మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ క్రమంలో.. కేటీఆర్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతుంది. తన ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టును కోరుతూ కేటీఆర్ పిటిషన్ వేశారు.
BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
బిగ్బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్కు ఊరట లభించింది. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి, చంచల్ గూడా జైలుకు తరలించారు.. అయితే బెయిల్ కోసం అప్లై చేసుకున్న ప్రశాంత్ కు మొదట నిరాశ కలిగింది.. ఇప్పుడు ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.. అయితే ప్రశాంత్కు కోర్టు షరతుల తో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆదివారం పోలీసుల ముందు విచారణకు…
Pallavi Prashanth Bail Petition at Nampally Court: బిగ్ బాస్ విన్నర్ గా గెలిచి అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ అడ్వకేట్ తన వాదనలు వినిపించారు. అక్కడ జరిగిన గొడవకు పల్లవి ప్రశాంత్ కు ఎలాంటి సంబంధం లేదని, ఆ రోజు మధ్యాహ్నం 2 నుంచి అక్కడ జనాలు గుమిగూడి ఉన్నారని అన్నారు. పల్లవి ప్రశాంత్ బయటికి…
Jeevitha Rajasekhar : యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ జీవిత దంపతులకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ సాయిసుధ మంగళవారం సంచలన తీర్పు ఇచ్చారు.
TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ముగ్గురికి నిందుతులకు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. రేణుక,డి రమేష్, ప్రశాంత్ రెడ్డి లకు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు.
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటీషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు షర్మిలకు బెయిల్ మంజూరు చేసింది. కానీ కొన్ని షరతులను ఈ సందర్బంగా కోర్టు సూచించింది. రూ.30 వేలు, ఇద్దరు పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఇక షర్మిల విదేశాలకు వెళ్లాలనుకుంటే కోర్టు అనుమతి తప్పనిసరని తెలిపింది.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో వాదనలు పూర్తయ్యారు. తీర్పును లంచ్ తర్వాత కోర్టు ఇవ్వనుంది. పోలీసులతో దురుసుగా వ్యవహరించారన్న కేసులో ఆమెను సోమవారం అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణలో TSPSC పేపర్ లీకేజీ కేసు ఇప్పుడు హాట్ టాపిక్. పేపర్ లీకేజీ విషయంలో సిట్ నిందితుల నుంచి కూపీ లాగుతున్న తరుణంలో TSPSC కేసులో ఏ-3 నిందితురాలిగా వున్న రేణుక రాథోడ్ బెయిల్ పిటిషన్ చర్చకు దారితీసింది.