Bengaluru Techie Suicide Case: కేసును పరిష్కరించేందుకు జడ్జి రూ.5 లక్షలు డిమాండ్ చేశారు..
- బెంగళూరు టెకీ ఆత్మహత్య తర్వాత వెలుగులోకి అనేక విషయాలు..
- కేసుల నుంచి విముక్తి పొందాలంటే తనకు రూ. 5 లక్షలు ఇవ్వాలని జడ్జి డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Techie Suicide Case: బెంగళూరు టెకీ ఆత్మహత్య తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సందర్భంగా అతుల్ సుభాష్ తండ్రి మాట్లాడుతూ.. సుభాష్ భార్య, ఆమె బంధువులు పెట్టే వేధింపులను తట్టుకోలేక తన కొడుకు సూసైడ్ చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. భార్య తనపై పెట్టిన కేసు నుంచి విముక్తి పొందాలంటే రూ.5లక్షలు ఇవ్వాలని అతుల్ సుభాష్ను జడ్జి డిమాండ్ చేసినట్లు అతని తండ్రి పవన్ కుమార్ ఆరోపించారు.
Read Also: Best 5G Smartphones: 25 వేల లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ఫోన్లు ఇవే.. ఫీచర్స్ అదుర్స్ అంతే!
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
అయితే, అతుల్ సుభాష్, నిఖిత సింఘానియాలకు 2019లో పెళ్లైంది.. ఆ తర్వాత కొన్నేళ్లకు ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు అతుల్ తండ్రి పవన్ కుమార్ తెలిపారు. దీంతో నిఖిత.. సుభాష్ను విడిచి పెట్టి బెంగళూరు నుంచి ఉత్తర ప్రదేశ్కు వెళ్లింది. అక్కడే ఆమె తల్లి, సోదరుని సహాయంతో అతుల్తో పాటు మాపై అనేక తప్పుడు కేసులు పెట్టిందని చెప్పుకొచ్చారు. ఈ కేసు విచారణ కోసం తన కుమారుడు బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్కి 40కి కంటే ఎక్కువ సార్లు వెళ్లి వచ్చాడని బాధితుడి తండ్రి వాపోయాడు.
Read Also: Triple Talaq: భార్య ఒంటరిగా వాకింగ్కు వెళ్తుందని ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త..
కాగా, న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగా.. ఈ కేసును పర్యవేక్షిస్తున్న జడ్జి సమస్యను పరిష్కరించేందుకు రూ.5 లక్షలు అడిగారని అతుల్ సుభాష్ తండ్రి పవన్ కుమార్ ఆరోపించారు. దీంతో మధ్యవర్తిత్వం కోసం తాము రెడీనట్లు చెప్పుకొచ్చారు. ఆ సమయంలో మధ్యవర్తిత్వం వహించినందుకు ముందు రూ.20 వేల ఇవ్వాలని కోరాడు.. ఆ తర్వాత రూ.40వేలకు పెంచారని చెప్పుకొచ్చారు. అతనికి (సుభాష్) సెటిల్మెంట్ కావాలనుకుంటే రూ. 5 లక్షలు ఇవ్వాలని సదరు న్యాయమూర్తి డిమాండ్ చేసినట్లు పవన్ కుమార్ పేర్కొన్నారు.
Read Also: YS Avinash Reddy: సాగునీటి సంఘాల ఎన్నికల వివాదం.. వేములలో ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్
ఇక, అతుల్ సుభాష్ కేసు దర్యాప్తును బెంగళూరు మారతహళ్లి పోలీసులు వేగంగా విచారణ చేస్తున్నారు. మృతుని సోదరుడు బికాస్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల కోసం యూపీలోని జౌన్పూర్కి వెళ్లారు. అక్కడ అతుల్ భార్య నిఖితా సింఘానియా, ఆమె తల్లి నిశా, సోదరుడు అనురాగ్, బంధువు సుశీల్ కోసం గాలించారు. బిహార్లో ఉండే మృతుని తల్లిదండ్రుల నుంచి కూడా పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!