Ajit Doval France Visit: నేడు ఫ్రాన్స్కు అజిత్ దోవల్.. రాఫెల్ డీల్ ప్రధాన అజెండా!
- రెండు రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటించినున్న అజిత్ దోవల్
- రాఫెల్ డీల్ ప్రధాన అజెండాగా టూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Doval France Visit: సోమవారం నుంచి రెండు రోజులపాటు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఫ్రాన్స్లో పర్యటించనున్నారు. అక్కడి కీలక అధికారులతో ఆయన భేటీలో రాఫెల్ డీల్ ప్రధాన అజెండాగా ఉంటుందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన చర్చల్లో రాఫెల్ డీల్కు సంబంధించిన తుది వివరణాత్మక ప్రతిపాదనను ఫ్రాన్స్ సమర్పించిన వెంటనే ఈ సమావేశం జరుగుతుందని వారు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి చర్చలను ముగించి, ఒప్పందాన్ని పూర్తి చేయాలని భారత్ వైపు ఆసక్తిగా ఉంది. ఒప్పందం కుదిరితే, డస్సాల్ట్ ఏవియేషన్కు చెందిన రాఫెల్ మెరైన్ జెట్లు ప్రస్తుతం మోహరించిన మిగ్-29లను భర్తీ చేస్తాయి.
Read Also: Israeli Strike: బీరుట్లో ఓ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. నలుగురు మృతి
Also Read
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థ శత్రుభీకర రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. ఈ సంస్థ నుంచి గతంలో 36 యుద్ధ విమానాలు కొనుగోలు చేసి వాయుసేనకు కేంద్ర ప్రభుత్వం అందజేసింది. ఇప్పుడు నావికాదళానికి కూడా ఈ యుద్ధవిమానాలను సమకూర్చాలనే ఆలోచనతో 26 యుద్ధ విమానాల కొనుగోలుకు కొంతకాలంగా చర్చలు జరుపుతోంది. సముద్ర యుద్ధాలకు అనువుగా ఈ 26 విమానాలను తయారు చేయాలని డసాల్ట్ ఏవియేషన్ను కోరింది రక్షణ శాఖ. సేకరణలో 22 సింగిల్-సీట్ రాఫెల్ మెరైన్ ఎయిర్క్రాఫ్ట్, నాలుగు ట్విన్-సీటర్ ట్రైనర్ వెర్షన్లు ఉన్నాయి. భారత నావికాదళం విమానాలు, జలాంతర్గాముల కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో, దాని అవసరాలను తీర్చవలసిన ఆవశ్యకత నేపథ్యంలో కొనుగోలు చర్చలు జరుగుతున్నాయి.
Read Also: Kolkata Doctor Case: కోల్కతా డాక్టర్ కేసు.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఇప్పటికే కొనుగోలుకు ఆమోదం తెలిపింది.ఇది భారత నౌకాదళ ఆయుధాగారానికి గణనీయమైన ప్రోత్సాహానికి మార్గం సుగమం చేసింది. భారతదేశం తన విమానాల తయారీ పరిశ్రమను అభివృద్ధి చేయాలనుకుంటున్నందున ప్రస్తుత క్రమంలో మేక్ ఇన్ ఇండియా అంశాలను మెరుగుపరచడం కోసం భారతదేశం, ఫ్రాన్స్ చర్చలు జరుపుతున్నాయి. 26 రాఫెల్ మెరైన్ జెట్ డీల్కు సంబంధించి భారత్కు ఫ్రాన్స్ తుది ధరను ప్రకటించింది. విశేషమేమిటంటే, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పర్యటనకు ముందు ఫ్రాన్స్ ఈ చర్య తీసుకుంది. ఈ ప్రాజెక్టుకు అత్యుత్తమమైన, చివరి ధరను ఫ్రెంచ్ వైపు నుండి భారత అధికారులకు అందించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. అలాగే, కఠినమైన చర్చల తర్వాత ప్రతిపాదిత ఒప్పందం ధరలో గణనీయమైన తగ్గింపు జరిగింది. 26 రాఫెల్ మెరైన్ జెట్లను కొనుగోలు చేసేందుకు భారత్, ఫ్రాన్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఆ మెరైన్ జెట్లను ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌక, వివిధ స్థావరాలపై మోహరిస్తారు. భారత్తో చర్చలను ఖరారు చేసేందుకు ఫ్రెంచ్ బృందం దేశ రాజధానిలో ఉన్నప్పుడు ఇరుపక్షాలు గత వారం కూడా చర్చలు జరిపాయి.
తాజావార్తలు
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
-
Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
-
Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!