మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు ఒక అద్భుతమైన వీడియోను విడుదల చేసి మెగా అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. రామ్ చరణ్ సోషల్ మీడియాలోకి “గాడ్ ఫాదర్” షూటింగ్లో బిజీగా ఉన్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి “భీమ్లా నాయక్” సెట్ను సందర్శించి, తన సోదరుడు, నటుడు పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” బృందంతో గడిపిన ఆనందకరమైన క్షణాలను పంచుకున్న…
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ “పుష్ప” చిత్రంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిలో పడ్డాడు. ‘పుష్ప’రాజ్ హిందీలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. బాలీవుడ్ నుంచి కూడా సుకుమార్ కు ఆఫర్లు వస్తున్నాయి. సుకుమార్ అల్లు అర్జున్తో “పుష్ప: ది రూల్” కోసం సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ స్టార్ డైరెక్టర్ మెగా ఫోన్ పట్టబోతున్నాడు. ఈ విషయాన్ని సుకుమార్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవికి ఈ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సినిమాలను లైన్లో పెట్టడమే కాదు షూటింగ్ కూడా అంతే వేగంగా పూర్తి చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం మెగాస్టార్ నటించిన “ఆచార్య” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఆ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్”, మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్” సినిమాలు చేస్తున్నారు. ఈ మూవీస్ ఇంకా చిత్రీకరణ దశలో ఉండగానే ఇటీవల వెంకీ కుడుములకు…
కొణిదెల శివశంకర్ వరప్రసాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవిగా మారేందుకు మధ్యలో ఆయన పడిన కష్టం అంతాఇంతా కాదు. ఒక విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిరు అంచలంచెలుగా ఎదిగిన తీరు ఎందరికో ఇన్స్పిరేషన్. ఇప్పుడున్న సమాజంలో ఒక వ్యక్తికి పిల్లను ఇవ్వాలంటే అటెడెన్ట్ సంపాదిస్తున్నాడు.. ఎంత ఆస్తి ఉంది అని చూస్తున్నారు అమ్మాయి తల్లిదండ్రులు.. కానీ అల్లు రామలింగయ్య మాత్రం చిరుకు ఆస్తి ఉందా.. అంతస్థు ఉందా అని చూడలేదంట.. అతనిలో ఉన్న పట్టుదలను, కష్టపడే…
మెగాస్టార్ చిరంజీవి 42వ మ్యారేజ్ యానివర్సరీ నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా చిరంజీవి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఇటీవల కేవలం ఒక్కరోజులో పలు ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించి వార్తల్లో నిలిచిన మెగాస్టార్ ఇప్పుడు వెకేషన్ కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా హైదరాబాద్ లో సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించి, శబరిమలకి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాడు. అనంతరం గురువాయూర్లోని శ్రీకృష్ణుని ఆలయాన్ని సందర్శించారు.…
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ఏప్రిల్ 29న విడుదల కాబోతోంది. అయితే దీనిని హిందీలోనూ డబ్ చేసి అదే రోజున విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని హిందీలో సినిమాను పంపిణీ చేయబోతున్న పెన్ స్టూడియోస్ సంస్థ తెలిపింది. ఈ సంస్థ సినిమాలు ఇప్పుడు వరుసగా విడుదల కాబోతున్నాయి. గత శుక్రవారం తెలుగు ‘ఖిలాడీ’ని…
మెగాస్టార్ చిరంజీవి శబరిమల దర్శనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం భార్య సురేఖతో కలిసి శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన అభిమానులతో పంచుకున్నారు. “చాలా సంవత్సరాల తర్వాత శబరిమల దర్శనం చేసుకోవడం జరిగింది అని, అయితే భక్తుల రద్దీ, అభిమానుల తాకిడి కారణం గా, అందరినీ అసౌకర్యం కి గురి చేయకుండా, డోలి లో వెళ్ళవలసి వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. ఆ స్వామి పుణ్య దర్శనానికి భక్తుల కోసం తమ శ్రమ ధార…
గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టాలీవుడ్ కి మధ్య టిక్కెట్ రేట్స్ ఇష్యూ నడుస్తున్న విషయం తెల్సిందే,. ఇండస్ట్రీ బిడ్డగా ఈ సమస్యను నెత్తిమీద వేసుకున్న మెగాస్టార్ పరిష్కార మార్గం కోసం ఏపీ సీఎం జగన్ ని భేటీ అయ్యి సమస్యలపై చర్చించారు. ఇక నేడు ఇండస్ట్రీ పెద్దలతో కలిసి మరోసారి భేటీ అయ్యారు. సమస్యలను వివరించాం.. పరిష్కారం త్వరలోనే దొరుకుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ భేటీకి మంచు ఫ్యామిలీ హాజరు…
ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి పూనుకున్న హీరోలందరికీ ప్రముఖ నిర్మాత కె. ఎస్. రామారావు అభినందనలు తెలిపారు. గురువారం సినిమా రంగానికి చెందిన అగ్ర కథానాయకులు, దర్శక నిర్మాతలు ఏపీ సీఎం జగన్ ను కలిసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఓ పరిష్కారం కనుగొనడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుండి ఏపీకి ప్రత్యేకంగా వెళ్ళి ప్రాక్టికల్ ముఖ్యమంత్రి అనిపించుకున్న జగన్ మోహన్ రెడ్డిని కలిసి, చిరకాల సమస్యలకు ఫుల్…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యంమత్రి సీఎం జగన్ తో సినీ ఇండస్ట్రీ పెద్దల భేటీ ముగిసింది. ఈరోజు ఉదయం జరిగిన ఈ భేటీలో మెగాస్టార్ చిరంజీవితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్స్ రాజమౌళి, కొరటాల శివ, కమెడియన్ ఆలీ, నటుడు ఆర్ నారాయణ మూర్తి పాల్గొన్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను సీఎం కి తెలిపి ఒక పరిష్కారాన్ని కోరారు. ఇక భేటీ అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ” ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు..…