Asifabad: నీట్ పరీక్షపై గందర గోళం.. సెలెక్ట్ చేసిన పేపర్ కు బదులు మరో పేపర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komaram Bhim Asifabad District: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నీట్ పరీక్ష నిర్వహణ పై గందర గోళం పరిస్థితి నెలకొంది. సెలెక్ట్ చేసిన పేపర్ కు బదులుగా నిర్వాహకులు మరో పేపర్ ఇచ్చినట్లు సమాచారం. జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో నీట్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఈ పరీక్షా కేంద్రంలో 323 మంది విద్యార్థులకుగాను 299 మంది విద్యార్థులు హాజరై ఎగ్జామ్ రాశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఎన్ టి ఏ అందించిన పేపర్ ఒకటైతే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో అందించిన పేపర్ మారడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.
Read also: Gold Price Today : షాకింగ్ న్యూస్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
Also Read
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
ఎస్బిఐ బ్యాంకు నుండి తీసుకురావలసిన పేపర్ కు బదులు కెనరా బ్యాంకు నుండి తీసుకువచ్చిన పేపర్ ను ఇవ్వడంతో విద్యార్థులు గందర గోళంలో పడ్డారు. దేశవ్యాప్తంగా Gridu అనే పేపర్ ఇవ్వాల్సి ఉండగా Nagnu అనే పేపర్ ఇచ్చినట్టు విద్యార్థులు చెపుతున్నారు. ఈ పరీక్షా కేంద్రంలో నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. (NTA) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పందించి, ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. నిన్న సాయంత్రం 5 గంటల వరకు పరిక్ష జరిగింది. పరీక్షపై యూట్యూబ్ లో అనాల్సిస్ వీడియో చూడడంతో వీళ్లు రాసిన పేపర్ లోని ఒక్క ప్రశ్న మ్యాచ్ కాలేదు.
Read also: T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్కు ఉగ్రదాడి భయం..?
దీంతో ఆసిఫాబాద్ విద్యార్థులు ఖంగుతిన్నారు. దీంతో వేరే జిల్లా వేరే సెంటర్ లో రాసిన విద్యార్థుల పేపర్ లతో పోల్చి చూడటంతో పేపర్ మారిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇవ్వాళ జిల్లా కలెక్టర్ కు ఆసిఫాబాద్ లో నీట్ రాసిన విద్యార్థులు పిర్యాదు చేయనున్నారు. అయితే.. దీనిపై కోఆర్డినేటర్ నరేందర్ స్పందిస్తూ.. తప్పిదం జరిగిందని పై స్థాయి వాళ్లకు సమాచారం ఇచ్చామంటున్నారు. మరి ఆసిఫాబాద్ విద్యార్థులు నీట్ పరీక్ష రాసిన ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. మరి దీనిపై ప్రభుత్వ అధికారులు స్పందిస్తారా? కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Rahul Gandhi : రాహుల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన 181యూనివర్శిటీల వైస్ ఛాన్స్లర్లు
తాజావార్తలు
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?