బుధవారం జరిగిన మోడీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక ప్రకటనలు చేశారు. ఒకవైపు కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు కానుకగా ఇస్తూనే మరోవైపు రైతులకు కూడా ప్రభుత్వం భారీ దీపావళి కానుకగా ఇచ్చింది.
024 లోక్సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కేబినేట్ భేటీతో పాటు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మొదటి సమావేశం నేడు సాయంత్రం 5 గంటలకు దేశ రాజధానిలో జరగనుంది. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రధాన ఆర్థిక విధానాలు, కార్యక్రమాలను ప్రస్తావించి, వచ్చే నెలలో ప్రభుత్వం యొక్క పూర్తి బడ్జెట్ 2024-25 ప్రకటనకు వేదికను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
Naseeruddin Shah: సీనియర్ సినీనటుడు నసీరుద్ధీన్ షా ప్రధాని నరేంద్రమోడీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో గెలిచి మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఆయన ఓ మీడియాతో మాట్లాడారు. మోడీ మంత్రివర్గంలో ముస్లిం ప్రతినిధి లేకపోవడం బాధాకరమని అన్నారు. భారతీయ ముస్లింలను తాను ద్వేషించనని చెప్పడానికి మోడీ తన తలపై ముస్లింటోపీ ధరించడాన్ని చూడాలనుకుంటున్నానని ఇంటర్వ్యూలో చెప్పారు.
భారత దేశ ప్రధాన మంత్రిగా వరుసగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ రైతుల సంక్షేమమే లక్ష్యంగా తొలి సంతకం చేశారు. ఇక, పదవీ బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా మోడీ తొలి ఫైల్పై సంతకం చేసి.. కోట్లాది మంది రైతులకు అద్భుతమైన కానుక అందించారు. 17వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని రైతుల ఖాతాలకు పంపే ఫైలుపై మోడీ సంతకం చేశారు.
ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రధాని నేతృత్వంలో కొత్త కేంద్ర మంత్రి వర్గం సమావేశం కాబోతుంది. ఈ భేటీలోనే కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపుపై ఓ క్లారిటీ రానుంది.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీలో సంస్థాగత స్థాయి మార్పుల ప్రక్రియ ప్రారంభం కానుంది. కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక పెండింగ్లో ఉంది. ఇప్పుడు జేపీ నడ్డా ప్రభుత్వంలో చేరిన తర్వాత.. పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడు వస్తారనే విషయం మరింత స్పష్టమైంది. అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం జనవరిలో పూర్తి కావడంతో లోక్సభ ఎన్నికల వరకు పొడిగించారు.
కేంద్ర మంత్రి పదవి లభించడం పట్ల బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఈరోజు చాలా ఆనందంగా ఉందని.. తనపై నమ్మకం ఉంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, జాతీయ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కేంద్ర కేబినెట్లో చోటు దక్కినందుకు హర్షం వ్యక్తం చేశారు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు. కాసేపట్లో కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయనున్న తరుణంలో ఆయన సోషల్ మీడియాలో తన సందేశాన్ని విడుదల చేశారు. ఈ ఆనందానికి కారణమైన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మను కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన భావోద్వేగానికి గురై... సోము వీర్రాజు కాళ్లకు మొక్కి.. ఆలింగనం చేసుకున్నారు.