MK Stalin: ఇజ్రాయిల్ మారణహోమం సృష్టిస్తోంది.. గాజా అనుకూల నిరసనల్లో స్టాలిన్..
- గాజా అనుకూల నిరసనల్లో పాల్గొన్న ఎంకే స్టాలిన్..
- ఇజ్రాయిల్ మారణహోమానికి పాల్పడుతోందని విమర్శలు..
- కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MK Stalin: గాజాపై ఇజ్రాయిల్ దాడులు ఆపేలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, తక్షణ కాల్పుల విరమణకు పిలుపునివ్వాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన గాజా అనుకూల నిరసనల్లో ఆయన పాల్గొన్నారు. ఇజ్రాయిల్ విచక్షణారహిత దాడుల్ని సీఎం ఖండించారు. గాజాకు శాంతి, మానవతా సాయం అందించే ప్రయత్నాలు ప్రారంభించాలని కేంద్రాన్ని కోరుతూ అక్టోబర్ 14న తమిళనాడు అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇది తమిళ ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తుందని చెప్పారు.
Read Also: Payal Gosh : తొమ్మిదేళ్లు శృంగారానికి దూరంగా ఉన్నా.. హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
గాజాపై ఇజ్రాయిల్ మారణహోమం ముగియాలని, రాజకీయాల కోసం ఈ నిరసనల్లో పాల్గొనలేదని, మానవత్వం కోసం పాల్గొన్నామని స్టాలిన్ అన్నారు. గాజాలో ఇజ్రాయిల్ దాడుల్ని ఖండిస్తూనే, పాలస్తీనియన్లకు మానవ హక్కుల మద్దతు ఉంటుందని చెప్పారు. గతేడాది గాజాలో 50,000 మంది మరణించారని, ఇందులో 26 వేల మంది పిల్లలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇజ్రాయిల్ ప్రపంచ చట్టాలను ఉల్లంఘిస్తుందని ఆరోపించారు.
అయితే, 2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముస్లిం వర్గాన్ని ఆకర్షించడానికి సీఎం ప్రయత్నిస్తున్నారనే విమర్శల్ని డీఎంకే తోసిపుచ్చింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ.. డీఎంకే ఎల్లప్పుడు అణిచివేతకు వ్యతిరేకంగా పనిచేస్తుందని, అది శ్రీలంక తమిళ కోసం అయినా, పాలస్తీనా కోసమైనా అని అన్నారు. మరోవైపు మిత్రపక్షాలైన కాంగ్రెస్ వంటి పార్టీల నుంచి కూడా సీఎంకు మద్దతు వచ్చింది. కాంగ్రెస్ ఎల్లప్పుడు పాలస్తీనాకు సపోర్ట్గా నిలబడిందని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ కే. సెల్వపెరుంతగై అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..