MK Stalin: నీట్ ‘స్కామ్’ను అంతం చేయడమే లక్ష్యం..
- నీట్ స్కామ్ను అంతం చేయడమే లక్ష్యం- ఎంకే స్టాలిన్
- నీట్ రీ-ఎగ్జామ్ జూన్ 23న జరుగుతుంది
- నీట్ యూజీ పరీక్షలో గ్రేస్ మార్కులు రద్దు చేయబడ్డాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) కుంభకోణానికి ముగింపు పలకాలని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఎంకే స్టాలిన్ శుక్రవారం అన్నారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. విద్యా సమగ్రతను కాపాడేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
Read Also: White Hair: జుట్టు తెల్లగా ఎందుకు మారుతుందంటే..
Also Read
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్లోనే అత్యధికం..!
- RK Roja: మంత్రి లోకేష్పై రోజా సంచలన ఆరోపణలు..
ఈ కార్యక్రమంలో.. రాష్ట్ర విద్యా రంగంలో అకడమిక్ ఎక్సలెన్స్, ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు. నీట్పై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది విద్యారంగంలో హానికరమైన అక్రమంగా పేర్కొన్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. ‘‘నీ నుంచి ఎవ్వరూ దోచుకోలేని ఏకైక ఆస్తి చదువు.. కానీ అందులోనూ నీట్ లాంటి మోసాలు ఉన్నాయి.. అందుకే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.. నీట్ మోసమని తమిళనాడు ప్రభుత్వం మొదట చెప్పింది.. ఇప్పుడు దేశం మొత్తం ఇది మా బాధ్యత అని చెప్పడం మొదలుపెట్టారు, ఆర్థిక పరిస్థితి లేదా రాజకీయ పరిస్థితులు విద్యార్థుల చదువుకు అడ్డంకి కాకూడదు’’ అని ఎంకే స్టాలిన్ అన్నారు.
Read Also: Actress Hema: బెంగళూరు జైలు నుంచి విడుదలైన సినీనటి హేమ
మరోవైపు.. నీట్ అభ్యర్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. “విద్యార్థుల ఆందోళనలన్నీ న్యాయంగా.. సమానత్వంతో పరిష్కరించబడతాయని, నేను వారికి హామీ ఇస్తున్నాను. ఏ విద్యార్థికి నష్టం జరగదు.. ఏ పిల్లల కెరీర్ ప్రమాదంలో ఉండదు” అని ఎక్స్ లో పేర్కొన్నారు. కాగా.. NEET-UG 2024లో 1,563 మంది విద్యార్థులకు మంజూరు చేసిన గ్రేస్ మార్కులను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించిందని గురువారం సుప్రీంకోర్టుకు సమాచారం అందించింది. అయితే.. జూన్ 23న పునఃపరీక్ష జరగనుంది. జూన్ 30లోగా ఫలితాలు విడుదల చేస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) హామీ ఇచ్చింది.
తాజావార్తలు
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
-
BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..