జనసేన శాసనసభ్యులకు తాము పవర్ ఉన్నామా? లేదా? అన్న డౌట్స్ పెరిగిపోతున్నాయా? నియోజకవర్గాల్లో తోలు బొమ్మల్లా మిగిలిపోతున్నామన్న ఆవేదన వాళ్ళలో సుడులు తిరుగుతోందా? ఏంటీ గతి… మనకెందుకీ ఖర్మ…? ఇందుకేనా జనం మనకు ఓట్లేసి గెలిపించిందంటూ తెగ ఫీలైపోతున్నారా? మెజార్టీ జనసేన ఎమ్మెల్యేలు అలా ఎందుకు ఫీలవుతున్నారు? వాళ్ళకు ఎక్కడ తేడా కొడుతోంది? వంద శాతం స్ట్రైక్రేట్….. ఆంధ్రప్రదేశ్ కూటమిలో కీలక పాత్ర….. అధికారంలో భాగస్వామ్యం….. ఇదంతా పైకి చెప్పుకోవడానికి బాగానే ఉన్నా, వినడానికి వాహ్… అన్నట్టు…
గత ఎన్నికల్లో టిడిపి తరపున ఏలూరు ఎంపీ టిక్కెట్ దక్కించుకుని గెలిచారు పుట్టా మహేష్ కుమార్ యాదవ్. కడపకు చెందిన పుట్టా.... ఏలూరుకు కొత్త కావడంతో... ఎన్నికల్లో సీనియర్ లీడర్స్ మీద ఆధారపడాల్సి వచ్చింది. అప్పుడే కొత్త నేతకు చుక్కలు చూపించిన కొందరు నేతలు ఇప్పటికి అదే పంథాలో ఉన్నారట. కొత్తకావడం, చిన్నాచితక పనులకోసం స్థానిక నాయకులపై ఆధారపడాల్సి రావడంతో ఆయన చుట్టూ చాలామంది చేరిపోయినట్టు చెప్పుకుంటున్నారు.
కడప జిల్లా బద్వేల్ వైసీపీకి అత్యంత పట్టున్న నియోజకవర్గాల్లో ఒకటి. అలాంటి చోట ఇప్పుడు ఇన్ఛార్జ్ వార్ మొదలై... కేడర్లో గందరగోళం పెరుగుతోందట. 2004 ఎన్నికల్లో డీసీ గోవిందరెడ్డి మొట్టమొదటిసారిగా రాజకీయ ప్రవేశం చేసి ఫస్ట్ అటెంప్ట్లోనే ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి వరకు కాంగ్రెస్లో కీలకంగా వ్యవహరించిన విశ్వనాధ్ రెడ్డి..
నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పంచాయతీ.. చినికి చినికి గాలి వానలా మారి ఒక రకంగా జిల్లా పార్టీనే షేక్ చేస్తోంది. ఓ ముఖ్య నేత సన్నిహితుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కగా.. మరో ముఖ్య నేత సన్నిహితుని కుమారుడిని ఏకంగా అదుపులోకి తీసుకున్నారు.
భద్రాద్రి జిల్లాకు హెడ్ క్వార్టర్ కొత్తగూడెం. ఈ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకుగాను... ఒక్క కొత్తగూడెం మాత్రమే జనరల్ సీటు. మిగతా నాలుగు ఎస్టీ రిజర్వ్డ్. ఇక నియోజకవర్గంలో మొన్నటి వరకు రెండు మున్సిపాలిటీలు ఉండగా... అందులో పాల్వంచకు రెండు దశాబ్దాలుగా ఎన్నికలు జరగడం లేదు. దీంతో పట్టుబట్టి రెండు మున్సిపాలిటీలకు మరి కొన్ని గ్రామాలను కలిపి కార్పొరేషన్గా చేయించారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.
