సర్కారు వారి పాట సినిమా విడుదలైన తర్వాత సూపర్స్టార్ మహేష్ బాబు వెకేషన్కు వెళ్లాడు. ఈ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి విదేశీ టూర్లో ఆనందంగా గడుపుతున్నాడు. గత కొన్ని రోజులుగా మహేష్ బాబు విదేశీ టూర్కు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా అమెరికా పర్యటనలో న్యూయార్క్ నగరంలో సాఫ్ట్వేర్ దిగ్గజం బిల్గేట్స్ను మహేష్ బాబు ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోను…
హైదరాబాద్ ప్రతిష్ట పెంచేలా.. నగరం సిగలో మరో కలికితురాయి చేరబోతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి ‘టీ హబ్’ ను ఈ నెల 28న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘ భవిష్యత్తును అంచనా వేయడానికి ఉత్తమ మార్గం దానిని సృష్టించడం’’ అనే అబ్రహం లింకన్ వ్యాఖ్యలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు కేటీఆర్. హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ కు పెద్ద పీట వేస్తూ టీహబ్ కొత్త…
‘సర్కారు వారి పాట’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తన తదుపరి సినిమాల్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో SSMB28 సినిమా చేస్తోన్న మహేశ్, ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో సెట్స్ మీదకి వెళ్లనున్నాడు. ఈ సినిమాకి ఆయన రెండేళ్ల బల్క్ డేట్స్ కూడా ఇచ్చేశాడు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాదిలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. దీని తదనంతరం తన 30వ ప్రాజెక్ట్…
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఇటీవలే సర్కారువారి పాట చిత్రంతో విజయం అందుకున్న మహేష్ వెంటనే త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కించాడు.
దర్శక ధీరుడు రాజమౌళి.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ తర్వాత కొన్ని రోజులు వెకేషన్ ఎంజాయ్ చేసిన రాజమౌళి.. ప్రస్తుతం తన తండ్రి విజయేంద్ర ప్రసాద్తో కలిసి మహేష్ సినిమా స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నారు. ఇలాంటి టైంలో ఓ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ కోసం వచ్చారు జక్కన్న. రెజీనా, నివేదిత ప్రధాన పాత్రల్లో నటించిన ‘అన్యాస్ ట్యుటోరియల్’ వెబ్ సిరీస్ జూలై…
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. మే 12న వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఈ సినిమాను మహేష్ బాబు అభిమానులు బాగా ఆదరించారు. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత వినోదం, సెకండ్ హాఫ్లో లేదని సగటు సినిమా ప్రేక్షకుడు పెదవి విరిచినా, కలెక్షన్లను మాత్రం ఈ సినిమా బాగానే రాబట్టింది. దానికి తోడు సినిమా విడుదలైన అంతకు ముందు చిత్రీకరించిన మరో పాటను జత…
యంగ్ హీరో అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 3 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమాకు ఫిదా అయ్యారు అంటే అతిశయోక్తి కాదు.. నిన్నటికి నిన్న ఈ సినిమాపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ప్రశంసలు వర్షం కురిపించిన…
దర్శకధీరుడు రాజమౌళి సినిమాల్లో భారీతనం ఎంతుంటుందో అందరికీ తెలుసు. నటీనటులు సైతం ప్రముఖులే ఉంటారు. చిన్న చిన్న పాత్రలకు కూడా ఆయన హేమాహేమీల్ని రంగంలోకి దింపుతాడు. అలాంటప్పుడు హీరోయిన్ విషయంలో ఇంకెంత కేర్ తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాలా? ఫలానా పాత్రకు సరిగ్గా సూటవుతుందా? లేదా? అని ఒకటికి పదిసార్లు లెక్కలేసుకొని.. స్టార్ హీరోయిన్లను రంగంలోకి దింపుతాడు. ఒకవేళ నిడివి చిన్నదైనా సరే, స్టార్లనే తీసుకుంటాడు. ఇప్పుడు మహేశ్ బాబు సినిమా విషయంలోనూ ఆ స్ట్రాటజీలనే జక్కన్న అనుసరిస్తున్నాడని…
ఎమ్ఎస్ రాజు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు చిన్న సినిమాలతోనే బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాలను అందుకున్న నిర్మాత. ప్రస్తుతం దిల్ రాజు ఎలాగైతే సినిమాలను తనదైన శైలిలో తెరపైకి తీసుకొస్తున్నారో అప్పట్లో ఎమ్ఎస్ రాజు కూడా దర్శకులతో ప్రత్యేకంగా మాట్లాడి సినిమాలను వెండితెరపైకి తీసుకువచ్చేవారు. ఆయన ప్రమేయం లేకుండా ఏ సినిమా కూడా వెండితెరపై కి వచ్చేది కాదనే చెప్పాలి. అలా ఒక ప్రాజెక్టు విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకునేవారు. ఎమ్ ఎస్ రాజు…
నమ్రతా శిరోద్కర్.. గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఘట్టమనేని ఇంటి కోడలు.. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య.. అద్భుతమైన గృహిణి.. ప్రేమను పంచే తల్లి.. ఇలా ఆమె గురించి ఎన్ని చెప్పినా తక్కువే అవుతుంది. 1993 లో మిస్ ఇండియా మిస్ ఏషియా పసిఫిక్ గా ఎంపిక అయిన నమ్రతా.. ‘జబ్ ప్యార్ కిసీసే హోతాహై’ అనే హిందీ మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత వరుస వక్షలను అందుకొని…