తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో దాదాపు 10వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త జోనల్ విధానంపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వీటిని భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పోస్టుల్లో 1,250 పైగా జూనియర్ లెక్చరర్ పోస్టులు ఉండగా.. భాషా పండితులు, పీఈటీలు కలిపి మరో 1,200 ఉన్నాయి. వీటి భర్తీ కోసం ఇప్పటికే ప్రభుత్వానికి సొసైటీలు ప్రతిపాదనలు పంపాయి.…
కొత్త జోనల్ విధానం ప్రకారం జీవో 317 అమలుపై రాజకీయ రగడ నెలకొంది. ఇలాంటి సమయంలో సీఎం నేరుగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడి.. వారిని మందలించినంత పనిచేసినట్టు సమాచారం. ఇంతకీ ఏం జరిగింది? జీవో 317పై ఉద్యోగుల్లో గందరగోళం.. టెన్షన్317 జీవో. ప్రస్తుతం తెలంగాణలో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న అంశం. కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపుపై 317 జీవో ప్రకారమే మార్గదర్శకాలను విడుదల…
నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది తెలంగాణ హైకోర్టు.. 226 మంది ఉపాధ్యాయుల పిటిషన్పై సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ జరిపింది.. రాష్ట్రపతి ఉత్తర్వులతో పాటు, గతంలోని కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా జీవోలు ఉన్నాయని పిటిషనర్లు వాదించారు.. అయితే, ఈ వ్యవహారంలో ప్రభుత్వ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.. ఇదే సమయంలో నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు…