MS Raju: ప్రభాస్, మహేష్ అడిగినా.. వాళ్ళతో సినిమా చేయను..?
ఎమ్ఎస్ రాజు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు చిన్న సినిమాలతోనే బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాలను అందుకున్న నిర్మాత. ప్రస్తుతం దిల్ రాజు ఎలాగైతే సినిమాలను తనదైన శైలిలో తెరపైకి తీసుకొస్తున్నారో అప్పట్లో ఎమ్ఎస్ రాజు కూడా దర్శకులతో ప్రత్యేకంగా మాట్లాడి సినిమాలను వెండితెరపైకి తీసుకువచ్చేవారు. ఆయన ప్రమేయం లేకుండా ఏ సినిమా కూడా వెండితెరపై కి వచ్చేది కాదనే చెప్పాలి. అలా ఒక ప్రాజెక్టు విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకునేవారు.
ఎమ్ ఎస్ రాజు ప్రొడక్షన్ లో వచ్చిన దేవి, వర్షం, ఒక్కడు, మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. ఇలా ఎన్నో సినిమాలు వరుసగా బాక్సాఫీసును బద్దల కొట్టాయి. అయితే ఎమ్ఎస్ రాజు కొంత కాలం అనంతరం ఇతర దర్శకులతో సినిమాలు చేయకుండా సొంతంగా డైరెక్షన్ చేస్తూ ఓ వర్గం వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 7 డేస్ 6 నైట్స్ అనే మూవీ కోసం మరోసారి దర్శకుడిగా మారిన ఆయన సినిమా ప్రమోషన్ లో బిజీ అయిపోయారు.
Also Read
- Tollywood : బీస్ట్ మోడ్లోకి స్టార్ బ్యూటీస్.. రియల్ స్టంట్స్ చేస్తోన్న హీరోయిన్స్
- OTT Movies : థియేటర్స్లో చిన్న చిత్రాలు.. దెబ్బ కొడుతున్న ఓటీటీ సినిమాలు
- Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే
- Bellamkonda : తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ - కావ్య వివాహం
సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం జూన్ 24 విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో MS రాజు స్టార్ హీరోలతో సినిమాలు చేయకపోవడానికి గల కారణాన్ని చెప్పారు. ప్రస్తుతం అగ్ర హీరోలుగా ఉన్న మహేష్ బాబు, ప్రభాస్ ఇద్దరి కెరీర్ కు మొదట బూస్ట్ ఇచ్చే విధంగా అప్పట్లో భారీగానే సినిమాలని నిర్మించారు. వర్షం, ఒక్కడు సినిమాలు అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేశాయి.
అయితే ఆ హీరోలు ఇప్పుడు ఎమ్.ఎస్.రాజు పై కృతజ్ఞతతో సినిమా చేయకుండా ఉంటారా అనే విషయం అందరిలో హాట్ టాపిక్ మారింది. ఇక అదే విషయంపై స్పందించిన ఈ నిర్మాత.. తాను స్టార్ హీరోలు, దర్శకుల వెంట వెళ్లనని స్పష్టం చేశారు. ఒకవేళ మహేష్ బాబు, ప్రభాస్ లు ఇద్దరు కూడా పెద్ద సినిమాలు చేయమని అడిగితే తాను సినిమా చేయనని, ఎందుకంటే తనకు నచ్చినట్లు సినిమాలు తీయడం ఇష్టం అని కామెంట్ చేశారు.
ఎమ్ ఎస్ రాజు అలా కామెంట్స్ చేయడంతో ఓ వర్గం ఆడియెన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. అంటే వాళ్లతో సినిమా చేసేటప్పుడు ఎమ్ ఎస్ రాజు తనకు నచ్చినట్టు తీశాడా..? లేక హీరోలకు ఇష్టం ఉన్నట్లు తీశాడా..? అంటూ ప్రేక్షకుల్లో ప్రశ్నలు మొదలయ్యాయి. ఏదేమైనా ఓ రేంజ్ లో వున్న నిర్మాత ఎమ్ఎస్ రాజు.. మహేష్, ప్రభాష్ తో సినిమా తీయలేను అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!