Home
Movie News
Movie News News
-
హోలీకి వస్తానంటున్న ‘బచ్చన్ పాండే’!
రెండు రోజుల క్రితం అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘బచ్చన్ పాండే’ మూవీ సెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఆ చేదు ఘటన నుండి వెంటనే బయటకు వచ్చిన ఈ చిత్ర బృందం ఇప్పుడీ సినిమాను హోలీ కానుకగా మార్చి 18న థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు తెలిపింది. మూవీ హీరో అక్షయ్ కుమార్ ఈ విషయాన్ని తెలియచేస్తూ, నయా పోస్టర్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. కరోనా కరణంగా… -
45 ఏళ్ళ ‘కురుక్షేత్రము’
ఎవరైనా హీరోలు స్టార్స్ అనిపించుకోవాలంటే బిగ్ స్టార్స్ తోనే పోటీ పడాలని ఓ సినిమా ఫార్ములా ఉంది. దానికి అనువుగా ఎంతోమంది సాగి, విజయం సాధించారు. అలా సాగిన వారిలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు కూడా ఉన్నారు. వీరు తమ సీనియర్ స్టార్స్ సినిమాలతో పోటీపడుతూ, సంక్రాంతికి తమ చిత్రాలను విడుదల చేసేవారు. అలా జనం నోళ్ళలో నానడానికి అవకాశం సంపాదించారు. తరువాత స్టార్స్ గా వెలిగారు. కృష్ణ వచ్చీ రాగానే హీరోగా సక్సెస్ చూశారు.… -
40 ఏళ్ళ ‘బంగారుభూమి’
హీరో కృష్ణ, డైరెక్టర్ పి.చంద్రశేఖర్ రెడ్డి కాంబినేషన్ లో పలు జనరంజకమైన చిత్రాలు తెరకెక్కాయి. వారిద్దరి కలయికలో రూపొందిన పల్లెసీమల నేపథ్యం ఉన్న సినిమాలు విజయాలు సాధించాయి. కృష్ణను సంక్రాంతి హీరోగా నిలిపిన ఘనత కూడా చంద్రశేఖర్ రెడ్డిదే! కృష్ణ హీరోగా పి.సి.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘పాడిపంటలు’ చిత్రం విజయం సాధించింది. అప్పటి నుంచీ ప్రతి సంక్రాంతికి కృష్ణ ఓ సినిమాను విడుదల చేస్తూ వచ్చారు. అలా కృష్ణ, పి.సి.రెడ్డి కాంబినేషన్ లో రూపొందిన ‘బంగారుభూమి’ కూడా… -
35 ఏళ్ళ నాటి ముచ్చట …ఒకే రోజు ఐదు చిత్రాల సందడి!
సంక్రాంతి సంబరాల్లో కొత్త సినిమాల సందడే వేరు. పొంగల్ కు కొత్తబట్టలు కట్టుకోవడం ఎంత ఆనందమిస్తుందో, కొత్త చిత్రాలు చూసి మురిసిపోవడంలోనూ అంతే ఆనందం చూస్తుంటారు జనం. దానిని దృష్టిలో పెట్టుకొనే టాప్ హీరోస్ అందరూ సంక్రాంతికి తమ చిత్రాలను జనం ముందు నిలపాలని తపిస్తూ ఉంటారు. 1987లో నాటి స్టార్ హీరోస్ కృష్ణ, శోభన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు తమ చిత్రాలను ఒకే రోజున అంటే జనవరి 14న విడుదల చేయడం విశేషం!… -
ఊగిసలాటలో చిత్రశుక్లా ‘ఉనికి’!
‘నాటకం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్ చిత్రా శుక్లా కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘ఉనికి’. రాజ్కుమార్ బాబీ దర్శకత్వంలో బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి దీనిని నిర్మించారు. తొలుత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఈ సినిమాను దర్శక నిర్మాతలు విడుదల చేయాలని భావించారు. అయితే సంక్రాంతి బరి నుండి పెద్ద చిత్రాలు ‘ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్’ తప్పుకోవడంతో ఆ సీజన్ ను ఉపయోగించుకోవాలనే ఆశతో సినిమా విడుదల తేదీని 15వ తేదీకి… -
సంక్రాంతికి సినీ సందడి దూరం!
