Atul Subhash Suicide Case: బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు దేశంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తన భార్య నిఖితా సింఘానియా, అత్తమామలు పెట్టే వేధింపులను 24 పేజీల్లో వివరించాడు. చనిపోయే ముందు గంటకు పైగా వీడియోని రికార్డ్ చేశాడు. అందులో తన ఆవేదన, తాను ఎదుర్కొన్న తప్పుడు కేసులను గురించి చెప్పాడు
Atul Subhash Case: భార్య తప్పుడు కేసులతో వేధింపులకు గురైన బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఈ కేసులో ఇప్పటికే సుభాష్ భార్య నిఖితా సింఘానియాతో పాటు ఆమె తల్లి, సోదరుడిని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ కాన్వాయ్ను అతుల్ సుభాష్ సన్నిహితులు కారులో వెంబడించారు. ఈ పరిణామంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై వారించినా.. పట్టించుకోకుండా వెంటాడారు.
అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో భార్య నికితా సింఘానియా, ఆమె తల్లి నిషా, సోదరుడు అనురాగ్లను పోలీసులు అరెస్టు చేశారు. భార్య నికితను గురుగ్రామ్లో అరెస్టు చేయగా, తల్లి, సోదరుడిని ప్రయాగ్రాజ్లో అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచి, అక్కడి నుంచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. కొన్ని రోజుల క్రితం నికితా, ఆమె కుటుంబం వేధింపులకు బరిచలేక ఆరోపిస్తూ.. టెకీ ఆత్మహ్య చేసుకున్న విషయం తెలిసిందే.
Atul Subhash Case: బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తప్పుడు వరకట్న వేధింపులు, గృహ హింస చట్టాలు సెక్షన్ 498-ఏ ని సమీక్షించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కొందరు భర్త, అతడి ఫ్యామిలీని వేధించేందుకు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెబుతున్నారు. అతుల్ సుభాష్ ఆత్మహత్య తర్వాత, ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఈ డిమాండ్ వస్తోంది. ఆయనకు న్యాయం చేయాలని,
Bengaluru: భార్య, ఆమె కుటుంబం వేధింపుల భరించేలేక ఆత్మహత్య చేసుకున్న బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అక్రమ వరకట్న వేధింపుల కారణంగా తాను చనిపోతున్నట్లు సుభాష్ 24 పేజీల లేఖ, గంటలకు పైగా వీడియోను రికార్డ్ చేసి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వరకట్న, గృహహింస సెక్షన్ 498ఏని సమీక్షించాలని పలువురు కోరుతున్నారు.
న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగా.. ఈ కేసును పర్యవేక్షిస్తున్న జడ్జి సమస్యను పరిష్కరించేందుకు రూ.5 లక్షలు అడిగారని అతుల్ సుభాష్ తండ్రి పవన్ కుమార్ ఆరోపించారు. దీంతో మధ్యవర్తిత్వం కోసం తాము రెడీనట్లు చెప్పుకొచ్చారు.
వైవాహిక చట్టాల దుర్వినియోగంపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే విడాకుల సందర్భంగా తీసుకునే భరణం గురించి న్యాయస్థానం విధివిధానాలు వెల్లడించింది. మొత్తం 8 మార్గదర్శాలను సిద్ధం చేసింది.