Home
Neet
Neet News
-
NEET 2023 Results: నీట్ ఫలితాలు విడుదల.. టాపర్ మనోడే
NEET 2023 Results: మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్(NEET) 2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వరుణ్ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన ప్రభంజన్ ఈ ఏడాది జాతీయ స్థాయిలో టాపర్లుగా నిలిచారు. 99.99 పర్సంటైల్ స్కోర్ తో అగ్రస్థానంలో నిలిచారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) మంగళవారం ప్రకటించింది. మొత్తం 20.38 లక్షల మంది అభ్యర్థులు నీట్ పరీక్షను రాయగా.. 11.45 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. -
NEET Exam: మణిపూర్లో నీట్ పరీక్ష వాయిదా.. ఎన్టీఏ నిర్ణయం
ఆదివారం దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేసింది. దేశవ్యాప్తంగా 13 భాషల్లో, 499 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. అయితే ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మాత్రం నీట్ పరీక్షలు వాయిదాపడ్డాయి. మణిపూర్లో పరీక్ష కేంద్రాలు కేటాయించిన అభ్యర్థులందరికీ రేపు నీట్ పరీక్ష ఉండదని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. -
NEET: ఏడాదికి రెండుసార్లు నీట్ ఎగ్జామ్.. కేంద్రం మంత్రి క్లారిటీ..
NEET: ఏడాదికి రెండుసార్లు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ని నిర్వహించేలా జాతీయవైద్య కమిషన్(ఎన్ఎంసీ), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు కేంద్ర ఆరోగ్య సహాయమంత్రి భారతి ప్రవన్ పవార్ క్లారిటీ ఇచ్చారు. అలాంటి ప్రతిపాదన ఏం లేదని ఆమె లోక్ సభకు తెలియజేశారు. నీట్ ను ఏడాదికి రెండుసార్లు నిర్వహించే ఆలోచన లేదని కేంద్రం ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం లోక్ సభకు తెలిపింది. -
Central Govt: వచ్చే రెండేళ్లలో ఆ ప్రవేశ పరీక్షలను విలీనం చేసే ప్రతిపాదన లేదు..
ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ, మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్లను కామన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షతో విలీనం చేసే ఆలోచన లేదని కేంద్ర విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. రాజస్థాన్లోని కోట శిక్షణా కేంద్రంలో విద్యార్థులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. -
Inspirational News: కొడుకును ఆదర్శంగా తీసుకున్న తండ్రి. డాక్టర్ అయ్యేందుకు 55 ఏళ్ల వయసులో ‘నీట్’కి హాజరు
Inspirational News: సహజంగా తండ్రిని కొడుకు ఆదర్శంగా తీసుకుంటాడు. కానీ ఈ కథ వేరు. తండ్రే కొడుకు బాటలో నడిచాడు. డాక్టర్ అవ్వాలనే జీవితాశయాన్ని నెరవేర్చుకునేందుకు ఏకంగా 55 ఏళ్ల వయసులో 'నీట్'కి హాజరయ్యాడు. అతని పేరు కె.రాజ్యక్కొడి. తమిళనాడులోని మదురై వాసి. రైతు. -
Neet-PG 2021: ప్రత్యేక కౌన్సెలింగ్ కోరుతూ దాఖలైన పిటిషన్లు కొట్టివేత
నీట్-పీజీ 2021 కౌన్సెలింగ్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్ కోరుతూ దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మిగిలిన సీట్లను ఇప్పుడు భర్తీ చేస్తే.. ప్రస్తుత ఏడాదిపై ప్రభావం పడుతుందన్న కేంద్రం వివరణతో ఏకీభవిస్తున్నామన్న ధర్మాసనం.. పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వైద్య విద్యలో రాజీ పడలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. మిగిలిపోయిన 1,456 సీట్లకు మరో రౌండ్ ప్రత్యేక స్ట్రే కౌన్సెలింగ్ నిర్వహించాలన్న పిటిషన్లపై.. జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్… -
NEET: నీట్ విద్యార్థులకు శుభవార్త.. ఆ పరిమితి ఎత్తివేత
మెడికల్ విద్య చదవాలనుకుంటున్న వారికి శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. అండర్ గ్రాడ్యుయేషన్ నీట్కు గరిష్ట వయోపరిమితిని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు అండర్ గ్రాడ్యుయేషన్ నీట్ రాసేందుకు జనరల్ కేటగిరి అభ్యర్థులకు 25 ఏళ్లు, రిజర్వేషన్ కేటగిరి వారికి 30 ఏళ్ల వయోపరిమితి నిబంధన ఉండగా.. తాజా నిర్ణయంతో గరిష్ట వయోపరిమితి నిబంధన తొలగిపోయినట్టు అయ్యింది.. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్… -
నీట్లో ఓబీసీ రిజర్వేషన్ల కోటాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
నీట్ ప్రవేశాల్లో ఓబీసీ విద్యార్థుల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైద్య విద్య కోసం జాతీయస్ధాయిలో నిర్వహిస్తున్న నీట్ ప్రవేశపరీక్ష అడ్మిషన్లలో ఓబీసీ కోటా రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రతిభకు ఎక్కువ మార్కులే కొలమానం కాదని.. నీట్ ప్రవేశాల్లో ఓబీసీ స్టూడెంట్లకు రిజర్వేషన్లను అనుమతిస్తూ జనవరి 7న ఇచ్చిన తీర్పుకే కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. 2021–22 అడ్మిషన్లలో రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేయాలని తేల్చి చెప్పింది. సామాజిక, ఆర్థిక నేపథ్యానికి సంబంధించి మెరిట్… -
నీట్ పీజీ ప్రవేశాలకు సుప్రీంకోర్టు అనుమతి
వైద్య విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. 2021-22 వార్షిక సంవత్సరానికి సంబంధించి నీట్ పీజీ అడ్మిషన్లకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, ఏఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉదయం తీర్పు వెల్లడించింది. ఈ మేరకు నీట్ పీజీ ప్రవేశాలకు కోటాను కూడా ఫిక్స్ చేసింది. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్, ఆర్థిక బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్కు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. దీంతో నీట్ పీజీ కౌన్సెలింగ్పై నెలకొన్న ప్రతిష్టంభనకు… -
నీట్పై స్టాలిన్ సర్కార్ కీలక నిర్ణయం…
నిన్నటి రోజున దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు జరిగాయి. దేశంలోని 202 నగరాలు, పట్టణాల్లో ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 16 లక్షల మంది ఈ పరీక్షలకు ధరఖాస్తు చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే, నీట్ పరీక్షలకు వ్యతిరేకంగా తమిళనాడులో విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. కొంత మంది విద్యార్థులు ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఈరోజు కీలక నిర్ణయం తీసుకున్నది. నీట్ నుంచి తమిళనాడుకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది.…
తాజావార్తలు
-
King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Tamannaah Bhatia: ‘రాగిణి 3’ షూటింగ్ ప్రారంభం.. సెట్స్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
-
OnePlus N6x: వన్ప్లస్ N6x త్వరలో భారత్లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!