MK Stalin: నీట్ ‘స్కామ్’ను అంతం చేయడమే లక్ష్యం..
- నీట్ స్కామ్ను అంతం చేయడమే లక్ష్యం- ఎంకే స్టాలిన్
- నీట్ రీ-ఎగ్జామ్ జూన్ 23న జరుగుతుంది
- నీట్ యూజీ పరీక్షలో గ్రేస్ మార్కులు రద్దు చేయబడ్డాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) కుంభకోణానికి ముగింపు పలకాలని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఎంకే స్టాలిన్ శుక్రవారం అన్నారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. విద్యా సమగ్రతను కాపాడేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
Read Also: White Hair: జుట్టు తెల్లగా ఎందుకు మారుతుందంటే..
Also Read
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
- Lionel Messi: ఫుట్బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
ఈ కార్యక్రమంలో.. రాష్ట్ర విద్యా రంగంలో అకడమిక్ ఎక్సలెన్స్, ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు. నీట్పై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది విద్యారంగంలో హానికరమైన అక్రమంగా పేర్కొన్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. ‘‘నీ నుంచి ఎవ్వరూ దోచుకోలేని ఏకైక ఆస్తి చదువు.. కానీ అందులోనూ నీట్ లాంటి మోసాలు ఉన్నాయి.. అందుకే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.. నీట్ మోసమని తమిళనాడు ప్రభుత్వం మొదట చెప్పింది.. ఇప్పుడు దేశం మొత్తం ఇది మా బాధ్యత అని చెప్పడం మొదలుపెట్టారు, ఆర్థిక పరిస్థితి లేదా రాజకీయ పరిస్థితులు విద్యార్థుల చదువుకు అడ్డంకి కాకూడదు’’ అని ఎంకే స్టాలిన్ అన్నారు.
Read Also: Actress Hema: బెంగళూరు జైలు నుంచి విడుదలైన సినీనటి హేమ
మరోవైపు.. నీట్ అభ్యర్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. “విద్యార్థుల ఆందోళనలన్నీ న్యాయంగా.. సమానత్వంతో పరిష్కరించబడతాయని, నేను వారికి హామీ ఇస్తున్నాను. ఏ విద్యార్థికి నష్టం జరగదు.. ఏ పిల్లల కెరీర్ ప్రమాదంలో ఉండదు” అని ఎక్స్ లో పేర్కొన్నారు. కాగా.. NEET-UG 2024లో 1,563 మంది విద్యార్థులకు మంజూరు చేసిన గ్రేస్ మార్కులను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించిందని గురువారం సుప్రీంకోర్టుకు సమాచారం అందించింది. అయితే.. జూన్ 23న పునఃపరీక్ష జరగనుంది. జూన్ 30లోగా ఫలితాలు విడుదల చేస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) హామీ ఇచ్చింది.
తాజావార్తలు
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
-
Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
-
Dulquer Salman: ‘ఐ యామ్ గేమ్’ కోసం నాగ్ అశ్విన్ ఎడిటింగ్..
-
Nag Ashwin : దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’లో మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!