బజాయిస్తున్నారు. అంత వరకు బాగానే ఉంది. పవర్లోకి వస్తామన్న నమ్మకం ఉండటం ఏ పార్టీకైనా మంచిదే. కానీ... పనేమీ చేయకుండా అలా నమ్మేస్తే సరిపోతుందా? క్షేత్ర స్థాయిలో చేయాల్సిన పనులు చేయకుండా మాకు అధికారం వస్తుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో గ్రూప్ వార్ అంతకంతకు పెరుగుతోందట. మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ల మధ్య గ్యాప్ ఎక్కువ అవుతోందంటున్నారు. జిల్లాలో పార్టీకి అయ్యా అవ్వా లేరంటూ ఇటీవల ఓ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. మరో మాజీ మంత్రి సైతం అధికార పార్టీలో ఉండి అధికారులపైనే విమర్శలు చేశారు. ముఖ్యంగా... సిర్పూర్, ముథోల్ ,మంచిర్యాల నియోజకవర్గాల్లో గ్రూప్ లొల్లి తారా స్థాయికి చేరిందట.
ఆ కాంగ్రెస్ ఎంపీ… బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ఎందుకు భేటీ అయ్యారు? అధికారిక కార్యక్రమం అయ్యాక ప్రైవేట్ మీటింగ్ మతలబేంటి? ఎమ్మెల్యే కారు దిగేస్తారని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? ఎంపీ టూర్ కాంగ్రెస్లో కోల్డ్వార్ని బయటపెట్టిందా? ఎవరా ఎంపీ, ఎమ్మెల్యే? వాళ్ళ మీద రూమర్స్ ఎందుకు మొదలయ్యాయి? నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ అయ్యాక తొలిసారి గద్వాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు,…
బాలినేని శ్రీనివాసరెడ్డి… ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీనియర్ పొలిటీషియన్. నాడు వైఎస్ కేబినెట్లో, 2019 తర్వాత జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారాయన. ఎవరు అవునన్నా.. కాదన్నా.. నాడు మంత్రివర్గ విస్తరణలో జగన్ బాలినేనిని కేబినెట్ నుంచి తప్పించడంతోనే ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని అంటారు. ఆ గ్యాప్ అంతకంతకూ పెరిగిపోయి…. చివరికి ఫ్యాన్ కింది నుంచి పక్కకు జరిగి గ్లాస్ పట్టుకున్నారు బాలినేని. అలా… ఆయన జనసేనలో చేరిపోయాక ప్రకాశం జిల్లా రాజకీయం ఒక్కసారిగా మారిపోతుందని భావించారు…