మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలవడం, బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆరోపణల నేపథ్యంలో… గద్వాల్ అడిషనల్ ఎస్పీపై వేటు వేసింది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్.. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని కలిసినట్లుగా అభియోగాల నేపథ్యంలో.. అడిషనల్ ఎస్పీ రాములు నాయక్పై వేటు వేసిన ఉన్నతాధికారులు.. రాములు నాయక్ని డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.. అయితే, ఈ నెల 1వ తేదీ నుండి సెలవులో…
ఆ ఒక్క సీటులో గెలిస్తే.. కొత్తగా ఏర్పడేది లేదు.. ఉన్న సర్కార్ కూలేది లేదు.. కానీ, తెలంగాణ మొత్తం ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక ఫలితం కోసం చూస్తోంది… ఇక ప్రజల ఆసక్తి తగ్గట్టుగానే రౌండ్ రౌండ్కి ఫలితాలు ఆసక్తిగా మారుతున్నాయి.. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. మునుగోడు గడ్డపై టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతుండగా… హోరా హోరీ పోరు సాగుతోంది.. చివరి వరకు విజయం తనదే అంటున్నారు బీజేపీ…
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో జాస్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి అధికార, ప్రతిపక్షాలు.. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్కే కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాల్ చేసి ఆగ్రహం వ్యక్తం చేయడంపై టీఆర్ఎస్ మండిపడుతోంది.. బీజేపీ నేతల తీరును తప్పుబడుతూనే.. అసలు ఫలితాల వెల్లడిలో ఎందుకు ఈ జాప్యం..? ముందు ఇచ్చే లీక్లు ఏంటి.. ఆ తర్వాత వచ్చే ఫలితాలు మరోలా ఉండడమేంటి? అని మంత్రి జగదీష్రెడ్డి అసహనం…
తెలంగాణలో ఉత్కంఠరేపుతోన్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో కాస్త జాప్యంపై అన్ని పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. అధికార టీఆర్ఎస్ పార్టీ ఓవైపు.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఇంకో వైపు మండిపడుతున్నాయి.. అయితే, మరో ముందడుగు వేసిన బీజేపీ నేతలు.. ఏకంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్కు ఫోన్ చేయడం వివాదాస్పదంగా అయ్యింది.. ఈసీకి ఫోన్ చేసి బీజేపీ నేతలు ఎందుకు ఒత్తిడి తెస్తారని అంటూనే.. ఫలితాలు త్వరితగతిన ఒత్తిడి లేకుండా విడుదల చేయాలని…
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం కొనసాగుతూనే ఉంది.. మధ్యాహ్నం 12 గంటలు కావస్తున్నా.. ఇప్పటి వరకు ఐదు రౌండ్లు ఫలితాలే వెల్లడి అయ్యాయి.. ఓవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదో చేస్తుందనే అనుమానాలు భారతీయ జనతా పార్టీ నేతలు వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు.. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జాప్యంపైన అధికార టీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.. రౌండ్లవారీగా ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెల్లడి ఆలస్యం అవడంపైన ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి…
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి.. రౌండ్ రౌండ్కి ఫలితాలు మారిపోతున్నాయి.. తొలిరౌండ్ నుంచి ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి… రెండో రౌండ్, మూడో రౌండ్, నాల్గో రౌండ్లో బీజేపీకి టీఆర్ఎస్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినా.. మొత్తంగా మాత్రం నాల్గో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్కు 613 ఓట్ల మెజార్టీ లభించింది.. అయితే.. చౌటుప్పల్లపై భారీగా ఆశలు పెట్టుకున్నారు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి… కానీ, రాజగోపాల్ రెడ్డి ఆశలను…