సోమవారం నుంచి రెండు రోజులపాటు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఫ్రాన్స్లో పర్యటించనున్నారు. అక్కడి కీలక అధికారులతో ఆయన భేటీలో రాఫెల్ డీల్ ప్రధాన అజెండాగా ఉంటుందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఇద్దరు సైన్య అధికారుల మధ్య ఆధిపత్య పోరాటంతో సూడాన్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారం కోసం ఇద్దరు నేతలు చేస్తున్న పోరాటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. సూడాన్ లో సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య పోరు సాగుతూనే ఉంది. కాల్పులు, పేలుళ్ల మోతతో అనేక ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి.