KTR: ఆస్ట్రేలియా ఇండియా ఇనిస్టిట్యూట్ సీఈవోతో భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా ఇండియా ఇన్స్టిట్యూట్ సీఈఓ లిసా సింగ్ తెలంగాణ మంత్రి కె.తారకరామారావుతో ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ మరియు ఆస్ట్రేలియా లోని వ్యాపార వాణిజ్య వర్గాల సంబంధాలను బలోపేతం పైన ఇరువురు చర్చించారు. భారతదేశంలో అత్యంత వేగంగా వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న రాష్ర్టాలలో తెలంగాణ ఒకటని తెలంగాణతో ఆస్ట్రేలియాలో ఉన్న వివిధ రంగాలతో వాణిజ్య సంబంధాల బలోపేతానికి తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా ఐటి, లైఫ్ సైన్సెస్, రెన్యువల్ ఎనర్జీ వంటి రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయని, వీటిలో ఆస్ట్రేలియా లో ఉన్న పలు కంపెనీలు తెలంగాణ లోని పెట్టుబడుల పైన ఆశావహంగా ఉన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ కి ఆమె తెలిపారు.
భారత్ ఆస్ట్రేలియాల మధ్య వ్యాపార వాణిజ్యలకు సంబంధించి అనేక నూతన ఒప్పందాలపై చర్చ నడుస్తున్న సందర్భంగా, త్వరలోనే ఒక ప్రతినిధి బృందం ఇక్కడి పెట్టుబడి అవకాశాలు పైన పరిశీలన చేసేందుకు భారతదేశంలో పర్యటించనున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. తాము ఇప్పటికే తెలంగాణలోని పలు విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలతో కలిసి పని చేస్తున్న విషయాన్ని తెలిపిన లిసా సింగ్ వి హబ్ తమ భాగస్వామి అని వివరించారు.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
Also Read:Pudding and Mink Pub: ముగిసిన తొలిరోజు ఆ ఇద్దరి కస్టడీ విచారణ
తెలంగాణ మరియు ఆస్ట్రేలియా దేశాల మధ్య పెట్టుబడులకు సంబంధించి అనేక అవకాశాలు ఉన్నాయని ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆయా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సంసిద్ధంగా ఉన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ లిసా సింగ్ కి తెలిపారు. భారతదేశంలోని విధి విధానాల రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వానికి కొంత ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఆచరణ అంతా రాష్ట్రాల్లోనే ఉంటుందని, ఇలాంటి నేపథ్యంలో ప్రగతిశీల తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ఆస్ట్రేలియాలోని పారిశ్రామిక వర్గాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!