NEET Result 2024: నీట్ లో మెరిసిన తెలుగు తేజాలు.. ఏపీలో నలుగురికి ఒకటో ర్యాంక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైద్య విద్యనభ్యసించి పేద వారికి వైద్య సేవలందించాలని కొందరు తహతహలాడుతుంటారు. ఇందుకోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్వహించే ఎంట్రెన్స్ పరీక్షలను రాస్తుంటారు. వైద్య విద్య కోసం దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ పరీక్షను నిర్వహిస్తారు. నీట్ యూజీ పరీక్ష మే 5, 2024న జరిగింది. తాజాగా నీట్ పరీక్ష ఫలితాలను మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ విడుదల చేసింది. నీట్ అభ్యర్థులు exams.nta.ac.in/NEETలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చూడొచ్చు.
READ MORE: India Alliance Meeting: నేడు ఇండియా కూటమి సమావేశం.. ఎన్టీయే మిత్రపక్షాలకు గాలం!
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
దేశవ్యాప్తంగా ఈసారి 23.33 లక్షల మంది పరీక్ష రాశారు. వారిలో 13.16 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 67 మందికి సమాన పర్సంటైల్(99.997129) దక్కడంతో వారందరికీ ఒకటో ర్యాంకు కేటాయించారు. వారిలో 14 మంది అమ్మాయిలు, 53 మంది అబ్బాయిలు. ఒకటో ర్యాంకు సాధించిన వారిలో నలుగురు ఏపీ విద్యార్థులున్నారు. రాజస్థాన్ నుంచి అత్యధికంగా 11 మంది విద్యార్థులున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈసారి 100లోపు ర్యాంకుల్లో కేవలం ఒకటి మాత్రమే దక్కింది. హైదరాబాద్ నుంచి పరీక్ష రాసిన అనురన్ ఘోష్ 77వ ర్యాంకు సాధించాడు. ఎన్టీఏ కేటగిరీల వారీగా టాప్ 10 ర్యాంకులను ప్రకటించింది. ఎస్టీ కేటగిరీలో తెలంగాణకు చెందిన గుగులోతు వెంకట నృపేష్ 167వ ర్యాంకు, లావుడ్య శ్రీరామ్ నాయక్ 453వ ర్యాంకు సాధించి దేశవ్యాప్తంగా తొలి రెండు స్థానాలు సాధించిన వారి జాబితాలో నిలిచారు.
తెలంగాణ నుంచి నీట్ యూజీ పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 60.84 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 79,813 మంది దరఖాస్తు చేసుకోగా.. 77,849 మంది పరీక్ష కు హాజరయ్యారు. వారిలో 47,371 మంది కనీస మార్కులు సాధించి ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పొందారు. గత నెల 5వ తేదీన నీట్ యూజీ జరిగింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!