ఈ రోజు సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అరంగట పాటు జరిగిన ఈ భేటీలో ముఖ్యంగా నాగబాబుకు మంత్రి పదవి, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.. కాగా, నాగబాబుకి ఏపీ కేబినెట్లో చోటు దక్కనుంది అని ప్రకటించిన తర్వాత ఆయనకు ఏ శాఖను కేటాయిస్తారని సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా చర్చ సాగుతోంది..
సరిగ్గా పుష్ప రిలీజ్ ముందు నాగబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి గత కొద్దిరోజులుగా అల్లు కాంపౌండ్ మెగా కాంపౌండ్ మధ్య దూరం పెరిగింది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సరిగ్గా రిలీజ్ కి ముందు నాగబాబు ఒక ట్వీట్ చేశారు. 24 క్రాఫ్ట్ ల కష్టంతో, వందల మంది టెక్నీషన్ల శ్రమతో వేల మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే *సినిమా* ప్రతి సినిమా విజవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం……
సినీ నటుడు, జనసేన కీలక నేత కొణిదెల నాగబాబు.. రాజ్యసభకు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. బీజేపీ పెద్దలతో జనసేన రాజ్యసభ సీటుపై చర్చించారట. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు కేటాయించాలని కోరారట. అందుకు బీజేపీ పెద్దలు సముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటనే ఆలస్యం అని సమాచారం. ఏపీలో ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామా చేశారు.…
గత కొద్దిరోజులుగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా పేరు టాలీవుడ్లో మార్మోగిపోతోన్న విషయం తెలిసిందే. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నేడు ఉదయం బెంగళూరులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ ఎస్వోటీ పోలీసు బృందం అతడిని బెంగళూరు నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు. జానీ మాస్టర్ అరెస్టైన వేళ సినీ నటుడు నాగబాబు చేసిన…
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యదు వంశీ దర్శకుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 9న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర…
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఆసుపత్రి భవనం ఎక్కి యువకులు హల్ చల్ చేసిన తీరు జిల్లాలో సంచలనంగా మారింది. మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.
Nagababu Intresting Comments after Pawan Kalyan Take Charge: పవన్ను డిప్యూటీ సీఎంగా చూడటం ఆనందంగా ఉందన్నారు మెగా బ్రదర్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు. ఈరోజు విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన అన్ని విషయాల్లో సామర్థ్యం, అన్ని అంశాలపై అవగాహన కలిగిన వ్యక్తి పవన్ అని అన్నారు. పవన్ కి తగిన పదవులు, శాఖలు వచ్చాయని, సమర్ధత కలిగిన పవన్ కి ఈ పదవి దక్కిందని అన్నారు. ఇవన్నీ చూస్తుంటే మంచి…
మోడీ, అమిత్ షాపై సంచలన ఆరోపణలు మోడీ, అమిత్ షాపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. స్టాక్ మార్కెట్ల కుంభకోణానికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. స్టాక్ మార్కెట్ల స్కామ్పై జేపీసీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జూన్3న స్టాక్ మార్కెట్లు పెరుగుతాయని హోంమంత్రి చెప్పారని.. ఈ విషయం ఆయనకు ఎలా తెలుసని ప్రశ్నించారు. ఇది స్టాక్ మార్కెట్లో అత్యంత పెద్ద స్కామ్ అని చెప్పుకొచ్చారు.…