Uttar Pardesh: ఉత్తర్ ప్రదేశ్లో పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో ముక్తార్ అన్సారీ, సంజీవ్ జీవా ముఠాలతో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ వ్యక్తి, షార్ప్ షూటర్ షారూఖ్ పఠాన్ హతమయ్యాడు. అనేక హత్యల కేసుల్లో ఇతను వాంటెడ్గా ఉన్నాడు. బెయిల్ తర్వాత పరారీలో ఉన్నాడు. ఆదివారం ముజఫర్ నగర్లో ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF)తో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడని అధికారులు తెలిపారు.
Abbas Ansari: మాఫియా డాన్ ముఖ్తార్ అన్నారీ కుమారుడు అబ్బాస్ అన్సారీని ‘‘ద్వేషపూరిత ప్రసంగం’’ కేసులో కోర్టు దోషిగా తేల్చింది. ఉత్తర్ ప్రదేశ్ మౌ సదర్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్బాస్కి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పుతో ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం, అతడి ఎమ్మెల్యే పదవి రద్దు అవుతుంది. 2022లో అధికారులను బెదిరిస్తూ ఆయన ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ఇదే కేసులో ఆయన సోదరుడు మన్సార్ అన్సారీని కూడా దోషిగా తేల్చింది, ఇతడికి ఆరు…
Akhilesh Yadav: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తాన్ అన్సారీ ఇటీవల ఉత్తర్ ప్రదేశ్లోని బండా జైలులో గుండెపోటుకు గురై మరణించారు. ఆయన మృతికి ‘విషప్రయోగం’ కారణమని కుటుంబ సభ్యులతో పాటు అతని కొడుకు ఆరోపించారు.
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తా్ర్ అన్సారీ ఇటీవల జైలులో గుండెపోటుతో మరణించారు. అయితే, ఇతని మరణంపై కుటుంబ సభ్యులతో పాటు ఆయన కుమారుడు అనుమానం వ్యక్తం చేశారు.
Mukhtar Ansari: మాఫియా ముఖ్తార్ అన్సారీ మరణించిన ఐదు గంటల తర్వాత, బందా జైలు సీనియర్ సూపరింటెండెంట్ను హత్య చేస్తామని బెదిరించారు. ఈ కాల్ డెహ్రాడూన్ STD కోడ్తో కూడిన ల్యాండ్లైన్ నంబర్ నుండి చేయబడింది.
Mukhtar Ansari: గ్యాంగ్ స్టర్, పొలిటికల్ లీడర్ ముఖ్తార్ అన్సారీ జైలులో మరణించాడు. దాదాపుగా 60కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతడిని జైలులో స్పృహ తప్పిపోయిన స్థితిలో సిబ్బంది గుర్తించి, హుటాహుటిని బండలోని రాణి దుర్గావతి వైద్య కళాశాలకు తరలించగా, గురువారం రాత్రి మరణించాడు.
Mukhtar Ansari : ముఖ్తార్ అన్సారీ మరణం తర్వాత ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ జిల్లా ప్రస్తుతం పటిష్టంగా మారింది. ఘాజీపూర్లోని మహ్మదాబాద్ యూసుఫ్పూర్ పట్టణంలోని ప్రతి సందులో పోలీసులను మోహరించారు.
Mukhtar Ansari : ముఖ్తార్ అన్సారీ అంటే మౌ, ఘాజీపూర్తో సహా పూర్వాంచల్లో ఒకప్పుడు భయపడేవారు. నేరాల నుంచి రాజకీయాల వరకు అన్నింట్లో అతడి ఆధిపత్యమే ఇన్నాళ్లు కొనసాగింది.
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, పొలిటీషియన్ ముఖ్తార్ అన్సారీ నిన్న జైలులో గుండెపోటుతో మరణించాడు. ఉత్తర్ ప్రదేశ్కి చెందిన అన్సారీ ఒకానొక సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాడు. తనకు అడ్డొచ్చిన వాళ్లకు చావు భయాన్ని చూపాడు. అయితే, ఎప్పుడు యూపీలో యోగి ఆదిత్యనాథ్ పాలనా పగ్గాలు చేపట్టాడో అప్పటి నుంచి గ్యాంగ్స్టర్కు వణుకు మొదలైంది. తాజాగా అన్సారీ మరణంతో ఆయన వల్ల బాధింపడిన కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.