War Effects: ముంబై, చెన్నైలో గ్యాస్ సంక్షోభం.. మూతపడ్డ పలు హోటల్స్
- భారత్లో గ్యాస్ సంక్షోభం
- నిలిచిన వాణిజ్య సిలిండర్ల సరఫరా
- ముంబై, చెన్నైలో మూతపడ్డ పలు హోటల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లుంది పశ్చిమాసియా యుద్ధ పరిస్థితి. అక్కడెక్కడో యుద్ధం జరిగితే ప్రపంచ దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. గత కొద్దిరోజులుగా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. ప్రతీకారంగా ఇరాన్.. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. పైగా హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో వందలాది ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయాయి. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది.
ఇది కూడా చదవండి: Rihanna: పాప్ సింగర్ రిహన్న ఇంటిపై కాల్పులు… రంగంలోకి పోలీసులు
Also Read
- Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
- Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?
- RGV: దీదీ వర్సెస్ ఆర్జీవీ.. బెంగాల్ రాజకీయంపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్!
- Coalition Governments in India: సంకీర్ణ ప్రభుత్వాలు ఎంత వరకు నిలబడతాయి.. దేశ చరిత్ర ఏం చెబుతోంది.
ఆ సమస్య ఇప్పుడు భారత్ను కూడా తాకింది. మధ్యప్రాచ్య యుద్ధ సంక్షోభం ఇండియాను కూడా ఇబ్బంది పెడుతోంది. చమురు, గ్యాస్ నిల్వలు తగ్గుముఖం పట్టాయి. దీంతో గృహ వినియోగదారులకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తూ.. వాణిజ్య సిలిండర్ల సరఫరాను నిలిపివేశాయి. దీంతో చెన్నై, ముంబైలో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో ఇరు రాష్ట్రాల్లో పలు హోటల్స్ను మూసేయాల్సి వచ్చింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైని గ్యాస్ సరఫరా కొరత తీవ్ర ఇబ్బంది పెడుతోంది. గ్యాస్ సరఫరా సంక్షోభం కారణంగా ముంబైలోని 20 శాతం హోటళ్లు మూసివేయబడ్డాయని గ్యాస్ హోటల్ అసోసియేషన్ (GAHAAR) నివేదించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రెండు రోజుల్లో ముంబైలోని 50 శాతం హోటళ్లు మూసివేయాల్సి ఉంటుందని అసోసియేషన్ పేర్కొంది.
ఎల్పీజీ సిలిండర్ల తీవ్ర కొరతపై హోటల్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అసోసియేషన్ ఒక లేఖ రాసింది. వాణిజ్య LPG సరఫరాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రెస్టారెంట్లు, ఆహార సంబంధిత వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో తమకు సహాయం చేయాలని ప్రధాని మోడీని అసోసియేషన్ కోరింది. ఆహార పరిశ్రమ 24/7 పనిచేస్తుందని, ఆస్పత్రులు, ఐటీ పార్కులు, కళాశాల హాస్టళ్లకు ఆహారానికి ప్రాథమిక వనరు ఇదేనని అసోసియేషన్ లేఖలో పేర్కొంది. రైలు ప్రయాణికులు, వ్యాపార ప్రయాణికులకు ఆహారాన్ని అందించడంలో హోటళ్ళు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని గుర్తుచేశారు. సిలిండర్ సరఫరా అంతరాయం కలిగిస్తుందని.. తక్షణమే సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
చెన్నై హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. రవి మాట్లాడుతూ.. పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. హోటళ్లలో ఇప్పుడు రెండు రోజులకు సరిపడా సిలిండర్లు మాత్రమే ఉన్నాయని.. త్వరలో సరఫరా పునరుద్ధరించబడకపోతే చాలా హోటళ్లు మూసివేయాల్సి వస్తుందన్నారు.
ఇది కూడా చదవండి: Stock Market: మార్కెట్కు భారీ లాభాల పంట.. కారణమిదేనా?
తాజావార్తలు
-
Peddi : థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి!
-
CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
-
AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
-
Tamil Nadu: విజయ్కు గవర్నర్ బిగ్ షాక్!.. లోక్భవన్ కీలక ప్రకటన.. ఇప్పట్లో ప్రమాణస్వీకారం లేనట్లేనా?
-
TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!