Atul Subhash Suicide Case: అతుల్ సుభాష్ భార్యకు కర్ణాటక హైకోర్టు షాక్..
- ‘‘విచారణ ఎందుకు కోరుకోవడం లేదు’’..
- అతుల్ సుభాష్ భార్యకి షాక్ ఇచ్చిన కర్ణాటక హైకోర్టు..
- ఇటీవల సంచలనంగా మారిన బెంగళూర్ టెక్కీ సూసైడ్..
- భార్య నిఖితా సింఘానియా వేధింపుల కారణంగా ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atul Subhash Suicide Case: బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు దేశంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తన భార్య నిఖితా సింఘానియా, అత్తమామలు పెట్టే వేధింపులను 24 పేజీల్లో వివరించాడు. చనిపోయే ముందు గంటకు పైగా వీడియోని రికార్డ్ చేశాడు. అందులో తన ఆవేదన, తాను ఎదుర్కొన్న తప్పుడు కేసులను గురించి చెప్పాడు. తనపై అన్యాయంగా వరకట్న వేధింపులు, గృహహింస కేసులు పెట్టినట్లు భార్య నికితపై ఆరోపించారు. విడాకుల సెటిల్మెంట్ కోసం రూ. 3 కోట్లు ఇవ్వాలని తనను వేధించినట్లు సుభాష్ పేర్కొన్నాడు. ఈ వ్యవహారంలో నిఖితా సింఘానియాతో పాటు ఆమె తల్లి, సోదరుడుని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా వీరికి బెయిల్ లభించింది.
Read Also: Roja: అల్లు అర్జున్ పేరు లాగుతూ పవన్ కళ్యాణ్ పై రోజా విమర్శలు
Also Read
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
ఇదిలా ఉంటే, తనపై నమోదైన ఎఫ్ఐఆర్ని రద్దు చేయాలని నిఖితా సింఘానియా అభ్యర్థనని కర్ణాటక హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. జస్టిస్ ఎస్ ఆర్ కృష్ణ కుమార్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ మౌఖికంగా ఉత్తర్వులు జారీ చేసింది. నిఖితా సింఘానియా డిమాండ్ని ధర్మాసనం వ్యతిరేకించింది. ‘‘ ఈ నేరం యొక్క ప్రాథమిక అంశాలు ఫిర్యాదులో ఉన్నాయి. విచారణ జరగాలని మీరు ఎందుకు కోరుకోరు..?’’ అని ధర్మాసనం సింఘానియాని ప్రశ్నించింది. నిఖితా తరుపు లాయర్ మాట్లాడుతూ.. ఆత్మహత్యకు ప్రేరేపించిన ఎలాంటి చర్యలను ఎఫ్ఐఆర్ ప్రస్తావించలేదని హైకోర్టుకు చెప్పారు. పిటిషనర్కి చట్టపరమైన పరిష్కారాలు పొందే హక్కు ఉందని, అతుల్ సుభాష్ ఫిర్యాదు చేసినంత మాత్రాన కేసు బుక్ చేయలేని వాదించాడు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం అభ్యంతరాలను దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా సేకరించిన మెటీరియల్లను సమర్పించాలని ప్రాసిక్యూషన్కు ఆదేశాలు కూడా ఇచ్చారు.
తాజావార్తలు
-
Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
-
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..