Naseeruddin Shah: ప్రధాని మోడీ ఏదో రోజు ముస్లిం టోపు ధరించడాన్ని చూడాలనుకుంటున్నా..
- ప్రధాని మోడీపై నసీరుద్దీన్ షా కీలక వ్యాఖ్యలు..
- మోడీ ముస్లిం టోపీ ధరించడం చూడాలి..
- ముస్లిం సమాజం విద్యపై దృష్టి పెట్టాలి..
- కేబినెట్లో ముస్లిం ప్రాతినిధ్యం లేకపోవడంపై కామెంట్స్..
Naseeruddin Shah: సీనియర్ సినీనటుడు నసీరుద్ధీన్ షా ప్రధాని నరేంద్రమోడీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో గెలిచి మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఆయన ఓ మీడియాతో మాట్లాడారు. మోడీ మంత్రివర్గంలో ముస్లిం ప్రతినిధి లేకపోవడం బాధాకరమని అన్నారు. భారతీయ ముస్లింలను తాను ద్వేషించనని చెప్పడానికి మోడీ తన తలపై ముస్లింటోపీ ధరించడాన్ని చూడాలనుకుంటున్నానని ఇంటర్వ్యూలో చెప్పారు.
Read Also: Kuwait fire: 49కి చేరిన మృతుల సంఖ్య.. మరో 40 మంది ఆస్పత్రిలో చికిత్స
Also Read
భారతదేశ చరిత్రలో తొలిసారిగా కేబినెట్లో ముస్లింలకు ప్రాతినిధ్యం లేకపోవడం నిరాశపరిచిందని, అయితే, ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదని, దేశంలో ముస్లింలను ద్వేషించడం ఆనవాయితీగా మారిందని అన్నారు. దేశంలోని ముస్లింలలో ఆందోళన పెరిగిందని మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అన్నారని చెప్పారు. ఇది ప్రాతినిధ్యాన్ని పొందే విషయమని, ఇది హిందువులు లేదా ముస్లింలు ఒంటరిగా చేయాల్సిన పనికాదని, మనం కలిసి చేయాల్సిన పని అని నసీరుద్ధీన్ షా అన్నారు.
ప్రధాని మోడీ ముస్లిం టోపీని ధరించాలని తాను కోరకుంటున్నానని, ఈ టోపీ ధరించడం ఒక సందేశం అవుతుందని చెప్పారు. 2011లో ఓ కార్యక్రమంలో మౌలావిలు మోడీకి టోపీ అందించినప్పుడు అతను దానిని ధరించడానికి నిరాకరించాడని, ఆ జ్ఞాపకాన్ని చెరిపివేయడం కష్టమని చెప్పారు. అయితే, మోడీ టోపీని ధరిస్తే, నేను ఒకే దేశపు పౌరులను ద్వేషించనని చెప్పినట్లు అవుతుందని అన్నారు. ముస్లిం సమాజం విద్యతో సమా ముఖ్యమైన సమస్యలకు బదులుగా ఇతర అంశాలపై దృష్టిపెట్దిందని నసీరుద్దీన్ షా అన్నారు. మదరసా, హిజాబ్, సానియా మీర్జా స్కర్టు పొడవుకు బదులుగా సమాజంలో విద్య, ఆధునిక ఆలోచనలపై దృష్టి పెట్టాలని చెప్పారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో