MK Stalin: నీట్ ‘స్కామ్’ను అంతం చేయడమే లక్ష్యం..
- నీట్ స్కామ్ను అంతం చేయడమే లక్ష్యం- ఎంకే స్టాలిన్
- నీట్ రీ-ఎగ్జామ్ జూన్ 23న జరుగుతుంది
- నీట్ యూజీ పరీక్షలో గ్రేస్ మార్కులు రద్దు చేయబడ్డాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) కుంభకోణానికి ముగింపు పలకాలని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఎంకే స్టాలిన్ శుక్రవారం అన్నారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. విద్యా సమగ్రతను కాపాడేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
Read Also: White Hair: జుట్టు తెల్లగా ఎందుకు మారుతుందంటే..
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
ఈ కార్యక్రమంలో.. రాష్ట్ర విద్యా రంగంలో అకడమిక్ ఎక్సలెన్స్, ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు. నీట్పై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది విద్యారంగంలో హానికరమైన అక్రమంగా పేర్కొన్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. ‘‘నీ నుంచి ఎవ్వరూ దోచుకోలేని ఏకైక ఆస్తి చదువు.. కానీ అందులోనూ నీట్ లాంటి మోసాలు ఉన్నాయి.. అందుకే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.. నీట్ మోసమని తమిళనాడు ప్రభుత్వం మొదట చెప్పింది.. ఇప్పుడు దేశం మొత్తం ఇది మా బాధ్యత అని చెప్పడం మొదలుపెట్టారు, ఆర్థిక పరిస్థితి లేదా రాజకీయ పరిస్థితులు విద్యార్థుల చదువుకు అడ్డంకి కాకూడదు’’ అని ఎంకే స్టాలిన్ అన్నారు.
Read Also: Actress Hema: బెంగళూరు జైలు నుంచి విడుదలైన సినీనటి హేమ
మరోవైపు.. నీట్ అభ్యర్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. “విద్యార్థుల ఆందోళనలన్నీ న్యాయంగా.. సమానత్వంతో పరిష్కరించబడతాయని, నేను వారికి హామీ ఇస్తున్నాను. ఏ విద్యార్థికి నష్టం జరగదు.. ఏ పిల్లల కెరీర్ ప్రమాదంలో ఉండదు” అని ఎక్స్ లో పేర్కొన్నారు. కాగా.. NEET-UG 2024లో 1,563 మంది విద్యార్థులకు మంజూరు చేసిన గ్రేస్ మార్కులను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించిందని గురువారం సుప్రీంకోర్టుకు సమాచారం అందించింది. అయితే.. జూన్ 23న పునఃపరీక్ష జరగనుంది. జూన్ 30లోగా ఫలితాలు విడుదల చేస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) హామీ ఇచ్చింది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!