తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ట్రాన్స్ మహిళ నివేత (20), చిన్నదురై అనే దళిత విద్యార్థి ఉత్తీర్ణత సాధించారు. తిరునల్వేలి జిల్లాకు చెందిన చిన్నదురై 78 శాతం మార్కులు సాధించగా.. నివేత 47.1 శాతం మార్కులు సాధించింది. వీరిని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం ఘనంగా సత్కరించారు. ముఖ్యమంత్రి సమక్షంలో తన ఛాంబర్లో నివేత, చిన్నదురైను ఘనంగా సత్కరించారు. పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళి, ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా ఉన్నారు. కాగా.. చిన్నదురై పై 17, ఆగష్టు 2023లో ఆధిపత్య కులానికి చెందిన ముగ్గురు సహచరులు క్రూరంగా దాడి చేశారు.ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
READ MORE: Allu Arjun : ఇంజిన్ లేని బోగిలా వెళ్తున్న నన్ను ఆయన సరైన దారిలో పెట్టారు..
ట్రాన్స్ జెండర్ నివేతను తల్లిదండ్రులు వెలివేశారు. 14 ఏళ్ళ వయసులో ఇంటిని విడిచిపెట్టి, ఇతర లింగమార్పిడి వ్యక్తులలో మద్దతును పొందింది. 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. నివేత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. నేషనల్కు కూడా హాజరయ్యారని చెప్పింది. నీట్(NEET) పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తుందనే నమ్మకం ఉందని తెలిపింది. తన చదువుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, తన అమ్మమ్మలు శాంబవి, అనూషీల సహకారం వల్లే తాను ఇంత దూరం వచ్చానని ఆమె తెలిపింది.
చిన్నదురై మీడియాతో మాట్లాడుతూ.. “సీఎం నన్ను అభినందించారు. నా ఉన్నత చదువులకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. నా భవిష్యత్తు ప్రణాళికలను సీఎం అడిగారు. నేను తిరునెల్వేలిలోని ఒక కళాశాలలో బీకాం (B.Com) చదవాలనుకుంటున్నాను అని చెప్పాను. నేను ఆడిటర్గా మారడానికి నేను సీఏ (CA) తీసుకోవాలనుకుంటున్నాను. నా మార్కులతో కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉన్నారు’ అన్నాడు. 2023లో తనపై జరిగిన దాడి గురించి అడిగినప్పుడు, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని చిన్నదురై అన్నారు, అందరూ ఐక్యంగా ఉండాలని తాను కోరారు.