Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. “మహామంత్రం” జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
- 9 రోజలు తర్వాత టన్నెల్ నుంచి సురక్షితంగా నేపాలీ కార్మికుడు.
- 170 మీటర్ల లోతులో చిక్కుకుపోయిన ఇద్దరు కార్మికులు..
- ఆహారం, నీరు లేకుండా ‘‘మహామంత్రాన్ని’’ జపిస్తూ ప్రాణాలతో..
- స్వీయ అనుభవాలు చెప్పిన కార్మికుడు సంజయ్ షా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Floods: నేపాల్ వరదలు వేయి మందికి పైగా ప్రజల ప్రాణాలను తీశాయి. ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. అక్కడక్కడ కొందరు అద్భుతంగా బయటపడుతున్నారు. 9 రోజుల తర్వాత టన్నెల్లో చిక్కుకున్న ఇద్దరు హైడ్రో పవర్ కార్మికులు సజీవంగా బయటపడ్డారు. 30 ఏళ్ల సంజయ్ షా వరదలు సంభవించిన నాటి నుంచి టన్నెల్లో ఆహారం, నీరు లేకుండా సజీవంగా ఉండటం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
‘‘ప్రమాదంలో చిక్కు్కున్నప్పటి నుంచి తాము మహామంత్రాన్ని జపిస్తూ దేవుడిని ప్రార్థించాము’’ అని చెప్పారు. శుక్రవారం రక్షణ సిబ్బంది బురదతో నిండిన ఒక మార్గం ద్వారా సంజయ్ షానున బయటకు తీసుకువస్తున్న దృశ్యాలను నేపాల్ ఇంధన మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. బయటకు వచ్చిన తర్వాత హెలికాప్టర్ ద్వారా ఆయనను ఆస్పత్రికి తరలించారు. రెండో వ్యక్తిని కూడా రెస్క్యూ సిబ్బంది కాపాడింది. ప్రాణాలతో బయటపడిన ఇద్దరు వ్యక్తులు కూడా నేపాల్కు చెందినవారే. ఆగస్టు 26న చైనా-నేపాల్ సరిహద్దుల్లోని పర్వత ప్రాంతాల్లో భారీ కొండచరియలు కూలిపోవడంతో ఒక్కసారిగా భోటేకోశి, త్రిశూలి నదులకు వరదలు సంభవించాయి. ఈ వరదల్లో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. 1,280 మంది మరణించగా, 5,500 మందికి పైగా గల్లంతయ్యారు.
Also Read
- Belgium: భారత్ ఎప్పుడో హెచ్చరించింది, మేము వినలేదు.. చైనాకు బెల్జియం ప్రధాని షాక్..
- XI Jinping: చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు గుండెపోటు..? వారసుడిని ప్రకటిస్తే తిరుగుబాటు భయం.?
- Miracle Rescue: నేపాల్లో అద్భుత రెస్క్యూ.. 9 రోజుల తర్వాత టన్నెల్ నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా బయటకు! (వీడియో)
- Indian Air Force: పాక్ బోర్డర్లో గర్జనకు సిద్ధమౌతున్న భారత వాయుసేన.. బిగ్ వార్ ప్రిపరేషన్కి రెడీ!
ఆ సమయంలో ఎగువ త్రిశూలి-3ఏ హైడ్రో పవర్ ప్రాజెక్టులో మెకానికల్ ఫోర్మన్గా పనిచేస్తున్న సంజయ్ షా టన్నెల్లో 170 మీటర్ల లోతులో చిక్కుకుపోయాడు. ప్రమాద హెచ్చరికలు వచ్చిన వెంటనే తాము సురక్షితంగా బయటకు రావడానికి ప్రయత్నించామని, తన సహచరుల్ని వదిలి ఒంటరిగా పారిపోవాలని తనకు అనిపించలేదని చెప్పారు. ఒక్కసారిగా నీరు వేగంగా రావడంతో బయటకు వెళ్లే అన్ని మార్గాలు మూసుకుపోయాయని తెలిపారు. టన్నెల్ చాలా పొడవు ఉండటంతో కొద్దిసేపటికే అందరూ లోపల చిక్కుకుపోయారని, ఆ తర్వాత వారి పరిస్థితి ఎలా ఉంది.? అని తెలుసుకోవడం కష్టంగా మారిందని అన్నారు. 9 రోజుల తర్వాత సురక్షితంగా బయటపడటంపై సంతోషం వ్యక్తం చేస్తూ, ఇది తనకు పునర్జన్మ అని చెప్పారు.
టన్నెల్లో ఆక్సిజన్ ఉండటంతో..
రెస్క్యూ ఆపరేషన్ చేసిన నిపుణుల ప్రకారం.. సుమారు 4.5 కిలోమీటర్ల పొడవైన టన్నెల్లో స్థిరమైన గాలి, ఆక్సిజన్ ఉండటం వల్లే వారు శ్వాసించవచ్చని భావిస్తు్న్నారు. నేపాల్ రక్షక సిబ్బందికి భారత్, చైనా, దక్షిణ కొరియాకు చెందిన నిపుణులు కూడా సహాయం అందిస్తున్నారు. హైడ్రోపవర్ టన్నెల్స్లో చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్న ఇతర కార్మికుల కోసం గాలింపు కొనసాగుతోంది.
TWO MEN RESCUED ALIVE AFTER 9 DAYS IN NEPAL TUNNEL
Sanjay Sah and Kabir Maharjan were rescued alive from the Trishuli 3A hydropower tunnel, nine days after the August 26 flash flood.
Rescuers heard voices inside and are continuing the search for others who may remain trapped. pic.twitter.com/ttV3RKbdtd
— Subodh Kumar (@kumarsubodh_) September 4, 2026
తాజావార్తలు
-
Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. “మహామంత్రం” జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఆత్మకథ పబ్లిష్ నుంచి వైదొలిగిన పెంగ్విన్.. కొత్త పబ్లిషర్ ఎవరంటే..!
-
కొండా సురేఖను బీఆర్ఎస్లోకి రానివ్వం.. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం: జగదీష్ రెడ్డి
-
Sheikh Hasina: డిసెంబర్లో బంగ్లాదేశ్కు వెళ్తా.. మరణశిక్షపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు
-
Krishna Janmashtami 2026: జన్మాష్టమి పూజలో ఈ 5 వస్తువులను సమర్పించండి.. అన్నీ శుభ ఫలితాలే..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!