హ్యాట్రిక్ విజయాలు..., చిన్న వయసులోనే కేంద్ర మంత్రి పదవి...., మంచి వాగ్ధాటి, రాజకీయ వారసత్వం కలిసొచ్చి డైనమిక్ లీడర్గా గుర్తింపు. శ్రీకాకుళం ఎంపీ, సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడి గురించి చెప్పుకునే పాజిటివ్ మాటలివి. అన్నట్టుగానే... ఇందులో ఏదీ అసత్యం లేదు, కాదనేవాళ్ళు ఎవరూ లేరు.
యాపారం.. ఇది అలాంటిలాంటి యాపారం కాదు. అయోధ్య రామయ్యనే అంగడి సరకు చేసేసిన ఫక్తు బిజినెస్. విశాఖ బీచ్ రోడ్లో సముద్రుడి సాక్షిగా... భక్తుల మనోభావాలతో ఆడుకున్న పరమ వికృత వ్యాపారం. ఇక్కడ పైకి చూడ్డానికి అంతా బాగానే కనిపిస్తుంది. అబ్బో... వీళ్ళెవరో మహానుభావులు..... అయోధ్య దాకా వెళ్ళలేని వాళ్ళ కోసం ఆ బాల రాముడినే మన ముందుకు తీసుకువచ్చారని అనిపిస్తుంది.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీజేపీ కొత్త స్కెచ్ సిద్ధం చేస్తోందా? ఆ దిశగా ఇప్పటికే పార్టీ వర్గాలకు సమాచారం అందుతోందా? ఏదో… నామ్కే వాస్తే… పోటీలో ఉన్నామంటే ఉన్నామన్నట్టు కాకుండా… ఈసారి బుల్లెట్ గట్టిగా దించాలని కాషాయ పార్టీ పెద్దలు ఫిక్స్ అయ్యారా? ఏ స్థాయి అభ్యర్థుల్ని బరిలో దించబోతోంది? ఎవరెవర్ని సిద్ధంగా ఉండమని సంకేతాలు పంపుతోంది? స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ బీజేపీ కసరత్తు మొదలు పెట్టింది. అది కూడా అలా…
ఆ సీనియర్ ఎమ్మెల్యే మిత్రపక్షాలను గట్టిగా టార్గెట్ చేయడం వెనక ఆంతర్యం ఏంటి? చేతకాకుంటే సన్యాసం తీసుకోవాలన్న మాటలు ఆయన నోటి నుంచి ఎందుకు వచ్చాయి? ఆ కాషాయ నేత కొత్త అగ్గి రాజేస్తున్నారా? అసలు ఆయన కోపానికి కారణం ఏంటి? ఎవరి భుజం మీద తుపాకీ పెట్టి ఎవర్ని కాల్చాలనుకుంటున్నారు? పెన్మత్స విష్ణుకుమార్ రాజు. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అండ్ బీజేఎల్పీనేత. వైసీపీ అంటే అస్సలు గిట్టదని చెప్పుకుంటారు. అంతర్గతంగా పరిచయాలు ఎలా వున్నా……
తెలంగాణ కాంగ్రెస్ మారిపోయిందా? నాయకుల్లో పరిణితి పెరిగిపోయిందా? చిన్న ఛాన్స్ దొరికితే చాలు చెలరేగిపోయి అవతలోళ్ళని ఆడేసుకుందామని ఆరాటపడే నాయకుల్లో కూడా మార్పు వచ్చిందా? ఇంతకీ ఈ పరిణితి చర్చలు ఇప్పుడెందుకు కొత్తగా జరుగుతున్నాయి? ఏ విషయంలో మార్పు కనిపిస్తోంది? తెలంగాణ కాంగ్రెస్లో మార్పు మొదలైనట్టు కనిపిస్తోంది. సందర్భం దొరికితే చాలు…. తమకు అనుకూలంగా వాడేయడం కాంగ్రెస్ పార్టీలో కామన్. కానీ… ఇప్పుడు మాత్రం వాతావరణం దానికి భిన్నంగా నడుస్తోందట. నాయకులంతా మారిపోయారా లేదంటే పార్టీ డీఎన్ఏలోనే…