Modi high-level meeting: సుడాన్లోని చిక్కుకున్న భారతీయులు.. భద్రతపై మోడీ కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇద్దరు సైన్య అధికారుల మధ్య ఆధిపత్య పోరాటంతో సూడాన్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారం కోసం ఇద్దరు నేతలు చేస్తున్న పోరాటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. సూడాన్ లో సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య పోరు సాగుతూనే ఉంది. కాల్పులు, పేలుళ్ల మోతతో అనేక ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. సూడాన్ లో చిక్కుకుపోయిన భారతీయులను ఆకస్మిక తరలించేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ప్రధాని మోడీ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుడాన్లో పరిస్థితి సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
Also Read:CM JaganMohan Reddy: ఈ స్టాంపింగ్ విధానంతో ప్రయోజనాలెన్నో!
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సూడాన్లో భారత రాయబారి రవీంద్ర ప్రసాద్ జైస్వాల్, పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ సూడాన్లో ఇటీవలి పరిణామాలను అంచనా వేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 3,000 మందికి పైగా భారతీయ పౌరుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రత్యక్ష నివేదికను పరిశీలించారు. గత వారం విబుల్లెట్తో ఒక భారతీయుడు మరణించడం పట్ల ప్రధాన మంత్రి సంతాపాన్ని వ్యక్తం చేశారు. అప్రమత్తంగా ఉండాలని, పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ, సూడాన్లోని భారతీయ పౌరుల భద్రతను నిరంతరం పర్యవేక్షించాలని ప్రధాని ఆదేశించారు. వారికి సాధ్యమైన అన్ని సహాయాలను అందించాలని ప్రధాని మోదీ అధికారులను సూచించారు.
Also Read:Seediri Appala Raju: మా రాష్ట్రం గురించి పక్క రాష్ట్రం వాళ్ళకి ఎందుకు?
Also Read
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
ఈరోజు తెల్లవారుజామున, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సూడాన్లో అధ్వాన్నమైన పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్తో చర్చించారు. సుడాన్లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందని ప్రభుత్వం చెబుతోంది. పారామిలిటరీ బలగాల మధ్య జరిగిన పోరులో 300 మందికి పైగా మరణించారు. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు దొరక్క, కటిక నేలపై నిద్రిస్తూ ఎప్పుడే తూటా తమ ప్రాణాల్ని హరిస్తుందో తెలీయని పరిస్థితుల్లో ప్రజలు భయం భయంగా బతుకుతున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, అప్రమత్తంగా ఉండాలని సూడాన్లోని భారతీయులకు భారత దౌత్య కార్యాలయం ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!