Atul Subhash Suicide Case: అతుల్ సుభాష్ భార్యకు కర్ణాటక హైకోర్టు షాక్..
- ‘‘విచారణ ఎందుకు కోరుకోవడం లేదు’’..
- అతుల్ సుభాష్ భార్యకి షాక్ ఇచ్చిన కర్ణాటక హైకోర్టు..
- ఇటీవల సంచలనంగా మారిన బెంగళూర్ టెక్కీ సూసైడ్..
- భార్య నిఖితా సింఘానియా వేధింపుల కారణంగా ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atul Subhash Suicide Case: బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు దేశంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తన భార్య నిఖితా సింఘానియా, అత్తమామలు పెట్టే వేధింపులను 24 పేజీల్లో వివరించాడు. చనిపోయే ముందు గంటకు పైగా వీడియోని రికార్డ్ చేశాడు. అందులో తన ఆవేదన, తాను ఎదుర్కొన్న తప్పుడు కేసులను గురించి చెప్పాడు. తనపై అన్యాయంగా వరకట్న వేధింపులు, గృహహింస కేసులు పెట్టినట్లు భార్య నికితపై ఆరోపించారు. విడాకుల సెటిల్మెంట్ కోసం రూ. 3 కోట్లు ఇవ్వాలని తనను వేధించినట్లు సుభాష్ పేర్కొన్నాడు. ఈ వ్యవహారంలో నిఖితా సింఘానియాతో పాటు ఆమె తల్లి, సోదరుడుని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా వీరికి బెయిల్ లభించింది.
Read Also: Roja: అల్లు అర్జున్ పేరు లాగుతూ పవన్ కళ్యాణ్ పై రోజా విమర్శలు
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
ఇదిలా ఉంటే, తనపై నమోదైన ఎఫ్ఐఆర్ని రద్దు చేయాలని నిఖితా సింఘానియా అభ్యర్థనని కర్ణాటక హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. జస్టిస్ ఎస్ ఆర్ కృష్ణ కుమార్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ మౌఖికంగా ఉత్తర్వులు జారీ చేసింది. నిఖితా సింఘానియా డిమాండ్ని ధర్మాసనం వ్యతిరేకించింది. ‘‘ ఈ నేరం యొక్క ప్రాథమిక అంశాలు ఫిర్యాదులో ఉన్నాయి. విచారణ జరగాలని మీరు ఎందుకు కోరుకోరు..?’’ అని ధర్మాసనం సింఘానియాని ప్రశ్నించింది. నిఖితా తరుపు లాయర్ మాట్లాడుతూ.. ఆత్మహత్యకు ప్రేరేపించిన ఎలాంటి చర్యలను ఎఫ్ఐఆర్ ప్రస్తావించలేదని హైకోర్టుకు చెప్పారు. పిటిషనర్కి చట్టపరమైన పరిష్కారాలు పొందే హక్కు ఉందని, అతుల్ సుభాష్ ఫిర్యాదు చేసినంత మాత్రాన కేసు బుక్ చేయలేని వాదించాడు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం అభ్యంతరాలను దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా సేకరించిన మెటీరియల్లను సమర్పించాలని ప్రాసిక్యూషన్కు ఆదేశాలు కూడా ఇచ్చారు.
తాజావార్తలు
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
Survival Thriller: గుహల్లో చిక్కుకున్న స్నేహితులు.. ప్రాణాలు తీసే రహస్య జీవి… వణికించబోతున్న సర్వైవల్ థ్రిల్లర్
-
Kannada Villains : తెలుగు సినిమాల్లో బలమైన విలన్లుగా ముద్ర వేస్తున్నారు కన్నడ నటులు
-
Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
-
Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!