సంక్రాంతికి కొత్త సినిమాలు సందడి చేస్తాయని తెలుగు ప్రేక్షకులు ఆశించారు. కానీ కరోనా ఆ అవకాశం ఇవ్వలేదు. ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్ విడుదల వాయిదా పడింది. ఇక, థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ ఇండస్ట్రీకి మరో దెబ్బ. ఇబ్బందనిపిస్తే విడుదల వాయిదా వేసుకోవచ్చని మంత్రి గారే స్వయంగా సెలవిచ్చారు. టికెట్ల ధరలపై దర్శకుడు ఆర్జీవీతో సమావేశం తరువాత మంత్రి పేర్ని నాని ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, టికెట్ల ధరల వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన కమిటీ… -
బహుముఖ ప్రజ్ఞతో రాణించిన బి.జయ
అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేసి విజయాలను అందుకోవడం కొందరికే సాధ్యమవుతుంది. ఏదో ఒకరోజున తాను సినిమాకు దర్శకత్వం వహిస్తానని ముందుగానే చెప్పి, మరీ దర్శకురాలిగా మారారు బి.జయ. అసలే పురుషాధిక్య ప్రపంచంలో అందునా సినిమా రంగంలో ఎలా రాణిస్తావు? అని ఎందరో ఆమెను ప్రశ్నించిన వారున్నారు. వారందరికీ మెగాఫోన్ పట్టి సమాధానం చెప్పారామె. తెలుగు చిత్రసీమలో దర్శకత్వంలో రాణించే మహిళలు అరుదు. అలాంటి పరిస్థితుల్లో దర్శకురాలిగా తనదైన బాణీ పలికించి భళా అనిపించారు జయ. కలిదిండి… -
ఇరవై ఏళ్ళ ‘సీమ సింహం’
‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ చిత్రాల ఘనవిజయంతో నందమూరి బాలకృష్ణ ‘నటసింహం’గా అభిమానులకు ఆనందం పంచారు. ఆ రెండు చిత్రాలు ‘ఇండస్ట్రీ హిట్స్’ గా నిలవడమే కాదు, అనేక రికార్డులు నెలకొల్పాయి. వాటిలో ‘సమరసింహారెడ్డి’కి కో-డైరెక్టర్ గా పనిచేసిన గొట్టిముక్కల రామ్ ప్రసాద్ తరువాత బాలకృష్ణ సినిమాతోనే దర్శకుడు కావాలని ఆశించారు. అయితే తొలుత ‘చిరునవ్వుతో’ సినిమాతో మెగాఫోన్ పట్టి, ఆ పై బాలకృష్ణ హీరోగా ‘సీమసింహం’ తెరకెక్కించారు రామ్ ప్రసాద్. 2002 జనవరి 11న ‘సీమసింహం’ జనం ముందు… -
65 ఏళ్ళ ‘తోడికోడళ్ళు’
తెలుగు చలనచిత్రసీమలో మరపురాని చిత్రాలను అందించిన అరుదైన సంస్థల్లో ‘అన్నపూర్ణ పిక్చర్స్’ స్థానం ప్రత్యేకమైనది. తమ తొలి చిత్రం ‘దొంగరాముడు’తోనే ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించిన ‘అన్నపూర్ణ’ సంస్థ నిర్మించిన రెండవ సినిమా ‘తోడికోడళ్ళు’. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు. అక్కినేనితో ఆదుర్తి తెరకెక్కించిన తొలి చిత్రమిదే. ఈ సినిమా ఘనవిజయం తరువాత ఏయన్నార్, ఆదుర్తి కాంబినేషన్ లో అనేక జనరంజక చిత్రాలు రూపొందాయి. 1957 జనవరి… -
ప్రభాస్… హాలీవుడ్ హీరో అనిపించుకుంటాడా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు కమిట్ అయ్యాడు. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే కావటం విశేషం. ప్రభాస్ తరహాలో ఏ భారతీయ హీరో ఇలా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేయలేదు. ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ విడుదలకు రెడీగా ఉంది. ఇక ‘సలార్’, ‘ఆదిపురుష్’ సెట్స్ మీద ఉన్నాయి. ఇవి కాక అశ్వనీదత్ బ్యానరులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’ కూడా షూటింగ్ జరుపుకుంటోంది. ఇవి కాకుండా ‘స్పిరిట్’ సినిమా కమిట్…
తాజావార్తలు
-
Trump US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన.. నేడే గుడ్ న్యూస్?
-
Astrology: చిన్న విషయాన్నీ ఎక్కువగా ఆలోచించే 4 రాశులవారు.. మీలో కూడా ఈ లక్షణం ఉందా?
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!