ఆస్ట్రేలియా ఇండియా ఇన్స్టిట్యూట్ సీఈఓ లిసా సింగ్ తెలంగాణ మంత్రి కె.తారకరామారావుతో ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ మరియు ఆస్ట్రేలియా లోని వ్యాపార వాణిజ్య వర్గాల సంబంధాలను బలోపేతం పైన ఇరువురు చర్చించారు. భారతదేశంలో అత్యంత వేగంగా వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న రాష్ర్టాలలో తెలంగాణ ఒకటని తెలంగాణతో ఆస్ట్రేలియాలో ఉన్న వివిధ రంగాలతో వాణిజ్య సంబంధాల బలోపేతానికి తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రం…
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం తెస్తున్న పథకాలను మోడీ సర్కార్ కాపీ కొడుతోందని, దళిత బంధుని కూడా కాపీ కొడతారేమోనన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన దళిత బంధు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.5 65 ఏళ్ళలో కాని పనులు ఎన్నో ఆరు ఏళ్ళలో చేసుకున్నాం అన్నారు. రైతులకు పెట్టుబడి సాయంతో పాటు రైతు చనిపోతే వారి కుటుంబాలకు రైతు బీమా ఇస్తూ అండగా…
అందరికీ బీఆర్ అంబేద్కర్ 131 జయంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కేటీఆర్. బలహీనవర్గాల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందన్నారు. బలహీనవర్గాల కోసం బలంగా నిలబడే వ్యక్తి కేసీఆర్ ఒక్కరే అన్నారు. ప్రపంచంలోనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైద్రాబాద్ లో పెట్టబోతున్నామన్నారు. భారత దేశంలో ఎవరూ చేయని విధంగా దళితుల కోసం లో టీ- ప్రైడ్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిదీ. ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.…
1. నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. అలాగే సాయంత్రం వరిధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. 2. ఏపీఎస్ఆర్టీసీ బస్సు టికెట్ల ధరలను పెంచింది. అయితే పెరిగిన బస్సు చార్జీలు నేటి నుంచి అమలు కానున్నాయి. డీజిల్ సెస్, సెఫ్టీ సెస్, రౌండ్ ఆఫ్ చార్జీలతో కలిసి కనిష్ఠ ధర రూ.10 పెరిగే అవకాశం ఉంది. 3. నేడు ముంబాయి…
న్యూయార్క్ స్టాక్ ఎక్చైంజ్(NYSE) లిస్టెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఫిస్కర్ ఇంక్ తన భారత ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది. ఇది సాఫ్ట్వేర్ మరియు వర్చువల్ వెహికల్ డెవలప్మెంట్ సపోర్ట్ ఫంక్షన్లపై దృష్టి సారిస్తుంది. కాలిఫోర్నియాకు చెందిన ఈవీ తయారీ సంస్థ ఇప్పటికే నియామక ప్రక్రియను ప్రారంభించిందని, దీంతో భారతదేశంలో 200 మందికి ఉద్యోగాలు లభించనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ప్రపంచ సంస్థలను ఆకర్షించేందుకు పరిశ్రమలు మరియు ఐటి శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని…
ఈ ఏడాది డిసెంబర్కి హైదరాబాద్లో 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం పనులు పూర్తి అవుతాయని తెలిపారు తెలంగాణ మంత్రి కేటీఆర్… ట్యాంక్ బండ్ దగ్గర నిర్మిస్తున్న 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహ పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరి రక్షణ కోసం పాటు పడే వారికి అంబేద్కర్ ఆదర్శం అన్నారు.. ప్రపంచంలో అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం హైదరాబాద్లో నిర్మాణం అవుతుంది.. ఎనిమిది…
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై మరోసారి సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఓవైపు పెరిగిపోతున్న పెట్రో ధరలు.. మరోవైపు హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలపై వ్యంగాస్త్రాలు విసిరారు.. ప్రధాని మోడీ నాయకత్వంలో ప్రపంచంలో పెట్రోలు, డీజిల్ ధరల్లో దేశం అగ్రస్థానంలోకి దూసుకెళ్లిందంటూ ఎద్దేవా చేసిన ఆయన.. కొనుగోలు శక్తి సమానత్వం అంచనా ఆధారంగా ప్రపంచంలో భారత్లో ఎల్పీజీ ధరలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు.. ఇక, పెట్రోలు…
తెలంగాణ పర్యటనకు వచ్చిన మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా.. ఇవాళ మంత్రి కేటీఆర్ను కలిశారు.. ఉదయం ప్రగతి భవన్కు వచ్చిన సంగ్మా దంపతులను.. మంత్రి కేటీఆర్, ఆయన సతీమణి శైలిమ శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.. ఇక, వివిధ అంశాలపై కేటీఆర్, సంగ్మా మధ్య చర్చలు జరిగాయి.. మేఘాలయ, తెలంగాణ రాష్ట్రాల మధ్య సంబంధాలు, వ్యాపారాలపై ఐటీ మంత్రి చర్చించినట్లు సమాచారం. ఇక, ఈ సమావేశం విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్…
ధాన్యం కొనుగోళ్ల అంశం పై ఢిల్లీలో పోరాటానికి సిద్ధమవుతోంది టీఆర్ఎస్ పార్టీ. వరిపోరును ఉధృతం చేసింది టీఆర్ఎస్ పార్టీ. వరుస ఆందోళనలతో హీట్ పుట్టిస్తున్న గులాబీ పార్టీ నేతలు గురువారం తెలంగాణలోని అన్ని జిల్లాకేంద్రాల్లో దీక్షలు చేపట్టింది. టీఆర్ఎస్ దీక్షలతో జిల్లా కేంద్రాలన్నీ హోరెత్తాయి. దీక్షలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రైతుబంధు సమితి ఛైర్మన్లు సహా ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. సిరిసిల్లలోని అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన నిరసన దీక్షలో మంత్రి కేటీఆర్…
తెలంగాణ ప్రభుత్వం తీరుపై గవర్నర్ తమిళిసై ఆరోపణలు చేశారు. తనను ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తున్నారని.. తన విషయంలో ఏం జరుగుతోందో మీడియాకు, ప్రజలకు తెలుసునని ఆమె వ్యాఖ్యానించారు. గవర్నర్ను గౌరవించకున్నా.. కనీసం రాజ్భవన్ను గౌరవించాల్సి బాధత్య ఉందని ఆమె అన్నారు. అంతేకాకుండా సోదరిగా భావిస్తే ఇలా అవమానిస్తారా అని ఆమె ప్రశ్నించారు. గతంలో బీజేపీకి చెందినా ఇప్పుడు గవర్నర్ స్థాయిలో ఉన్నానని ఆమె అన్నారు. ఆమె వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. గవర్నర్ తో మాకు పంచాయితీ ఏమి…