Nampally Court Judge: నాంపల్లి కోర్టు జడ్జి ఆత్మహత్య.. ఆమెతో చెప్పి మరీ బలవన్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nampally Court Judge: నాంపల్లి ఎక్సైజ్ ప్రత్యేక జేఎఫ్సీఎం న్యాయమూర్తి ఎ.మణికంఠ(36) భార్యతో గొడవలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని కుటుంబం బాగ్ అంబర్పేటలోని పోచమ్మబస్తీలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటోంది. మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్కు చెందిన లావణ్యతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి విశ్వనాథ్ (5) అనే కుమారుడు ఉన్నాడు. అంబర్ పేట ఇన్ స్పెక్టర్ అశోక్ కేసు నమోదు చేసుకున్నారు.
Read also: Astrology: మార్చి 25, సోమవారం దినఫలాలు
Also Read
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
మణికంఠ, అతని భార్య మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయని అంబర్ పేట ఇన్ స్పెక్టర్ అశోక్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం లావణ్య కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఇటీవల మణికంఠ తల్లికి ఆరోగ్యం బాగోకపోవడంతో ఆస్పత్రిలో చేరారు. మణికంఠ తండ్రి తన భార్యను చూసుకుంటూ ఆసుపత్రిలో ఉన్నాడు. ఓ వైపు తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించి ఆస్పత్రిలో ఉండగానే మరోవైపు భార్య కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లడంతో మనకంఠ మనోవేదనకు గురయ్యాడు. ఆదివారం భార్యకు ఫోన్ చేయగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మణికంఠ తాను బతకలేనని, ఆత్మహత్య చేసుకుంటానని భార్యకు ఫోన్లో చెప్పాడు.
Read also: RCB vs PBKS: నేడు ఆర్సీబీతో పంజాబ్ ఢీ..
అంతే క్షణికావేశానికి లోనైన మణికంఠ బెడ్ రూంలోకి వెళ్లి తలుపులు వేసి భార్య చున్నీతో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. ఆయన బయటకు రాకపోవడం, తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. తలుపులు పగలగొట్టి చూడగా మణికంఠ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మణికంఠ మృతదేహాన్ని ఉస్మానియాకి తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న తోటి న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉస్మానియా మార్చురీకి చేరుకుని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మణికంఠ మృతితో కుటుంబంలో విషాధం నెలకొంది.
EPFO : జనవరిలో ఈపీఎఫ్ఓలోకి ఎనిమిది లక్షలమంది కొత్త సభ్యులు
తాజావార్తలు
-
YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్ను కూకటివేళ్లతో పెకలిస్తా!
-
Toxic Effect: యశ్ ‘టాక్సిక్’ ఎఫెక్ట్.. శ్రద్ధా కపూర్ సినిమాకూ రిలీజ్ డేట్ మార్పు తప్పదా?
-
Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్… ఈరోజే ‘హైవానియత్’ టీజర్
-
SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత
-
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!